India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆడియో సందేశాలను Text రూపంలోకి మార్చే కొత్త ఫీచర్ వాట్సాప్లో త్వరలో అందుబాటులోకి రానుంది. కీలక సమావేశాల్లో ఉన్నప్పుడు వచ్చే ఆడియో సందేశాలు, ఎవరూ వినకూడదనుకున్న వాటిని టెక్ట్స్ రూపంలోకి కన్వర్ట్ చేసుకొని చదువుకోవచ్చు. దీనిని Settings-Chats-Transcription ఆప్షన్ను ఉపయోగించి ఎనేబుల్ చేసుకోవచ్చు. అనంతరం ఆడియో మెసేజ్లపై లాంగ్ ప్రెస్ చేసి Text ఫార్మాట్లోకి మార్చుకోవచ్చు.

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న గేమ్ ఛేంజర్ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ నెల 28న థర్డ్ సింగిల్ విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ద్వారా మేకర్స్ ప్రకటించారు. శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో అంజలి కీలకపాత్ర పోషిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

MH, ఝార్ఖండ్ ఎన్నికల్లో అధికార పార్టీలు గెలవడం వెనుక DBT పథకాలు పనిచేసినట్టు స్పష్టమవుతోంది. MHలో లడ్కీ బెహెన్, ఝార్ఖండ్లో CM మయ్యా సమ్మాన్ యోజన పథకాల ద్వారా మహిళలకు నెలవారీ ఆర్థిక సాయం ఫలితాలపై ప్రభావం చూపింది. పైగా ప్రస్తుతం ఇస్తున్న ₹1,500ను ₹2,100కు పెంచుతామని మహాయుతి ప్రకటించింది. అలాగే ₹1000 సాయాన్ని ₹2,500కు పెంచుతామని హేమంత్ సోరెన్ హామీ ఇవ్వడం కలిసొచ్చింది.

AP: విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. స్థానికంగా జోనల్ కార్యాలయం ఏర్పాటుకు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ టెండర్లను ఆహ్వానించారు. రెండు సెల్లార్ల పార్కింగ్ ఫ్లోర్లతో కలిపి మొత్తం 11 అంతస్తుల భవన నిర్మాణం చేపట్టనున్నారు. అయితే 9 ఫ్లోర్ల నిర్మాణానికి టెండర్లు దాఖలు చేయాలని మంత్రి ట్వీట్ చేశారు.

IPL 2025 మెగా వేలంలో పలువురు తెలుగు ఆటగాళ్లు తమ పేరు నమోదు చేసుకున్నారు. ఇవాళ, రేపు జరగబోయే ఆక్షన్లో వీరు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. వీరిలో షేక్ రషీద్, బైలపూడి యశ్వంత్, అశ్విన్ హెబ్బర్, పృథ్వీరాజ్, PVSN రాజు, మారంరెడ్డి హేమంత్ రెడ్డి, మనీశ్ రెడ్డి, యద్దెల గిరీశ్ రెడ్డి, గిరినాథ్ రెడ్డి ఉన్నారు. వీరందరి బేస్ ప్రైజ్ రూ.30 లక్షలుగా ఉంది. వీరిలో మీ జిల్లా ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (161) ఔటయ్యారు. మిచెల్ మార్ష్ బౌలింగ్లో స్మిత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. కాగా జైస్వాల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడడంతో ప్రేక్షకులు, ఆటగాళ్లు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. కాగా భారత్ స్కోర్ ప్రస్తుతం 314/3గా ఉంది. క్రీజులో విరాట్ కోహ్లీ (17*), రిషభ్ పంత్ (0*) ఉన్నారు.

బిగ్బాస్ సీజన్-8 చివరి దశకు చేరింది. దీంతో టాప్-5లో ఎవరు నిలుస్తారు? విజేత ఎవరవుతారనే ఆసక్తి పెరుగుతోంది. ఈవారం నామినేషన్స్లో నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, యష్మీ, నబీల్ ఉన్నారు. అయితే నిఖిల్, ప్రేరణ, నబీల్ సేవ్ కాగా యష్మీ, పృథ్వీ చివరి రెండు స్థానాల్లో నిలిచారు. వీరిద్దరిలో యష్మీ ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన షూట్ నిన్నే పూర్తి కాగా ఇవాళ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది.

దేశమంతా మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల గురించి మాట్లాడుతుంటే UPలో మాత్రం కుందర్కీ నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. 61% ఓట్లున్న ఈ స్థానంలో 31ఏళ్ల తర్వాత BJP అభ్యర్థి రాంవీర్ సింగ్ 1,44,791 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ మొత్తం 12 మంది పోటీ చేస్తే అందులో 11 మంది ముస్లింలుండటం గమనార్హం. కాగా గత MLAపై అసంతృప్తి, కమ్యూనిటీలో అంతర్గత కలహాలు, ఓట్ల చీలికల వల్ల రాంవీర్కు విజయం దక్కిందని తెలుస్తోంది.

డిసెంబర్(మార్గశిర)లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ నెలలో బలమైన ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు, సిద్ధాంతులు చెబుతున్నారు. డిసెంబర్ 4, 5, 6, 7, 10, 11, 14, 20, 22, 24, 25 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయని తెలిపారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. ఇక జనవరిలో మంచి ముహూర్తాలు లేవు. జనవరి 31 నుంచి మార్చి 4 వరకు మాఘమాసంలో ముహూర్తాలు ఉన్నాయి.

ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో భారత యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అదరగొడుతున్నారు. అతడు 275 బంతుల్లో 150* రన్స్ పూర్తి చేసుకున్నారు. ఇందులో 13 ఫోర్లు, 3 సిక్సర్లున్నాయి. భారత్ స్కోర్ 288/2.
Sorry, no posts matched your criteria.