News August 27, 2024

డెంగ్యూ.. మీలో ఈ లక్షణాలు ఉన్నాయా?

image

AP, TGలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మీలో ఈ లక్షణాలు ఉంటే వెంటనే టెస్ట్ చేయించుకోండి. తీవ్రమైన తలనొప్పి, 102 డిగ్రీలకు పైగా జ్వరం, చలి జ్వరం, కీళ్ల నొప్పులు, కంటి నొప్పి, నీరసంతో పాటు చర్మంపై దద్దుర్లు, ఎముకలు లేదా కండరాల నొప్పి, వికారం, వాంతులు, ఊపిరి తీసుకోవడంతో ఇబ్బంది ఎదురవుతాయి. డెంగ్యూకు ప్రత్యేకమైన మెడిసిన్ అంటూ ఏమీ లేదు. లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందిస్తారు.

News August 27, 2024

యశ్వంత్ సిన్హా కొత్త పార్టీ?

image

ఈ ఏడాది చివర్లో ఝార్ఖండ్ ఎన్నికలు జరగనున్న వేళ మరో కొత్త పార్టీకి సన్నాహాలు జరుగుతున్నాయి. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సిద్ధాంతాలతో కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా అటల్ విచార్ మంచ్(AVM) పేరుతో పార్టీ ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయన తన మద్దతుదారులతో సమావేశమై చర్చించారు. మాజీ ఎంపీ జయంత్ సిన్హా, బీజేపీ మాజీ నేత సురేంద్ర కుమార్ ఈ భేటీకి హాజరయ్యారు.

News August 27, 2024

‘డబుల్ ఇస్మార్ట్’ ఫ్లాప్.. నెక్స్ట్ ఏంటి?

image

లైగర్ ఫ్లాప్ తర్వాత పూరీ దర్శకత్వంలో వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో పూరీ దర్శకత్వంలో పస తగ్గిందనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల సినిమాల్లో ఆయన స్టైల్ మిస్ అయిందని, ట్రేడ్ మార్క్ డైలాగ్స్ లోపించాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న డిఫరెంట్ మూవీతో వస్తేగానీ కమ్ బ్యాక్ ఇవ్వలేరని అభిమానులు చర్చించుకుంటున్నారు.

News August 27, 2024

జ్వరమొచ్చిందా?

image

AP, TGలో <<13948570>>డెంగ్యూ<<>> విజృంభిస్తోంది. ప్రతి 200 మందిలో 13 మందికి పాజిటివ్‌ వస్తోంది. దీంతో జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డెంగ్యూ పరీక్షలు చేయించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లేదంటే 4-5 రోజుల్లోనే పరిస్థితి విషమించే ప్రమాదం ఉందంటున్నారు. డెంగ్యూకు కారణమైన టైగర్ దోమ నీటిలో పెరిగి, ఎక్కువగా పగటిపూట కుడుతుంది. చిన్నారులు వీటి బారినపడే అవకాశం ఎక్కువ కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలి.

News August 27, 2024

ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం అకడమిక్ మానిటరింగ్ యూనిట్

image

AP: సాంఘిక, గిరిజన, ఆశ్రమ స్కూళ్లు, హాస్టళ్ల పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో 11 మంది నిపుణులతో అకడమిక్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు కసరత్తు పూర్తిచేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల చదువు, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, రక్షణ తదితర అంశాలను నిత్యం పర్యవేక్షిస్తారు. ఏ ఒక్క విద్యార్థీ ఫెయిల్ కాకుండా చర్యలు తీసుకుంటారు.

News August 27, 2024

వచ్చే నెల నుంచి కులగణన: మంత్రి పొన్నం

image

TG: రాష్ట్రంలో వచ్చే నెల నుంచి కులగణన ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇందు కోసం జీవో జారీ చేసి రూ.150 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సాధారణ పరిపాలన విభాగం, పంచాయతీరాజ్, ప్రణాళిక శాఖలలో ఏదైనా ఒక శాఖ ఈ ప్రక్రియను చేపడుతుందని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లు ఖరారైన మేరకు చట్టం చేసి అమలు చేస్తామన్నారు. పార్టీపరంగా BCలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు.

News August 27, 2024

6,100 కానిస్టేబుల్ పోస్టులపై BIG UPDATE

image

AP: YCP హయాంలో కోర్టు కేసులతో నిలిచిపోయిన 6,100 <<13742800>>కానిస్టేబుల్<<>> పోస్టుల నియామక ప్రక్రియలో కదలిక వచ్చింది. న్యాయపరమైన సమస్యలు కొలిక్కి రావడంతో 2,3 రోజుల్లోనే ఫిట్‌నెస్ పరీక్షల షెడ్యూల్‌ వెలువడే అవకాశం ఉంది. త్వరగా ప్రక్రియ పూర్తిచేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నోటిఫికేషన్‌లో హోంగార్డులకు సివిల్, AR పోస్టుల్లో 15%, APSP పోస్టుల్లో 25% రిజర్వేషన్ ఇవ్వడంతో వివాదం మొదలైన విషయం తెలిసిందే.

News August 27, 2024

వారికి రుణమాఫీపై నేడు స్పష్టత!

image

TG: రాష్ట్రంలో ₹2 లక్షల లోపు రుణమాఫీ కాని వారి సమస్యల పరిష్కారానికి నేడు రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులు చర్చించనున్నారు. రుణమాఫీ యాప్‌లో వివరాల నమోదు, ఇతర అంశాలపై అధికారులకు వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొనాలని ఆదేశించారు. దీంతో పాటు రూ.2 లక్షలకు పైగా రుణాల మాఫీ ఎలా చేస్తారో వెల్లడించనున్నారు.

News August 27, 2024

ఆ చెట్ల కొట్టివేతను అడ్డుకోండి.. హైకోర్టులో పిల్ దాఖలు

image

AP: కోనో కార్పస్ చెట్లను కొట్టివేయడాన్ని అడ్డుకోవాలని ముగ్గురు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఇవి పర్యావరణానికి హాని కలిగిస్తాయనే ప్రచారంలో శాస్త్రీయ నిరూపణ లేదన్నారు. ఆ చెట్లను అక్రమంగా కొట్టిన వారి నుంచి చట్టం ప్రకారం డబ్బులు వసూలు చేసేలా ఆదేశించాలని కోరారు. పలు జిల్లాల్లో కొట్టివేశారని పేర్కొంటూ పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.

News August 27, 2024

రాష్ట్రంలో 2.65 లక్షల ఫీవర్ కేసులు: డీహెచ్

image

TG: రాష్ట్రంలో నెల రోజుల్లో 4.4 కోట్ల మందిని పరీక్షించినట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ తెలిపారు. గత నెల 23 నుంచి ఈ నెల 25 వరకు చేసిన ఫీవర్ సర్వేలో 2.65 లక్షల మంది జ్వరం బారినపడినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ ఏడాది 5,372 డెంగ్యూ కేసులు నమోదు కాగా అత్యధికంగా హైదరాబాద్‌లో 1,852 కేసులు, సూర్యాపేటలో 471, మేడ్చల్‌లో 426, ఖమ్మంలో 375 వెలుగుచూసినట్లు పేర్కొన్నారు.