India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డయాబెటిస్ ఉన్నవారు షుగర్ ఫ్రీ స్వీట్లు తీసుకుంటుంటారు. కానీ వాటి వలన హృద్రోగాలు వస్తాయని అమెరికా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. తీపి కోసం కలిపే ఎరిథ్రిటాల్, సుక్రలోజ్, జినిటాల్ వంటి రసాయనాలు ప్రమాదకరమని వివరిస్తున్నారు. 3300మందిపై మూడేళ్ల పాటు చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలిందని వారు స్పష్టం చేశారు. రక్తంలోకి చేరే జినిటాల్.. ప్లేట్లెట్లను గడ్డకట్టేలా చేసి హృద్రోగానికి కారణమవుతోందని పేర్కొన్నారు.
AP: విశాఖ రుషికొండలో భవనాలపై వస్తున్న <<13451877>>విమర్శలపై<<>> YCP స్పందించింది. ‘అవి ప్రభుత్వ భవనాలే. ప్రైవేట్ ఆస్తులు కావు. విశాఖకు గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యంలో భాగంగానే వీటిని కట్టింది. విశాఖ ఆర్థిక రాజధాని అని CBN 1995 నుంచి ఊదరగొడుతున్నాడు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, PM విశాఖ వస్తే ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనం లేదు. వీటి ఫొటోలను వైరల్ చేస్తూ బురదచల్లడం వెనుక ఉద్దేశమేంటో ప్రజలకు తెలుసు’ అని ఫైర్ అయింది.
బాత్రూమ్ గోడలపై మహిళ ఫోన్ నంబరును ‘కాల్ గర్ల్’ అంటూ రాసిన వ్యక్తిపై నమోదైన కేసును కొట్టేయడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. ఇలాంటి కేసులను కఠినంగా పరిగణిస్తామంది. పిటిషనర్ చర్యతో మహిళ మానసికంగా చిత్రహింసలకు గురైందని వ్యాఖ్యానించింది. మహిళల గోప్యతకు భంగం కలిగించే ఇలాంటి చర్యలు సమర్థనీయం కాదని తెలిపింది. బాధితురాలి నంబరు నిందితుడికిచ్చిన మహిళను కూడా విచారించే హక్కు అధికారులకు ఉందని చెప్పింది.
TG: రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచుతారు. 2022 మార్చిలో లిక్కర్ రేట్లు పెంచారు. మళ్లీ ఈ ఏడాది మార్చిలోనే పెంచాల్సి ఉంది. కానీ ఎన్నికల కారణంగా ధరల పెంపు వాయిదా పడింది. ఇప్పుడు అన్ని బ్రాండ్ల మద్యంపై 20 నుంచి 25 శాతం వరకు ధరలు పెంచనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా రూ.37 వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది.
AP: అమరావతి పునర్నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఇవాళ బాధ్యతలు స్వీకరించిన ఆయన్ను రాజధాని రైతులు సన్మానించారు. ‘అమరావతి పనులపై అధ్యయనం చేసి టైమ్బౌండ్ నిర్ణయిస్తాం. పాత ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మిస్తాం. 3 దశల్లో రూ.లక్ష కోట్లు ఖర్చు అవుతుంది. తొలి దశ పనులకు రూ.48వేల కోట్లు ఖర్చవుతాయి. రాజధానిలో రోడ్లు ధ్వంసం, చోరీలపై కమిటీతో విచారణ జరిపిస్తాం’ అని తెలిపారు.
TG: హైదరాబాద్లోని వైఎస్ జగన్ ఇంటి ముందున్న నిర్మాణాన్ని GHMC అధికారులు కూల్చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి సందేహాలు వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డికి తెలియకుండానే ఆ నిర్మాణాలు కూల్చివేశారా? అని ప్రశ్నించారు. కూల్చివేసిన అధికారులను ఎందుకు <<13451537>>బదిలీ<<>> చేశారని ఆయన అడిగారు. కాగా అదే ప్రాంతంలో ఉన్న ఓ సీనియర్ కాంగ్రెస్ నేత ఫిర్యాదుతోనే కూల్చివేత చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
TG: విద్యుత్ కొనుగోళ్లపై KCR లేఖ అందిందని, దానిపై ఎల్లుండి సమీక్షిస్తామని పవర్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి వెల్లడించారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుతో పాటు భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్లపై కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారన్నారు. KCR చెప్పిన అంశాలను పరిశీలిస్తున్నామని, నిపుణుల కమిటీతో చర్చిస్తామన్నారు. జరిగిన పరిణామాలను మాత్రమే మీడియా సమావేశంలో వివరించామని ఆయన చెప్పుకొచ్చారు.
AP: ప్రభుత్వ ఫర్నిచర్ను జగన్ వాడుకుంటున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ‘జగన్ ఫర్నిచర్ దొంగ. ఆయనకు నైతికత ఉంటే ఫర్నిచర్ను ప్రభుత్వానికి అప్పగించాలి. సరెండర్ చేయకుండా YCP నేతలు నీతులు చెప్పడం సిగ్గుచేటు. ₹50 కోట్ల CMO డబ్బుతో తాడేపల్లి, లోటస్పాండ్లలోని ఇళ్లలోకి ఫర్నిచర్, ఇతర వసతులను జగన్ అమర్చుకున్నారు. గతంలో కోడెలకు జగన్ చేసిందే ఈరోజు ఆయనకు తిరిగి వచ్చింది’ అని మంత్రి విమర్శించారు.
TG: రాష్ట్రంలోని గనుల్లో కనీసం 6 బ్లాకులకు ఈ నెలాఖరులోగా వేలం నిర్వహించాలని కేంద్ర గనుల శాఖ రాష్ట్ర సర్కారుకు ఓ లేఖలో తేల్చిచెప్పింది. గడచిన తొమ్మిదేళ్లలో ఒక్క గనిని కూడా వేలం వేయలేదని తెలిపింది. ఒకవేళ ఈ ప్రక్రియలో రాష్ట్రం విఫలమైతే తామే వేలం చేపడతామని తేల్చిచెప్పింది. 2015లో మినరల్ బ్లాకుల వేలం ప్రక్రియ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా 354 మేజర్ మినరల్ బ్లాకులను వేలం వేశారు.
భారత ఎన్నికల సంఘం మరికాసేపట్లో ప్రెస్మీట్ నిర్వహించనుంది. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ కొద్దిరోజులుగా పలు పార్టీల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ సైతం ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం ఉందంటూ ట్వీట్ చేశారు. ఈ అంశంపై ప్రెస్మీట్లో ఈసీ వివరణ ఇచ్చే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.