News August 26, 2024

2026లో ప్రభాస్ ‘స్పిరిట్’ రిలీజ్‌: సందీప్ రెడ్డి

image

డార్లింగ్ ప్రభాస్‌తో తీయనున్న సినిమాపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అప్డేట్ ఇచ్చారు. తాను వచ్చే నాలుగేళ్లు స్పిరిట్, యానిమల్ పార్క్ సినిమాలపై దృష్టి పెడతానని తెలిపారు. ఇప్పటికే ప్రభాస్‌తో తీసే స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయని, రెండేళ్లలో సినిమాను రిలీజ్ చేస్తానని స్పష్టం చేశారు. ఆ సినిమా తర్వాతే రణ్‌బీర్ కపూర్‌తో తీసే ‘యానిమల్ పార్క్’ వర్క్ స్టార్ట్ చేస్తానని వెల్లడించారు.

News August 26, 2024

వైసీపీకి షాక్.. మేయర్ రాజీనామా

image

AP: ఏలూరు కార్పొరేషన్‌లో వైసీపీకి షాక్ తగిలింది. మేయర్ షేక్ నూర్జహాన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు తన భర్త ఎస్ఎంఆర్ పెదబాబుతో కలిసి ఆమె టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. వారితో పాటు 30 మంది కార్పొరేటర్లు ఉండవల్లిలో నారా లోకేశ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.

News August 26, 2024

రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు: అసదుద్దీన్

image

TG: రాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్ సవరణ బిల్లు2024ను వ్యతిరేకించిన మొట్టమొదటి వక్ఫ్ బోర్డుగా TG వక్ఫ్ బోర్డు నిలిచిందని MIM MP అసదుద్దీన్ అన్నారు. మద్దతుగా నిలిచినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల కేంద్రంలోని BJP ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును MIM వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలోనే ఈరోజు HYDలోని తెలంగాణ వక్ఫ్ బోర్డు కార్యాలయంలో సమావేశం జరిగింది.

News August 26, 2024

పళ్లూడిపోయినా నటిస్తున్నారు: రజనీపై DMK మంత్రి విసుర్లు

image

నటుడు రజనీకాంత్‌పై DMK మంత్రి దురైమురుగన్ పంచ్‌లు విసిరారు. ‘నేనూ అదే చెప్తున్నా. పళ్లు ఊడిపోయి, గెడ్డాలు నెరిసి, చివరి దశకు చేరుకున్నా ఇంకా నటిస్తూనే ఉన్నారు. యువ నటులకు అవకాశాలు దొరకనివ్వడమే లేదు. చెప్పడం ఎవరికైనా ఈజీయే’ అని విమర్శించారు. ‘DMKలో పాత విద్యార్థులు చాలామంది ఉన్నారు. వాళ్లు తరగతి వీడటం లేదు. దురైమురుగన్‌తో వేగడం కరుణానిధికే కష్టమైంది. స్టాలిన్ సర్ మీకు హ్యాట్సాఫ్’ అని రజనీ అన్నారు.

News August 26, 2024

కాసేపట్లో వర్షం

image

TG: హైదరాబాద్ నగరంలో కాసేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వాన పడుతుందని తెలిపింది. మరోవైపు వచ్చే 1-2 గంటల్లో కరీంనగర్, పెద్దపల్లిలో జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు.

News August 26, 2024

బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే.. కిషన్ రెడ్డికి చోటు

image

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం BJP స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాబితాలో ఉన్నారు. వీరితోపాటు కేంద్ర మంత్రులు గడ్కరీ, మనోహర్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్ చౌహాన్, కిషన్ రెడ్డి, జితేంద్ర సింగ్, UP CM యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ CM భజన్ లాల్ శర్మ, సీనియర్ నేతలు అనురాగ్ ఠాకూర్, స్మృతి ఇరానీ ఉన్నారు.

News August 26, 2024

చెరువులో ఒవైసీ కాలేజీ!.. కూల్చివేస్తారా? లేదా?

image

TG: హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో ఎంఐఎం MLA అక్బరుద్దీన్ ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. సలకం చెరువు FTLలో దాన్ని నిర్మించారని, ఆక్రమించినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా సులభంగా తెలుస్తోందని పలువురు పోస్టులు పెడుతున్నారు. అయితే ఆ భవంతుల్లో విద్యాసంస్థలు నడవడం, ఎంఐఎం పార్టీతో రాజకీయ అవసరాల దృష్ట్యా సీఎం రేవంత్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

News August 26, 2024

DANGER: ఇంట్లోని ఈ వస్తువులతో క్యాన్సర్ ముప్పు!

image

ఇంట్లో ఉండే కొన్ని క్యాన్సర్‌ కారక వస్తువుల గురించి యూఎస్‌కు చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ సేథీ వివరించారు. ఇళ్లలో వినియోగించే సెంటెడ్ క్యాండిల్స్ బెంజిన్‌ను విడుదల చేస్తాయి. పాడైపోయిన చాపింగ్ బోర్డుపై కూరగాయలు కోస్తే మైక్రో ప్లాస్టిక్ ఆహారంలోకి వెళ్తుంది. నాన్ స్టిక్ పాత్రలపై ఉండే టెఫ్లాన్ కోటింగ్ కోల్పోతే అవి విషపూరిత వాయువులు విడుదల చేస్తాయని వివరించారు. వీటివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.

News August 26, 2024

కేరళ, త్రిపురకు రూ.40 కోట్ల సాయం ప్రకటించిన మధ్యప్రదేశ్

image

తీవ్ర‌మైన ప్రకృతి విప‌త్తుల‌ను ఎదుర్కొన్న కేర‌ళ‌, త్రిపుర రాష్ట్రాల‌కు మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి మోహ‌న్ యాద‌వ్ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున‌ చెరో రూ.20 కోట్ల సాయం ప్ర‌క‌టించారు. ఈ విప‌త్తుల వ‌ల్ల ప్ర‌భావిత‌మైన ప్ర‌జ‌ల‌కు త‌మ సానుభూతి ప్రకటిస్తూ రెండు రాష్ట్రాల‌కు అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు. సంక్షోభం నుంచి రెండు రాష్ట్రాలు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తున్న‌ట్టు తెలిపారు.

News August 26, 2024

ఆ వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు: ప్రకాశ్ రాజ్

image

తాను ఇవ్వని స్టేట్‌మెంట్‌ను వైరల్ చేస్తుండటంపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ‘90శాతం మంది ముస్లింలు, 2శాతం మంది హిందువులున్న ఇండోనేషియాలో 11వేల గుడులు ఉన్నాయి. అక్కడ RSS లేదు కాబట్టి ఎలాంటి గొడవలు జరగవు’ అని ప్రకాశ్ రాజ్ చెప్పినట్లు ఓ పోస్ట్ వైరలవుతోంది. దీనిపై ఆయన స్పందిస్తూ ‘ఇది ఎవరో క్రియేట్ చేశారు. నా స్టేట్‌మెంట్ కాదు. మీ స్టేట్‌మెంట్స్‌కు నా పేరు జోడించకండి’ అని ఆయన ట్వీట్ చేశారు.