News December 2, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

APలో రేపు శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, ఉమ్మడి చిత్తూరులో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. విజయనగరం, మన్యం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, వైఎస్ఆర్, అన్నమయ్యతో పాటు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కర్నూలులో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

News December 2, 2024

రికార్డు సృష్టించిన తెలంగాణ చెస్ మాస్టర్

image

క్లాసికల్ చెస్‌లో 2800 ELO రేటింగ్ సాధించిన రెండో భారత ప్లేయర్‌గా అర్జున్ ఎరిగైసి రికార్డు సృష్టించారు. చెస్ చరిత్రలో ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 16వ ప్లేయర్‌గా నిలిచారు. అతని కంటే ముందు ఇండియన్ చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ ఈ ఘనతను అందుకున్నారు. అర్జున్ రేటింగ్ ప్రస్తుతం 2801గా ఉంది. WGLకు చెందిన అతను ప్రస్తుతం భారత నం.1 ప్లేయర్‌గా కొనసాగుతున్నారు. వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్నారు.

News December 2, 2024

పార్ల‌మెంటులో రాజ్యాంగంపై త్వరలో ప్ర‌త్యేక చ‌ర్చ‌

image

పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లో రాజ్యాంగంపై ప్ర‌త్యేక చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. లోక్‌సభలో డిసెంబర్ 13, 14 తేదీల్లో, రాజ్యసభలో 16, 17 తేదీల్లో ఈ చ‌ర్చ‌లు జ‌రుగుతాయి. ఇటీవల దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, రాజ్యాంగ విలువల ప్రాముఖ్యతను పున:సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని విపక్ష పార్టీలు వాదిస్తున్నాయి. దీంతో లోక్‌స‌భ స్పీక‌ర్‌, రాజ్య‌స‌భ ఛైర్మన్ ఈ మేర‌కు అంగీకరించిన‌ట్టు తెలుస్తోంది.

News December 2, 2024

KKR జట్టు కెప్టెన్‌గా అజింక్య రహానే?

image

క్రికెటర్ అజింక్య రహానే కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు నాయకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. వెంకటేశ్ అయ్యర్‌ను రూ.23.75 కోట్లకు కొనుగోలు చేసినప్పటికీ యాజమాన్యం రహానే వైపు మొగ్గుచూపుతున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. టైటిల్‌ను కాపాడుకునేందుకు అనుభవంతో పాటు నాయకత్వ లక్షణాలను చూసి రహానేను ఎంపిక చేసినట్లు పేర్కొన్నాయి. దీనిపై త్వరలోనే ప్రకటన రానున్నట్లు సమాచారం.

News December 2, 2024

కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో ట్విస్ట్!

image

TG: రంగారెడ్డి(D) ఇబ్రహీంపట్నంలో జరిగిన <<14767158>>కానిస్టేబుల్ నాగమణి హత్య<<>>కు ఆస్తి గొడవలే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నాగమణికి పేరెంట్స్ లేరు. ఇప్పటికే ఒకసారి వివాహమై విడాకులు అయ్యాయి. వారసత్వంగా వచ్చిన భూమిని మొదటి పెళ్లి తర్వాత ఆమె తన తమ్ముడు పరమేశ్‌కు ఇచ్చేసింది. రెండో పెళ్లి తర్వాత భూమిలో వాటా ఇవ్వాలని పరమేశ్‌ను ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఆ కోపంతోనే పరమేశ్ ఆమెను చంపినట్లు తెలుస్తోంది.

News December 2, 2024

హరీశ్ రావుకు ప్రభుత్వ విప్ కౌంటర్

image

TG: బతుకమ్మ చీరలను కాంగ్రెస్ ఆగం చేసిందన్న <<14767666>>హరీశ్ రావు కామెంట్లపై<<>> ప్రభుత్వ విప్ శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వం నేతన్నల జీవితాలను ఆగం చేసిందని, సూరత్ నుంచి నాసిరకం చీరలు తెప్పించారని మండిపడ్డారు. వాటిని పంటకు రక్షణకు ఉపయోగించారే తప్ప మహిళలు కట్టుకోలేకపోయారన్నారు. బీసీలకు BRS అనుకూలమా? కాదా? తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత హరీశ్ రావుకు లేదని దుయ్యబట్టారు.

News December 2, 2024

నటి ఆత్మహత్య.. మామ ఏమన్నారంటే?

image

సీరియల్ నటి శోభిత ఆత్మహత్యపై ఆమె మామ బుచ్చిరెడ్డి స్పందించారు. శోభితను కన్నబిడ్డలా చూసుకున్నామని, తమతో బాగా కలిసిపోయిందని చెప్పారు. తన కుమారుడు సుధీర్ రెడ్డితో అన్యోన్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, ఇలా జరగడం దురదృష్టకరమని చెప్పారు. కాగా పోస్టుమార్టం నివేదికలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించగా కర్ణాటకకు తీసుకెళ్లారు.

News December 2, 2024

విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే?

image

ప్రత్యేక పరిస్థితుల్లో అంతర్జాతీయంగా <<14769455>>ముడిచమురు<<>> ధరలు పెరిగితే ఇంధన కంపెనీలకు భారీ లాభాలు వస్తుంటాయి. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్, ATF, క్రూడ్ ఉత్పత్తులపై విధించే అత్యధిక పన్నునే ‘విండ్ ఫాల్ ట్యాక్స్’ అంటారు. 2022 జులై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేస్తోంది. కొంతకాలంగా పన్ను రద్దు చేసేందుకు కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో ఇవాళ రద్దు చేసింది.

News December 2, 2024

శిండేకు అనారోగ్యం.. ఢిల్లీకి అజిత్ పవార్

image

మ‌హారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులు గడుస్తున్నా మహాయుతిలో పదవుల పంపకం కొలిక్కిరావడం లేదు. కీలక శాఖల కోసం శివసేన, NCP పట్టుబడుతున్నాయి. శాఖల కేటాయింపు తేలకపోవడంతోనే CM అభ్యర్థి ప్రకటనను బీజేపీ వాయిదా వేస్తోంది. దీనిపై సోమవారం జ‌ర‌గాల్సిన మ‌హాయుతి నేత‌ల స‌మావేశం శిండే అనారోగ్యం వ‌ల్ల వాయిదా ప‌డినట్టు తెలిసింది. మరోవైపు కోరిన శాఖల్ని దక్కించుకొనేందుకు అజిత్ పవార్ మళ్లీ ఢిల్లీకి పయనమయ్యారు.

News December 2, 2024

మోస్ట్ డిజాస్టర్ మూవీగా ‘కంగువ’!

image

తమిళ స్టార్ నటుడు సూర్య నటించిన పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘కంగువ’ థియేట్రికల్ రన్ పూర్తయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. నెగటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ భారీ బడ్జెట్ చిత్రం రూ.130 కోట్ల నష్టంతో ఆల్‌టైమ్ డిజాస్టర్‌గా నిలిచినట్లు వెల్లడించాయి. ఇప్పటివరకు ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా పేరిట ఈ చెత్త రికార్డు ఉండేది. ఈ మూవీ రూ.120 కోట్లు నష్టపోయింది. కాగా మరికొన్ని రోజుల్లో ‘కంగువ’ OTTలోకి రానుంది.