India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆఫ్రికా దేశం సూడాన్లో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాలకు తూర్పు ప్రాంతంలోని అర్బాత్ డ్యామ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం 60 మంది మరణించి ఉంటారని, ఎంతో మంది గల్లంతయ్యారని అక్కడి అధికారులు వెల్లడించారు. ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయని, సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
AP: అనకాపల్లి(D) పరవాడ ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్గ్రేడియంట్స్లో ఈ నెల 22న జరిగిన <<13942383>>ప్రమాదంలో<<>> ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరి కుటుంబాలకు కూడా రూ.కోటి చొప్పున పరిహారం ఇస్తామని హోంమంత్రి అనిత ప్రకటించారు. అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో చనిపోయిన 18 మంది మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందజేసిన విషయం తెలిసిందే.
ఇండియా కూటమి దుష్ప్రచారం చేయడం వల్లే గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గాయని ఏపీ బీజేపీ చీఫ్, ఎంపీ పురందీశ్వరి అన్నారు. ‘బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, చర్చిలు, మసీదుల్ని కూల్చివేస్తారని, రిజర్వేషన్లు తీసివేస్తారని అసత్య ప్రచారం చేశారు. రాజ్యాంగానికి కట్టుబడి పనిచేసే పార్టీ బీజేపీ. రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి లేదు’ అని వ్యాఖ్యానించారు.
TG:మరో నెలలో వానాకాలం పంటల సీజన్ ముగుస్తుండటంతో రైతుభరోసా ఇంకెప్పుడిస్తారని రైతన్నలు ప్రభుత్వంవైపు దీనంగా చూస్తున్నారు. ఎకరానికి ₹7500 చొప్పున 2 సీజన్లకు కలిపి ₹15వేలు ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఇందుకు 5 లేదా 10 ఎకరాలకు సీలింగ్ విధించాలని GOVT చూస్తోంది. గతంలో 68.99 లక్షల మందికి సాయం అందగా, 5ఎకరాలలోపు రైతులు 90.36% మంది ఉన్నారు. 10 ఎకరాల వరకు ఇస్తే మరో 5.72 లక్షల మంది తోడవుతారు.
UPIలో ఐడీ, ఫోన్ నంబర్, QR కోడ్ స్కాన్ ద్వారా డబ్బులు పంపిస్తారు. కొన్ని మార్పులతో బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఈజీగా అప్పు తీసుకొనేలా <<13943899>>ULI<<>> తీసుకొస్తున్నారు. అనుమతి ఆధారంగా ఈ వ్యవస్థలో వివిధ రాష్ట్రాల, వ్యక్తిగత భూ రికార్డులు, ఇతర వివరాలు ముందే పొందుపరుస్తారు. దీంతో డాక్యుమెంటేషన్, బ్యాంకుల చుట్టూ తిరగడం ఉండదు. తక్కువ టైమ్లోనే MSMEలు, రైతులు, చిన్న, మధ్య తరహా రుణ గ్రహీతలు అప్పు తీసుకోవచ్చు.
గ్యాంబ్లింగ్, మోసాలు, నేరపూరిత కార్యకలాపాలకు సహకరిస్తుందనే ఆరోపణల నేపథ్యంలో టెలిగ్రామ్పై భారత ప్రభుత్వం విచారణ చేస్తోంది. యాప్లో P2P(పర్సన్ టు పర్సన్) కమ్యూనికేషన్లను సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పరిశీస్తున్నట్లు ఓ GOVT అధికారి వెల్లడించారు. దర్యాప్తు తర్వాత అక్రమాలు తేలితే యాప్పై నిషేధం విధించే అవకాశం ఉందని తెలిపారు. యాప్ ఫౌండర్ దురోవ్ను ఫ్రాన్స్ పోలీసులు <<13941531>>అరెస్టు<<>> చేసిన విషయం తెలిసిందే.
నేషనల్ కాన్ఫరెన్స్తో సీట్ల సర్దుబాటు వ్యవహారాన్ని కొలిక్కి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు జమ్మూకశ్మీర్కు చేరుకున్నారు. KC వేణుగోపాల్, సల్మాన్ ఖుర్షీద్, భరత్ సోలంకి NC అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా నివాసానికి వెళ్లారు. ‘సీట్ల పంపకం, కొన్ని అంశాలపై స్పష్టత అవసరం. రెండు పార్టీలు కలిసే పోటీచేస్తాయి. ఎన్నికలు ఉంటాయని తెలిస్తే ముందే అన్నీ చక్కబెట్టుకొనేవాళ్లం’ అని NC నేత నాసిర్ అస్లామ్ అన్నారు.
TG: తుమ్మల చెరువు జాడ కనిపెట్టాలని RR(D) పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. మహేశ్వరం(మ) తుక్కుగూడలో 8 ఎకరాల్లో తుమ్మల చెరువు ఉండాలని, కబ్జా చేసి వెంచర్లు వేశారని గ్రామస్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కబ్జాతో వర్షాకాలంలో పొలంలోని పంటలు మునుగుతున్నాయని పేర్కొన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగి తీవ్రంగా విసిగిపోయామని, పోలీసులైనా చెరువు ఆచూకీ వెతికిపెట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.
చెరువులు, నాలాలను ఆక్రమించి కట్టుకున్న భవనాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అయితే, హైడ్రా ఆఫీసు ఉన్న బుద్ధ భవన్ కూడా హుస్సేన్ సాగర్ నాలా మీదనే కట్టారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. లిబర్టీ వద్ద GHMC ప్రధాన కార్యాలయానిదీ ఇదే పరిస్థితని విమర్శించారు. ఈ రెండు ప్రభుత్వ భవనాలనూ కూల్చేస్తే ప్రభుత్వంపై పౌరులకు నమ్మకం కలుగుతుందని సూచించారు. గూగుల్ మ్యాప్ను అటాచ్ చేస్తూ ట్వీట్స్ చేశారు.
చెల్లింపుల విధానాన్ని సమూలంగా మార్చేసిన యూపీఐ తరహాలోనే ఆర్బీఐ మరో కొత్త వ్యవస్థను తీసుకొస్తోంది. రుణాలను సులువుగా జారీ చేసేలా యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ (ULI)ను ఆరంభించబోతోంది. పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ‘రుణాల రంగంలో ULI పరివర్తన తేగలదు. JAM-UPI-ULI త్రయం దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాను విప్లవాత్మకంగా మార్చగలదు. రుణ గ్రహీతలకు ఇదెంతో ఉపయోగం’ అని శక్తికాంతదాస్ అన్నారు.
Sorry, no posts matched your criteria.