India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పీఎం కిసాన్ పథకం కింద 17వ విడత సాయాన్ని ఈ నెల 18న కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో దాదాపు రూ.20వేల కోట్లను యూపీ పర్యటనలో భాగంగా బటన్ నొక్కి ప్రధాని మోదీ బదిలీ చేస్తారు. ఈ పథకం కింద ఏటా రూ.6వేలను(3 విడతల్లో.. రూ.2వేలు చొప్పున) రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రం అందిస్తోంది. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే ఈ పెట్టుబడి సాయంపై మోదీ సంతకం చేశారు.
T20 వరల్డ్కప్ మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్గా బాబర్ ఆజమ్ నిలిచారు. 17 ఇన్నింగ్స్ల్లోనే ఆయన 549 పరుగులు చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో ధోనీ(529-భారత్), విలియమ్సన్(527-న్యూజిలాండ్), జయవర్దనె(360-శ్రీలంక), గ్రేమ్ స్మిత్(352-దక్షిణాఫ్రికా) ఉన్నారు.
AP: అసెంబ్లీ స్పీకర్గా టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడి పేరు ఖరారైందా..? ఖరారైనట్లు ఆయన స్వయంగా తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. నర్సీపట్నం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అయ్యన్న, ఐదుసార్లు మంత్రిగా పనిచేశారు. అయితే ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో స్పీకర్ పదవి ఇస్తారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అది నిజమేనంటూ ఆయనే ధ్రువీకరించారని అయ్యన్న సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
AP: నేడు సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి మ.12 గంటలకు ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. పనులను పరిశీలించిన అనంతరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడి, తిరిగి సా.4 గంటలకు ఉండవల్లికి బయలుదేరుతారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆయనకిదే తొలి పర్యటన.
హమాస్కు ఇజ్రాయెల్ చేసిన మూడు దశల కాల్పుల విరమణ ఒప్పందం గాజాలో యుద్ధాన్ని ముగించేందుకు ఉత్తమ మార్గమని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అభిప్రాయపడ్డారు. ముస్లింలకు ఈద్-అల్-అధా శుభాకాంక్షలు తెలిపారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య మారణకాండలో అమాయకులు బలవుతున్నారని పేర్కొన్నారు. వారి బాధ వర్ణాణాతీతం అన్నారు. పీడిత ముస్లిం వర్గాల హక్కుల కోసం అమెరికా ఎల్లప్పుడూ తమ గొంతు వినిపిస్తుందని చెప్పారు.
భారత టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగల్ పెరుజియా ఛాలెంజ్ ఫైనల్లో ఓటమి పాలయ్యారు. ఇటలీ ప్లేయర్ లూసియానతో జరిగిన తుది పోరులో 6-1, 6-2 పాయింట్ల తేడాతో ఓడిపోయారు. గంట వ్యవధిలోనే మ్యాచ్ పూర్తవ్వడం గమనార్హం. ఈ పరాజయంతో ఈ ఏడాది మూడో టైటిల్ వేటలో సుమిత్ విఫలమయ్యారు.
అగ్నిపథ్ పథకం రీ-లాంచ్ పేరుతో వాట్సాప్లో వైరల్ అవుతున్న సందేశం ఫేక్ అని PIB ఫ్యాక్ట్ చెక్ ట్వీట్ చేసింది. పథకం మార్పునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని పేర్కొంది. కాగా అగ్నిపథ్ పేరును ‘సైనిక్ సమాన్ స్కీమ్’గా మార్చడంతో పాటు డ్యూటీ పీరియడ్, పర్మినెంట్ శాతం, ఆదాయం పెంపు అంటూ ఓ పోస్ట్ వైరల్గా మారింది.
బిహార్లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల ఆహారంలో పాము పిల్ల కలకలం రేపింది. దీంతో 10 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఆహారంలో చచ్చిపోయిన పాము పిల్ల వచ్చినట్లు స్టూడెంట్స్ ఆరోపించారు. గతంలోనూ ఫుడ్ విషయమై ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదని వాపోయారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. మెస్ ఓనర్కు పెనాల్టీ విధించినట్లు పేర్కొన్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మరణానంతరం అవయవదానం చేయాలని నిర్ణయించుకున్నారు. ‘మెట్రో రెట్రో’ పేరిట జరిగిన కార్యక్రమలో ఈ ప్రతిజ్ఞ చేశానని ఆయన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఇది కాస్త వైరల్గా మారింది. దీంతో విశ్వక్ నిర్ణయంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. రియల్ హీరో అనిపించుకున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండ, జగపతి బాబు అవయవదానం ప్రతిజ్ఞ చేశారు.
తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశం నుంచి తరిమికొడతానని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. దేశం ఇప్పుడున్నంత ప్రమాదంలో ఎప్పుడూ లేదని మిషిగాన్లో నిర్వహించిన సమావేశంలో అన్నారు. ఉగ్రవాదులను దేశంలోకి అనుమతించే అధ్యక్షుడు కావాలా? వారిని దేశం నుంచి పంపే అధ్యక్షుడు కావాలా? అనేది ఓటర్లు నిర్ణయించుకోవాలని తెలిపారు. అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక అతిపెద్ద బహిష్కరణ చేపడతానన్నారు.
Sorry, no posts matched your criteria.