India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చైనాలో వేగంగా వ్యాపిస్తున్న HMPV భారత్నూ చేరినట్లు తెలుస్తోంది. బెంగళూరులో ఓ 8 నెలల చిన్నారి అస్వస్థతకు గురికాగా పేరంట్స్ ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి ల్యాబ్ టెస్టులో బేబీకి హ్యూమన్ మెటాన్యుమోవైరస్ (HMPV) పాజిటివ్గా తేలింది. దీనిపై సమాచారం అందినట్లు పేర్కొన్న కర్ణాటక ప్రభుత్వం తమ ల్యాబులో నిర్ధారించాల్సి ఉందని తెలిపింది. ఆ చిన్నారి విదేశాలకు ప్రయాణించకపోవడం గమనార్హం.

ప్రశాంత్ నీల్-Jr.NTR సినిమా షూటింగ్ సంక్రాంతి తర్వాత కర్ణాటకలో ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ మూవీలో మలయాళ స్టార్లు టొవినో థామస్, బిజూ మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో NTR కొత్త లుక్లో కనిపించనున్నారు.

సిడ్నీ టెస్టు 2వ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ ఔట్ అవగానే అసహనానికి గురైన విషయం తెలిసిందే. దీనిపై ఆసీస్ మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. ఒకే తరహాలో పదే పదే పెవిలియన్కు చేరుతుండటంపై కోహ్లీ తనపై తానే కోపం చూపించుకున్నాడని చెప్పారు. విరాట్కు ఈ సిరీస్ కచ్చితంగా నిరాశ కలిగించిందన్నారు. కానీ అతని వద్ద ఇంకా చాలా పరుగులు ఉన్నాయని ఆయన చెప్పారు. BGTలో కోహ్లీ 190పరుగులే చేశారు.

AP: మాజీ మంత్రి పేర్ని నాని వేసిన బెయిల్ ముందస్తు పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఆయన ఫ్యామిలీకి చెందిన గోదాములో రేషన్ బియ్యం మాయమైన ఘటనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా పేర్ని నాని ఫ్యామిలీ ఉండగా, ఆయన భార్యకు మచిలీపట్నం కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పేర్ని నాని ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా నేడు విచారణ జరగనుంది.

కొంత మంది భార్యలు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మగవాళ్లు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ మొత్తంపై కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోతున్నారు. భారత చట్టాలు వారికే అనుకూలంగా ఉన్నాయని, వాటిని మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఏ నేరం చేయకపోయినా ఎందుకు బలవ్వాలని ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

భార్య వేధింపులు తట్టుకోలేక మరో భర్త బలయ్యాడు. గుజరాత్ జమరాలకు చెందిన సురేశ్కు 17 ఏళ్ల క్రితం పెళ్లైంది. అతడికి నలుగురు పిల్లలు ఉన్నారు. భార్య జయ తనను మానసికంగా టార్చర్ చేస్తోందని సురేశ్ ఆత్మహత్యకు ముందు వీడియో రికార్డు చేశాడు. తన చావుకు కారణమైనందుకు జీవితాంతం గుర్తుంచుకునేలా ఆమెకు గుణపాఠం చెప్పాలని అందులో కోరాడు. సురేశ్ తండ్రి ఫిర్యాదుతో పోలీసులు జయపై కేసు నమోదు చేశారు.

AP: రాష్ట్రంలో తెల్లారే పెన్షన్లు ఇవ్వకపోతే ప్రపంచం తలకిందులవుతుందా అని రాష్ట్ర గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం అంటే ఇదేనా? అని నిలదీశారు. వేరే ఊరిలో ఉన్న మహిళా ఉద్యోగి పెన్షన్లు ఇవ్వడానికి ఎన్నిగంటలకు నిద్రలేచి రావాలో గమనించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా IR, పెండింగ్ డీఏల్లో ఒకటైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బ్రెజిల్కు చెందిన ఇద్దరు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ ఢిల్లీ ఎయిర్పోర్టులో పట్టుబడ్డారు. డ్రగ్ క్యాప్సుల్స్ మింగిన వీరిని కస్టమ్స్ టీం గుర్తించగా, ప్రాథమిక విచారణలో కొన్నింటిని నిందితులే వెలికితీశారు. ఆపై ఆస్పత్రికి తరలించి శస్త్ర చికిత్స చేసి పురుషుడి కడుపులోనుంచి 937గ్రా.బరువున్న 105, మహిళ నుంచి 562గ్రా. 58 క్యాప్సుల్స్ బయటకు తీశారు. వీటి విలువ రూ.20cr ఉంటుందని అధికారులు చెప్పారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. కాకినాడ పోర్ట్ సెజ్ కేసు, అక్రమంగా షేర్ల బదలాయింపు వ్యవహారంలో అధికారులు VSRను ప్రశ్నించనున్నారు. ఉ.10 గంటలకు హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో విచారణ ప్రారంభం కానుంది.

గతేడాది కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. అవి ఏ ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతున్నాయో చూద్దాం.
*దేవర, లక్కీ భాస్కర్, అమరన్, సత్యం సుందరం, మహారాజ, ఆడు జీవితం, సరిపోదా శనివారం- నెట్ఫ్లిక్స్
*ప్రేమలు, కిల్- డిస్నీ+హాట్స్టార్
*కల్కి- అమెజాన్ ప్రైమ్
*హనుమాన్- ZEE5, జియో సినిమా
>>ఇంకా మీకు నచ్చిన సినిమాలేవో కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.