India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

క్రికెట్ మక్కాగా పిలుచుకునే లార్డ్స్ మైదానం మంచుతో నిండిపోయింది. మైదానం మొత్తం మంచు దుప్పటి పరచినట్లుగా మారింది. దీంతో స్టేడియం అందాలు రెట్టింపు అయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా క్రిస్మస్కు ముందు ఇంగ్లండ్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో మంచు కూడా అధికంగా పడుతుంటుంది.

AP: మహారాష్ట్ర సీఎం, మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు ఇవాళ ప్రత్యేక విమానంలో ముంబై వెళ్తున్నారు. ఎన్డీఏ నేతల ఆహ్వానం మేరకు ఆయన ఈ వేడుకలకు హాజరవుతున్నారు. రేపు, ఎల్లుండి విశాఖలో పర్యటిస్తారు. కాగా చంద్రబాబు పర్యటనల కో ఆర్డినేటర్గా మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ నియమితులయ్యారు. గతంలో చంద్రబాబు ఎన్నికల పర్యటనలను కూడా ఈయనే చూసుకున్నారు.

నేటి తరం అమ్మాయిలు కబీర్ సింగ్(తెలుగులో అర్జున్ రెడ్డి) వంటి అబ్బాయిల్నే ప్రేమిస్తున్నారని ఆ మూవీ హీరో షాహిద్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ‘కబీర్ పాత్రని నేను కచ్చితంగా ఇష్టపడను. కానీ అలాంటి వారు సొసైటీలో ఉన్నారు. ఆ పాత్ర చేసే అనేక పనులు ఆమోదయోగ్యం కాదు. అయితే, చాలామంది అమ్మాయిలు అలాంటి వాళ్లను ప్రేమిస్తున్నారు. అందుకే ఆ సినిమా చేశాం. చూడాలా వద్దా అనేది ఆడియన్స్ ఇష్టం’ అని పేర్కొన్నారు.

మిగ్-21 బైసన్ విమానాల్ని మరికొంత కాలం కొనసాగించాలని భారత వాయుసేన నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘ఎగిరే శవపేటికలు’గా పేరొందిన మిగ్లలో సమస్యల కారణంగా వందలాదిమంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. వీటిని ఈ ఏడాది డిసెంబరుకల్లా తప్పించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే వాటి స్థానంలో రావాల్సిన తేజస్ MK1A విమానాల తయారీ లేట్ కావడంతో మిగ్లను మరికొంతకాలం కొనసాగించనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.

కేంద్రం తీసుకొచ్చిన ELI పథకం ప్రయోజనాల కోసం ఆధార్ అనుసంధాన UAN యాక్టివేషన్ గడువును EPFO పొడిగించింది. నవంబర్ 30తోనే డెడ్లైన్ ముగియగా దాన్ని డిసెంబర్ 15 వరకు పెంచింది. ఈ స్కీం ద్వారా ఉద్యోగులకు 3 విడతల్లో రూ.15 వేల వరకు సాయం అందుతుంది. ఉద్యోగికి, యజమానికి ప్రోత్సాహకాలు, ప్రతి కొత్త ఉద్యోగికి EPFO వాటాగా యజమానులు చెల్లించేందుకు రెండేళ్లపాటు నెలకు రూ.3వేల వరకు కేంద్రం ఇస్తుంది.

చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(BRI)లో భారత పొరుగు దేశం నేపాల్ చేరింది. ఎన్నికల ఫలితాల అనంతరం నేపాల్ ప్రధాని న్యూఢిల్లీకి వచ్చే సంప్రదాయాన్ని పక్కన పెట్టి పీఎం కేపీ ఓలి శర్మ తాజాగా బీజింగ్ వెళ్లారు. సోమవారం నుంచీ అక్కడే ఉంటూ బీఆర్ఐలో చేరే ప్రక్రియపై చర్చలు జరిపారు. తాజాగా ఆ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు నేపాల్ విదేశాంగ కార్యాలయం ప్రకటించింది.

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే తెలివైనవారిలో ఒకరని కువైట్ విదేశాంగ మంత్రి అలీ అల్ యాహ్యా ప్రశంసించారు. తమకు ఎంతో విలువైన భాగస్వామి అని ఆయన కొనియాడారు. ‘నన్ను భారత్కు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. మోదీ ఈ దేశాన్ని ఒక మంచి దశలో ఉంచుతారు. భారత్తో మా సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయి’ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఇరు దేశాల సంబంధాలను బలపరిచేందుకు యాహ్యా ఇక్కడికి వచ్చారు.

పాకిస్థాన్తో T20 సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు హెన్రిచ్ క్లాసెన్ నాయకత్వం వహిస్తారు. మార్క్రమ్, జాన్సెన్, మహరాజ్, స్టబ్స్, రబడ వంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. జట్టు: క్లాసెన్, క్రూగర్, పీటర్, బార్ట్మన్, లిండే, రికెల్టన్, బ్రెట్జ్కీ, మఫాకా, షంషీ, ఫెర్రీరా, మిల్లర్, సైమ్లైన్, హెండ్రిక్స్, నోకియా, డస్సెన్. ఈ నెల 10 నుంచి ఇరు జట్ల మధ్య సిరీస్ ప్రారంభం కానుంది.

AP: CM చంద్రబాబు ధోరణి ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్లా ఉందని YCP MP విజయసాయిరెడ్డి మండిపడ్డారు. CM నియంతృత్వ ధోరణితో YCP నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారని ట్వీట్ చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం అణచివేత చర్యలు ఆయన పిరికితనానికి నిదర్శనం. ఆయన రాజకీయ ప్రతీకారానికి ఎలాంటి జస్టిఫికేషన్ లేదు. ప్రజలు జీవించే హక్కు కోల్పోయి అధికార పార్టీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతుకుతున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

* 1901: హాలీవుడ్ దర్శకుడు వాల్ట్ డిస్నీ జననం
* 1905: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం షేక్ అబ్దుల్లా జననం
* 1985: టీమ్ ఇండియా క్రికెటర్ శిఖర్ ధవన్ జననం
* 1992: హీరోయిన్ పాయల్ రాజ్పుత్ జననం
* 2013: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మరణం
* 2016: తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం
* ప్రపంచ నేల దినోత్సవం .
Sorry, no posts matched your criteria.