News January 10, 2025

పన్నుల వాటా.. తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు ఇలా

image

FY2024-25కు గాను పన్నుల వాటా కింద రాష్ట్రాలకు రూ.1,73,030 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అత్యధికంగా యూపీకి రూ.31,039 కోట్లు కేటాయించగా, ఏపీకి రూ.7,002 కోట్లు, తెలంగాణకు రూ.3,637 కోట్లు దక్కాయి. మూలధన వ్యయం, అభివృద్ధి, సంక్షేమ పనులకు ఈ నిధులను రిలీజ్ చేసింది. బిహార్‌కు రూ.17,403 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.13,582 కోట్లు, బెంగాల్‌కు రూ.13,017 కోట్లు కేటాయించింది.

News January 10, 2025

BREAKING: పరీక్ష తేదీలు వచ్చేశాయ్

image

APలో 8 ఉద్యోగ నోటిఫికేషన్ల <>పరీక్ష తేదీలను<<>> APPSC ప్రకటించింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్, మెడికల్ విభాగంలో లైబ్రేరియన్లు, Asst.ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, Asst.స్టాటిస్టికల్ ఆఫీసర్, Asst.ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్, Asst.కెమిస్ట్, దివ్యాంగుల సంక్షేమ శాఖలో Asst.డైరెక్టర్ ఉద్యోగాలకు ఏప్రిల్ 27 నుంచి 30వ తేదీ వరకు వివిధ తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి.

News January 10, 2025

అటూ ఇటూ ఊగిసలాట.. చివరికి నష్టాలు

image

స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఊగిస‌లాట‌ల‌తో సాగాయి. బెంచ్ మార్క్ సూచీల్లో కీల‌క స‌పోర్ట్‌, రెసిస్టెన్స్ స్థాయుల్లో బుల్స్‌-బేర్స్ త‌మ ప‌ట్టు నిలుపుకున్నారు. Sensex 241 పాయింట్లు కోల్పోయి 77,378 వ‌ద్ద‌, Nifty 95 పాయింట్ల న‌ష్టంతో 23,431 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. IT స్టాక్స్ 3.44% లాభ‌ప‌డి టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇత‌ర అన్ని రంగాలు న‌ష్టాల‌బాట‌ప‌ట్టాయి. Q3 ఫలితాలు మెప్పించడంతో TCS 5.60% లాభపడింది.

News January 10, 2025

ఏడాదికి 10వేల కోట్ల అరటిపండ్లు లాగిస్తున్నారు

image

అరటిపండు పోషకాలు కలిగి ఉండటం వల్ల, రోజుకు ఒకటైనా తినడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. దీంతో ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే పండుగా అరటిపండుకు పేరుంది. ఏటా 100 బిలియన్ల(10వేల కోట్లు) కంటే ఎక్కువ అరటిపండ్లను లాగిస్తున్నట్లు తెలుస్తోంది. పోషక ప్రయోజనాలు, సౌలభ్యం కారణంగా దీనికి ప్రజాదరణ లభించింది. చాలా చోట్ల ఆహారంలో అరటిపండునూ భాగం చేస్తుంటారు.

News January 10, 2025

దేశంలో లాక్డౌన్ అంటూ ప్రచారం.. స్పందించిన PIB

image

దేశంలో hMPV వ్యాప్తిని నిరోధించడానికి కేంద్రం లాక్డౌన్ విధించిందనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సైతం ‘లాక్డౌన్’ థంబ్‌నెయిల్స్‌తో అసత్యపు ప్రచారం చేస్తుండటంతో కేంద్రానికి చెందిన PIB FACTCHECK స్పందించింది. ఇలాంటివి నమ్మి ఆందోళన చెందొద్దని, కేంద్రం అలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే వరకూ ఏదీ నమ్మొద్దని తెలిపింది.

News January 10, 2025

హిందీ జాతీయ భాష కాదు: అశ్విన్

image

టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష అనేది కేవలం అధికార భాష మాత్రమేనని దానికి జాతీయ హోదా లేదని వ్యాఖ్యానించారు. తమిళనాడులోని ఓ ప్రైవేట్ కళాశాల స్నాతకోత్సవంలో పాల్గొన్న అశ్విన్ విద్యార్థులతో ముచ్చటిస్తూ ఇలా మాట్లాడారు. అయితే ప్రస్తుతం ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే అంతర్జాతీయ టెస్ట్ మ్యాచులకు అశ్విన్ వీడ్కోలు చెప్పారు.

News January 10, 2025

రూ.700 కోట్ల లాభాలు ఎక్కడో కేటీఆర్ చూపాలి: బండి సంజయ్

image

TG: ఈ-కార్ రేస్ కేసులో KTR అరెస్టయితే ఆందోళన అవసరం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పారు. ఆయనేమైనా దేశం కోసం పోరాడారా అని ప్రశ్నించారు. KCR, రేవంత్ కుటుంబాల మధ్య ఏదో ఒప్పందం ఉందని, అందుకే కేసులో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. KCR ఫ్యామిలీ అంతా అవినీతిమయమన్నారు. ఈ-కార్ రేసులో ప్రభుత్వానికి రూ.700 కోట్ల లాభాలు ఎక్కడొచ్చాయో చూపించాలని డిమాండ్ చేశారు.

News January 10, 2025

టీమ్ ఇండియా టార్గెట్ 239 రన్స్

image

భారత మహిళలతో జరుగుతున్న తొలి వన్డేలో ఐర్లాండ్ ఓవర్లన్నీ ఆడి 238/7 పరుగులు చేసింది. గాబీ లూయిస్ (92) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. కొద్దిలో శతకం చేజార్చుకున్నారు. లీ పాల్ (59) అర్ధ సెంచరీతో రాణించారు. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా రెండు వికెట్లు తీశారు. టిటాస్ సాధు, సయాలి, దీప్తీ శర్మ తలో వికెట్ పడగొట్టారు. భారత్ టార్గెట్ 239 పరుగులుగా ఉంది.

News January 10, 2025

గాయపడిన హీరోయిన్ రష్మిక!

image

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గాయపడినట్లు తెలుస్తోంది. జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా ఆమెకు గాయం అయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. పుష్ప-2 సినిమా విజయం తర్వాత ఆమె సల్మాన్ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘సికందర్’లో నటిస్తున్నారు. చిత్రీకరణ మొదలుపెట్టేందుకు సిద్ధమవుతుండగా రష్మిక గాయపడటం గమనార్హం. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని రష్మిక అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.

News January 10, 2025

బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్

image

నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహరాజ్’ సినిమా నుంచి మరో ట్రైలర్ రాబోతోంది. రిలీజ్ ట్రైలర్‌ను ఇవాళ సా.5:53 గంటలకు విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇది మొదటి ట్రైలర్‌ను మించేలా ఉంటుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించగా, తమన్ సంగీతం అందించారు. ఈనెల 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.