India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సోషల్ మీడియాలో సాయిధరమ్ తేజ్ను YCP అభిమానులు టార్గెట్ చేశారు. AP భద్రమైన చేతుల్లో ఉందని గతంలో తేజ్ చేసిన ట్వీట్ను ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరుగుతుంటే ఎందుకు స్పందించట్లేదని Xలో పోస్టులు చేస్తున్నారు. APలో సేఫ్ హ్యాండ్స్ మిస్సింగ్ అని అంటున్నారు. దీనికి ఆయన <<13907348>>‘ఎగ్ పఫ్స్’<<>> కామెంట్స్ చేయడంతో దమ్ముంటే ఆధారాలు పెట్టాలని సవాల్ విసురుతున్నారు. అదేరీతిలో జనసేన ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు.
TG: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత బెయిల్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో ఈ నెల 7న ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ నేపథ్యంలో BRS ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు నిన్న ఢిల్లీకి చేరుకొని కవిత తరఫు అడ్వకేట్లతో సమావేశమయ్యారు.
AP: ఈఏపీసెట్ తుది విడత కౌన్సెలింగ్ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఇంజినీరింగ్లో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 30లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. మొత్తం 248 కాలేజీల్లో 1.39 లక్షల సీట్లు ఉండగా, 3 విడతల్లో 1.16 లక్షల సీట్లు భర్తీ అయినట్లు తెలిపారు. కన్వీనర్ కోటాలో 23,155 సీట్లు మిగిలినట్లు పేర్కొన్నారు.
రైతు ఉద్యమంపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన <<13945604>>వ్యాఖ్యలు <<>>హరియాణా, పంజాబ్తో సహా దేశంలోని రైతులందరికీ ఘోర అవమానకరమని రాహుల్ గాంధీ అన్నారు. రైతు వ్యతిరేక భావజాలం మోదీ ప్రభుత్వ డీఎన్ఏ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. అధికార పార్టీ కంగనా వ్యాఖ్యలతో ఏకీభవించకపోతే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
TG: కాంగ్రెస్ అధిష్ఠానం రేపు పీసీసీ చీఫ్ను ప్రకటించే అవకాశముంది. మహేశ్ కుమార్ గౌడ్, మధుయాష్కీ, లక్ష్మణ్ కుమార్, బలరాం నాయక్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక లెక్కల ఆధారంగా వీరిలో ఒకరిని ఎంపిక చేస్తారని సమాచారం. కాగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పదవీకాలం జులై 7న ముగిసింది. కొత్త చీఫ్ ఎంపికపై ఇప్పటికే ఆయన పలుమార్లు ఢిల్లీ వెళ్లి హైకమాండ్తో సమావేశమైన సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్కు బెయిర్ స్టో, మొయిన్ అలీ ఇంగ్లండ్ జట్టులో చోటు కోల్పోయారు.
టీ20 జట్టు: బట్లర్(C), ఆర్చర్, జాకబ్, కార్సే, కాక్స్, సామ్ కరన్, జోష్, విల్ జాక్స్, లివింగ్ స్టోన్, సాకిబ్, మోస్లే, రషీద్, సాల్ట్, టోప్లీ, టర్నర్.
వన్డే జట్టు: బట్లర్(C), ఆర్చర్, అట్కిన్సన్, బెథెల్, బ్రూక్, కార్సే, డకెట్, జోష్, విల్ జాక్స్, పాట్స్, రషీద్, సాల్ట్, స్మిత్, టోప్లీ, టర్నర్.
జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తొలి విడతలో 9 మందితో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. నేషనల్ కాన్ఫరెన్స్తో హస్తం పార్టీ కూటమిగా బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. NC 51, కాంగ్రెస్ 32 స్థానాల్లో పోటీ చేసేలా ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. మొత్తం 90 స్థానాలకు SEP 18న తొలి విడత, 25న రెండో విడత, అక్టోబర్ 1న మూడో విడతలో పోలింగ్ జరగనుంది.
ప్రభాస్ తొలి చిత్రం ‘ఈశ్వర్’ తనకెంతో ప్రత్యేకమని హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ అన్నారు. ఈ సినిమా అక్టోబర్లో రీరిలీజ్ కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రభాస్ అప్పుడెలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారని చెప్పారు. ‘సుందరకాండ’ టీజర్ రిలీజ్ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఒకవేళ ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే తప్పకుండా ఆయనతో కలిసి నటిస్తానని చెప్పారు. ఈశ్వర్ సినిమా రీరిలీజ్ రోజున మొదటి షో చూస్తానని తెలిపారు.
డెమోక్రట్ మాజీ నేత తులసి గబ్బార్డ్ రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్నకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. మిచిగాన్లో నేషనల్ గార్డ్ అసోసియేషన్ సమావేశంలో ఆమె మాట్లాడారు. అమెరికా ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా బహుళ యుద్ధాలను ఎదుర్కొంటుందని, ఎన్నడూ లేని విధంగా అణు యుద్ధం అంచున ఉందని పేర్కొన్నారు. దీని నుంచి ట్రంప్ బయటపడేస్తారని చెప్పారు. కాగా ట్రంప్కు ప్రసంగాలు, డిబేట్లలో తులసి సలహాదారుగా వ్యవహరిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ ఈవెంట్ను సెప్టెంబర్ 9న నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. కంపెనీ ఉత్పత్తులు, వాటి ఫీచర్లను వెల్లడించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్లో ఐఫోన్ 16 సిరీస్, యాపిల్ వాచ్ వంటి ఉత్పత్తులపై ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్స్లో ఈ కార్యక్రమం జరగనుంది.
Sorry, no posts matched your criteria.