News September 6, 2024

మహిళా పక్షపాత పార్టీలో చేరడం గర్వంగా ఉంది: వినేశ్

image

మహిళలకు అండగా నిలిచే కాంగ్రెస్ పార్టీలో చేరడం తనకు గర్వంగా ఉందని మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగట్ పేర్కొన్నారు. బజరంగ్ పునియాతో కలిసి ఆమె కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్న సంగతి తెలిసిందే. ‘మేం రోడ్లపైకి వచ్చినప్పుడు బీజేపీ తప్ప అన్ని పార్టీలు మాకు మద్దతుగా నిలిచాయి. మా కన్నీళ్లను, బాధను అర్థం చేసుకున్నాయి. బీజేపీ నేతలు మాత్రం మాపై తప్పుడు ప్రచారం వ్యాప్తి చేశారు. కాంగ్రెస్‌కు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

News September 6, 2024

వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ ఏదో తెలుసా?

image

హిట్ సినిమాల గురించి అందరికీ తెలుసు. వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ ఏంటో తెలుసా? అదే 1999లో వచ్చిన హాలీవుడ్ మూవీ ‘The 13th Warrior’. ₹1,300కోట్ల బడ్జెట్‌తో తీస్తే ₹511కోట్లే వచ్చాయి. జాన్ మెక్‌టైర్నన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో బాగ్దాదీ యాత్రికుడు అహ్మద్ ఇబ్న్ ఫడ్లాన్ పాత్రలో ఆంటోనియో బాండెరాస్ నటించారు. ఆ సినిమా ఫ్లాప్ తర్వాత మరెవరూ ముస్లింను హీరోగా చూపించే సాహసం చేయరని విమర్శకులు అన్నారు.

News September 6, 2024

కాంగ్రెస్‌లోకి వినేశ్, పునియా.. సాక్షి స్పందనిదే..

image

వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్‌లో చేరడం వాళ్ల వ్యక్తిగతమని రెజ్లర్ సాక్షి మాలిక్ అన్నారు. తనకు కూడా రాజకీయ పార్టీల నుంచి ఆఫర్లు వచ్చాయని, కానీ వాటిని తిరస్కరించినట్లు చెప్పారు. రెజ్లింగ్‌లో మహిళల కోసం పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. రాబోయే హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ తరఫునా తాను ప్రచారం చేయనని సాక్షి తేల్చి చెప్పారు.

News September 6, 2024

వినేశ్, బజ‌రంగ్ పోటీ చేసే స్థానాలు ఇవే

image

కాంగ్రెస్‌లో చేరిన రెజ్ల‌ర్ వినేశ్ ఫొగట్ హ‌రియాణా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జులానా స్థానం నుంచి పోటీ చేస్తార‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. అలాగే మ‌రో రెజ్ల‌ర్ బజ‌రంగ్ పునియా బాద్లీ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో దిగ‌నున్న‌ట్టు తెలుస్తోంది. జులానా నియోజ‌క‌వ‌ర్గం సంప్రదాయ మ‌ల్ల‌యోధుల‌కు పెట్టింది పేరు. బాద్లీ ఢిల్లీ-గురుగ్రామ్‌కు ద‌గ్గ‌ర‌గా ఉండి అన్ని రంగాల్లో వృద్ధి చెందుతున్న కీలక పట్టణం.

News September 6, 2024

ఇంట్లో ప్రతిష్ఠించే గణపయ్యకు తొండం ఎటువైపు ఉండాలో తెలుసా?

image

ఏ కార్యమైనా మొదట పూజలందుకునేది గణనాథుడే. చవితి సందర్భంగా ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసే భక్తులకు పురోహితులు ఓ సూచన చేశారు. ఇంట్లో ప్రతిష్ఠించే గణపయ్య ప్రతిమ తొండం ఎడమ వైపు ఉండేలా చూసుకోవాలని చెప్పారు. దీనిని పూజిస్తే ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ నిండుతుందంట. కుడివైపు తొండం ఉన్న విగ్రహం వల్ల కష్టాలు తొలగిపోయి మంచి జరుగుతుందని చెబుతున్నారు. దీన్ని ‘సిద్ధి వినాయకుడు’ అంటారు.

News September 6, 2024

నితీశ్ కుమార్ మళ్లీ పక్కచూపులు!

image

బిహార్‌లో CM నితీశ్ కుమార్ మ‌ళ్లీ ప‌క్క‌చూపులు చూస్తున్నార‌న్న ఊహాగానాలు జోరందుకున్నాయి. విప‌క్ష RJD నేత తేజ‌స్వీ యాద‌వ్‌తో నితీశ్ భేటీ వార్తలు ఈ ప్రచారానికి బలంచేకూర్చాయి. ఈ ఊహాగానాల మ‌ధ్య BJP జాతీయ అధ్య‌క్షుడు JP న‌డ్డా 2 రోజులు బిహార్‌లో పర్యటిస్తుండడంతో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కించాయి. అయితే, నితీశ్-తేజస్వీల భేటీ కేవలం స‌మాచార కమిష‌న‌ర్ నియామ‌కంపైనే అని అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి.

News September 6, 2024

మరో 1,300 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు: మంత్రి రాజనర్సింహ

image

TG: వైద్యారోగ్య శాఖలో 282 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ నియామక పత్రాలను అందించారు. అంతకుముందు కోఠి మెడికల్ కాలేజీ ప్రాంగణంలో రూ.121కోట్ల నిధులతో నిర్మించే హాస్టల్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే 1,284 ల్యాబ్ టెక్నీషియన్లను నియమించడానికి నోటిఫికేషన్ వేశామని, ఏడాదిలో ఇంకో 1,300 మందిని రిక్రూట్ చేస్తామని దామోదర అన్నారు.

News September 6, 2024

‘టైమ్స్ AI ప్రభావశీలురు’ జాబితాలో అశ్విని వైష్ణవ్, అనిల్ కపూర్

image

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ రంగంలో ప్రభావం చూపగల 100మంది ప్రముఖుల జాబితాలో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, నటుడు అనిల్ కపూర్ వంటి ప్రముఖులకు చోటు దక్కింది. ఏఐలో తన వివరాలను దుర్వినియోగం చేయడంపై కపూర్ న్యాయపోరాటం చేసి గెలిచారు. ఈ కారణంగా ఆయనకు లిస్ట్‌లో చోటు దక్కినట్లు టైమ్స్ తెలిపింది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, అమెజాన్ ఏజీఐ హెడ్ సైంటిస్ట్ రోహిత్ ప్రసాద్ తదితరులు జాబితాలో ఉన్నారు.

News September 6, 2024

ఖైరతాబాద్ గణేశుడి తొలి PHOTO

image

తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్దదిగా ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ నిజరూపాన్ని నిర్వాహకులు ఈరోజు చూపించారు. విగ్రహానికి శిల్పి చిన్నస్వామి రాజేందర్ నేత్రాలంకరణ పూర్తిచేశారు. 70 అడుగుల శ్రీసప్తముఖ మహాశక్తి గణపతిగా స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈసారి అయోధ్య రాముడు కూడా గణపయ్య చెంత ఉండడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫొటోలు, వీడియోలు తీస్తూ సందడి చేస్తున్నారు.

News September 6, 2024

చిప్ తయారీ కంపెనీ పెడుతున్న అదానీ!

image

ఇజ్రాయెల్ టవర్ సెమీకండక్టర్, అదానీ గ్రూప్ కలిసి భారత్‌లో చిప్ తయారీ కంపెనీని నెలకొల్పుతాయని తెలిసింది. రూ.83,947 కోట్ల పెట్టుబడితో నవీ ముంబైలో ఈ జాయింట్ వెంచర్‌ను నిర్మిస్తారని సమాచారం. మహారాష్ట్ర క్యాబినెట్ కమిటీ ఇప్పటికే ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు DyCM దేవేంద్ర ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. ప్రాజెక్ట్ తొలి దశలో నెలకు 40వేలు, మొత్తం పూర్తయ్యాక 80వేల చిప్ వేఫర్స్ ఉత్పత్తి చేస్తారు.