News November 18, 2024

శ్రీవాణి ట్రస్ట్ అంటే..

image

శ్రీవాణి ట్రస్టు(శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్) పేరు రద్దు వేళ సర్వత్రా చర్చ జరుగుతోంది. ట్రస్టుకు ₹10వేలు విరాళమిస్తే తొలి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. ప్రతి నెలా 23న ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయి. విరాళమిచ్చిన ఏడాదిలో(రూమ్, VIP టికెట్‌ ₹11,500) 12ఏళ్ల లోపు పిల్లలను తీసుకెళ్లొచ్చు. నిధుల దుర్వినియోగం ఆరోపణలతో ట్రస్టును రద్దు చేసి, TTD ఖాతా ద్వారా లావాదేవీలు జరపనున్నారు.

News November 18, 2024

ఈనెల 21న ‘తండేల్’ నుంచి ‘బుజ్జి తల్లి’ సాంగ్

image

అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోన్న ‘తండేల్’ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘బుజ్జి తల్లి’ సాంగ్‌ను ఈనెల 21న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల కానుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News November 18, 2024

మణిపుర్‌ మంటలు: మరోసారి అమిత్ షా హైలెవల్ మీటింగ్

image

మణిపుర్‌లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం హై లెవల్ మీటింగ్ నిర్వహించారని తెలిసింది. ఆదివారం సైతం ఝార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే వదిలేసి ఆయన సమీక్షించడం గమనార్హం. మైతేయ్ ప్రజలపై కుకీ మిలిటెంట్లు దాడులు చేయడంతో రాష్ట్రంలో మళ్లీ హింస చెలరేగింది. దీంతో కేంద్రం అదనంగా 50 కంపెనీల సాయుధ బలగాలను అక్కడికి తరలించింది. ఇప్పటికే మోహరించిన వాటితో కలిపి ఈ సంఖ్య 70కి చేరింది.

News November 18, 2024

లగచర్ల ఘటనలో DSPపై బదిలీ వేటు

image

TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి ఘటనలో DSPపై వేటు పడింది. పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పరిగి కొత్త DSPగా శ్రీనివాస్‌ను ఉన్నతాధికారులు నియమించారు. ఈ ఘటనలో ఇవాళ దౌల్తాబాద్ మండలం సంగయ్యపల్లి పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేస్తూ వికారాబాద్ కలెక్టర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

News November 18, 2024

బుల్డోజర్ సిద్ధంగా ఉంది: యోగి

image

‘బుల్డోజర్ న్యాయం’ సరికాదని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసిన కొన్ని రోజులకే UP CM యోగి మళ్లీ అలాంటి కామెంట్స్ చేశారు. ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ‘సోరెన్ ప్రభుత్వం కేంద్ర నిధులను కొల్లగొట్టింది. వాటిని రికవరీ చేయడానికి బుల్డోజర్ సిద్ధంగా ఉంది. బంగ్లా వలసదారులు, రోహింగ్యాల చొరబాట్లను సర్కారు ప్రోత్సహిస్తోంది. వీరి వల్ల బేటీ, మటీ, రోటీ(కూతురు, భూమి, రొట్టె)కి ముప్పు ఏర్పడింది’ అని చెప్పారు.

News November 18, 2024

DEC 21న జీఎస్టీ కౌన్సిల్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్

image

రాజస్థాన్ జైసల్మేర్ వేదికగా DEC 21న GST కౌన్సిల్ 55వ సమావేశం జరగనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ భేటీకి అన్ని రాష్ట్రాలు/UTల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా, లైఫ్ ఇన్సూరెన్స్‌పై GST మినహాయింపుపై(ప్రస్తుతం 18%) నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 20 లీటర్ల డ్రింకింగ్ వాటర్ బాటిల్స్, సైకిళ్లు, నోట్‌బుక్స్‌పై GSTని 5 శాతానికి తగ్గించడంపై చర్చిస్తారు.

News November 18, 2024

రాహుల్.. మీ CMను నియంత్రించలేరా?: KTR

image

లగచర్ల బాధితులు 9నెలలుగా పోరాడుతున్నారని, పేద గిరిజనుల బాధలు రాహుల్ గాంధీకి కనిపించట్లేదా? అని KTR ప్రశ్నించారు. మీ పార్టీ CMను నియంత్రించే పరిస్థితి లేదా అని నిలదీశారు. లగచర్లలో అర్ధరాత్రి మహిళలపై పోలీసులు దాడి చేశారని, ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామన్నారు. మణిపూర్ లాగే లగచర్లలో దాడులు జరుగుతున్నాయని చెప్పారు. 300రోజులు దాటినా ఒక్క హామీ అమలు చేయలేదని ఢిల్లీలో విమర్శించారు.

News November 18, 2024

తాను చనిపోయినా.. నలుగురికి ప్రాణం పోసిన రెండేళ్ల బాలుడు

image

కెన్యాకు చెందిన రెండేళ్ల లుండా యుంబా చనిపోతూ భారత్‌లోని నలుగురికి ప్రాణం పోశారు. రెండో అంతస్తు నుంచి పడిపోవడంతో లుండా తలకు గాయం అయింది. చికిత్స పొందుతూ అక్టోబర్ 26న బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందారు. దీంతో అతని అవయవాలు దానం చేసేందుకు లుండా తల్లి ముందుకొచ్చారు. ఇండియాలో పాంక్రియాస్ గ్రంథి దానం చేసిన అత్యంత పిన్న వయస్కుడు లుండానే. చండీగఢ్‌లోని PGI ఆస్పత్రి వైద్యులు లుండాకు ఘన నివాళులర్పించారు.

News November 18, 2024

దూరదృష్టితో కులగణన చేపట్టాం: పొంగులేటి

image

TG: గత ప్రభుత్వం సమగ్ర సర్వే నివేదికను ఎందుకు బయటపెట్టలేదని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. KCR ప్రభుత్వ తప్పులను సరిదిద్దుతున్నట్లు చెప్పారు. మంచి ప్రతిపక్షంగా విలువైన సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. దూరదృష్టితో తమ ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టిందని తెలిపారు. తాము ఏ పనినీ కక్షపూరితంగా చేయడం లేదని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో నేతలు చేసిన అక్రమాలపై చట్టపరంగానే చర్యలుంటాయని వెల్లడించారు.

News November 18, 2024

RECORD: ఒకే రోజు 5 లక్షల మంది విమాన ప్రయాణం

image

దేశీయ విమాన రంగంలో సరికొత్త రికార్డు నమోదైంది. నవంబర్ 17న 3,173 విమానాల్లో 5,05,412 మంది ప్రయాణం చేశారు. ఒక రోజులో ఇంత మంది ప్రయాణించడం ఇదే తొలిసారి. అన్ని విమానాల్లో 90 శాతంపైన ఆక్యుపెన్సీ నమోదవగా, పలు కారణాలతో సర్వీసులన్నీ ఆలస్యంగానే నడిచాయి. ఫెస్టివల్, పెళ్లిళ్ల సీజన్ కారణంగానే ఈ ట్రాఫిక్ నమోదైందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదే డిమాండ్ వింటర్ అంతా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాయి.