India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని అమలు చేయాలని TGSRTC నిర్ణయించింది. త్వరలో పల్లె వెలుగు సహా అన్నింటిలోనూ దీనిని అమలు చేయనుంది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్ను రూపొందించింది. ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్(AFCS)ను అందుబాటులోకి తీసుకురానుంది. 13వేల కొత్త మెషీన్లకు ఆర్డర్ ఇచ్చింది. అలాగే బస్సు పాసుల స్థానంలో డిజిటల్ కార్డులను ఇవ్వనుంది.
‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అని పెద్దలంటుంటారు. మనం చేసే సాయం ఎంత చిన్నదైనా ఆ ఆలోచన రావడం ఎంతో గొప్పది. హైదరాబాద్కు చెందిన సాయి అనే రాపిడో బైక్ నడిపే వ్యక్తి తాను రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బులను విరాళమిచ్చి మంచిమనసు చాటారు. వరద బాధితుల కోసం రూ.780ను తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు డొనేట్ చేసినట్లు ట్వీట్ చేశారు. సాయిని అంతా అభినందిస్తున్నారు. మీరూ <<14018795>>ఇలా విరాళం<<>> ఇవ్వొచ్చు.
బాలీవుడ్లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘కిల్’ అర్ధరాత్రి నుంచి డిస్నీ+ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. లక్ష్ లల్వానీ, తాన్య కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం జులై 5న విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ఇందులోని యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోవడంతో ‘జాన్ విక్’ ఫేమ్ ఛార్లెస్ ఈ మూవీ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. టొరంటో ఇంటర్నేషనల్, ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా ప్రదర్శితమైంది.
ట్రంప్, కమల పోటీలో ఎవరు గెలిచినా భారత్, అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని USISPF సీఈవో ముకేశ్ అఘి అన్నారు. US జియో పొలిటికల్ లక్ష్యాలు, చైనా దూకుడు నియంత్రణకు భారతే కీలకం అన్నారు. ‘నిజమే, చైనా సమీపంలో వియత్నాం, కాంబోడియా, థాయ్లాండ్ ఉన్నాయి. కానీ భారత్ చేకూర్చే ప్రయోజనం మరెక్కడా దొరకదు. సరఫరా గొలుసు అంతరాయాలు ఉండొద్దంటే వారే కీలకం. పైగా చాలా కంపెనీలకు అదే మార్కెట్గా మారింది’ అని ఆయన వెల్లడించారు.
వైద్యురాలిపై హత్యాచారం కేసులో పాలనా యంత్రాంగం వ్యవహరించిన తీరు అస్సలు బాగాలేదని బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ అన్నారు. ప్రజల్లో న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోయిందని పేర్కొన్నారు. అందుకే తీవ్ర ఆందోళనలు జరుగుతున్నాయని వెల్లడించారు. ‘బెంగాల్లో తప్పు మీద తప్పు జరుగుతోంది. ప్రభుత్వం ప్రజలకు నమ్మకం కలిగించాలి. దోషులను శిక్షించాలి. చట్టం చేస్తే సరిపోదు. పక్కాగా అమలు చేయడం మరింత ముఖ్యం’ అని తెలిపారు.
ఈ ఏడాది చవితి తిథి సెప్టెంబర్ 6, 7 తేదీల్లో ఉంటుందని పండితులు తెలిపారు. అయితే ధృక్ సిద్ధాంతం ప్రకారం 7నే (శనివారం) వినాయక చవితి జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఉ.11.03 గంటల నుంచి మ.1.30 గంటల మధ్యలో గణేశుడి విగ్రహ ప్రతిష్ఠాపనకు శుభ ముహూర్తం ఉందని పేర్కొన్నారు. సాయంత్రం 6.22 గంటల నుంచి రా.7.30 మధ్యలో వరసిద్ధి వినాయక వ్రత సంకల్పం చేసుకోవచ్చని చెబుతున్నారు.
AP: కృష్ణా నదిలో వరద తగ్గుతుండగా ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉప్పొంగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం 12.2 అడుగుల వద్ద నీటి మట్టం ఉండగా, 10.39 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
AUSతో జరగనున్న 3 T20ల సిరీస్కు ENG కెప్టెన్గా ఫిల్ సాల్ట్ నియమితులయ్యారు. జోస్ బట్లర్ గాయం వల్ల దూరమవడంతో సాల్ట్కు అవకాశం దక్కింది. ఇతను 31 T20ల్లో 165.11 స్ట్రైక్ రేటుతో 885 రన్స్ చేశారు. ఈ నెల 11, 13, 15 తేదీల్లో మ్యాచ్లు జరగనున్నాయి.
టీమ్: ఫిల్ సాల్ట్(C), ఆర్చర్, జాకబ్, బ్రైడన్, జోర్డాన్, సామ్ కరన్, హల్, జాక్స్, లివింగ్స్టోన్, సాకిబ్, మౌస్లీ, ఓవర్టన్, రషీద్, టోప్లీ, జాన్ టర్నర్
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులు మట్టి వినాయకులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. కొన్నిచోట్ల వివిధ వస్తువులతో తయారుచేసిన గణనాథులను సైతం ప్రతిష్ఠిస్తుంటారు. విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతంలో మాత్రం ఇండియాలోనే తొలిసారి బెల్లంతో 75 అడుగుల ఎత్తులో భారీ గణపయ్యను రూపొందిస్తున్నారు. రాజస్థాన్ నుంచి స్పెషల్గా 20 టన్నుల బెల్లాన్ని తీసుకొచ్చారు. దీనికి రూ.50లక్షల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్ వివాదంపై లక్ష్మణ రేఖను దాటొద్దని అమెరికాను రష్యా హెచ్చరించింది. వారికి ఆయుధాలు పంపిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని సంకేతాలిచ్చింది. ‘ఆయుధాల సరఫరాతో US సొంత గీత దాటింది. మేం గీత దాటితే ఎలా ఉంటుందో వాళ్లు అర్థం చేసుకోవాలి. అదెక్కడుందో వారికి బాగా తెలుసు. రష్యాతో పరస్పర సంయమనం కోల్పోతే వారికే ప్రమాదం. ఇప్పటికీ అక్కడ కాస్త తెలివైనోళ్లు ఉన్నారనుకుంటా’ అని రష్యా మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు.
Sorry, no posts matched your criteria.