India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: మాజీ సైనికులను ఆర్టీసీ డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఈ మేరకు 1,201 పోస్టుల్లో కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి. అర్హులైనవారు ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. ఎంపికైన వారికి నెలకు రూ.26వేల జీతంతో పాటు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.

తమ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్తో ముగిసిన Q2కి మంచి పనితీరు కనబరిచిన ఉద్యోగులకు పర్ఫార్మెన్స్ బోనస్ ప్రకటించింది. ఇది వారి జీతంలో 85% ఉన్నట్లు సమాచారం. నవంబర్ నెల జీతంతో పాటు దీన్ని చెల్లించనుంది. డెలివరీ అండ్ సేల్స్ విభాగంలోని జూనియర్, మిడ్ లెవల్ ఉద్యోగులకు బోనస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే వచ్చే జనవరి నుంచి జీతాలు పెంచనున్నట్లు తెలుస్తోంది.

TG: నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ పాఠశాలలో <<14715738>>ఫుడ్ పాయిజన్<<>> ఘటనపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్పందించారు. మధ్యాహ్న భోజనానికి ముందు 22 మంది విద్యార్థులు బేకరీలు, దుకాణాల్లో తినుబండారాలు తిన్నారని తెలిపారు. మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురి కాలేదన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని చెప్పారు.

AP: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ ప్లాట్ఫాం పనులు నిన్న ప్రారంభం అయ్యాయి. వచ్చే జనవరిలో డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో ముందస్తుగా దీన్ని నిర్మిస్తున్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలకు మధ్య పాత డయాఫ్రం వాల్కు సమీపంలో దీన్ని కడుతున్నారు. డయాఫ్రం వాల్ వెడల్పు 1.5 మీటర్లు ఉంటుంది. దీన్ని ప్లాస్టిక్ కాంక్రీట్తో నిర్మించనున్నారు.

TG: కాంగ్రెస్ నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలకు కౌంటర్గా బీజేపీ ‘6 అబద్ధాలు 66 మోసాలు’ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ నెల 30 నుంచి డిసెంబర్ 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో రోజు ఒక్కో విధంగా నిరసన తెలపనుంది. అదే సమయంలో కాంగ్రెస్ వైఫల్యాలపై ఛార్జిషీట్లను ప్రదర్శించనుంది. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 2వేల మందితో నిరసన సభలు ఏర్పాటు చేయనుంది.

AP: ప్రధాని నరేంద్ర మోదీతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై ఆయనతో చర్చించనున్నారు. ముఖ్యంగా జలజీవన్ మిషన్ పథకంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, స్కీము పొడిగించాలని ప్రధానిని కోరనున్నారు. తర్వాత పలువురు కేంద్ర మంత్రులతోనూ ఆయన సమావేశం కానున్నారు. నిన్న కూడా పలు శాఖల కేంద్ర మంత్రులను కలిసి నిధుల విషయమై చర్చించిన విషయం తెలిసిందే.

TG: రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం రూ.196 కోట్లు విడుదల చేసింది. ఇళ్ల నిర్మాణం పూర్తయినా తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి వసతుల కొరత ఉంది. ఈ విషయమై స్థానిక నాయకుల నుంచి వస్తోన్న విజ్ఞప్తులతో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కాగా మౌళిక వసతులు పూర్తి చేయాల్సిన ఇళ్లు ఇంకా 40 వేలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

TG: ఫుడ్ పాయిజన్తో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన <<14706403>>విద్యార్థిని శైలజ<<>> కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.1.20 లక్షల సాయం అందజేసింది. దీంతో పాటు రెండెకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తానని ఎమ్మెల్సీ విఠల్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ హామీతో గ్రామస్థులు నిన్న శైలజ అంత్యక్రియలు పూర్తి చేశారు.

విరాట్ కోహ్లీ మరోసారి ఆర్సీబీ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. డుప్లెసిస్, మ్యాక్స్వెల్ వంటి ప్లేయర్లను వదులుకున్న బెంగళూరు కెప్టెన్సీని కింగ్కే ఇవ్వాలని యోచిస్తోందని సమాచారం. ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్లలో నాయకత్వ బాధ్యతలు చేపట్టే ప్లేయర్లు ఎవరూ కనిపించట్లేదు. కాగా కోహ్లీ నాయకత్వంలో RCB 144 మ్యాచులు ఆడగా 68 విజయాలు, 72 పరాజయాలు పొందగా నాలుగింట్లో ఫలితం తేలలేదు.

AP: తనపై కుట్రతోనే <<14711254>>పోక్సో<<>>, ఎస్సీ, ఎస్టీ కేసుల పెట్టారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. బెదిరించి, కేసులు పెట్టి పరిపాలన చేయడం సాధ్యం కాదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడికి పారిపోనని, అందుబాటులోనే ఉంటానని చెప్పారు. తాను తప్పు చేసే వ్యక్తిని కాదని, అరెస్ట్ చేసుకోమని సవాల్ విసిరారు.
Sorry, no posts matched your criteria.