India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: HYDలో తెల్లవారుజాము నుంచే భారీ వర్షాలు పడటంతో రంగారెడ్డి జిల్లాలో స్కూళ్లకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, 8.30 వరకూ ప్రభుత్వం ప్రకటన చేయకపోవడంతో పిల్లలను స్కూళ్లకు పంపేందుకు ఇబ్బంది పడ్డామని తల్లిదండ్రలు Xలో పేర్కొంటున్నారు. చాలా స్కూళ్లు 8 గంటలకే స్టార్ట్ అవుతాయని, గతేడాదిలానే సెలవుపై లేట్గా స్పందించారని ఫైరవుతున్నారు. విద్యాశాఖ IMD హెచ్చరికలను పట్టించుకోవట్లేదని మండిపడుతున్నారు.
ఇండియన్ బ్యాంక్లో 300 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే నెల 2వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఉత్తీర్ణులై, 1-7-2024 నాటికి 20-30 ఏళ్ల వయసు ఉన్న వారు అర్హులు. ఆన్లైన్ టెస్టు, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పే స్కేల్ రూ.48,480-85,920 మధ్య ఉంటుంది. పూర్తి వివరాల కోసం <
వెబ్సైట్: https://www.indianbank.in/
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1976లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా లేటరల్ ఎంట్రీ ద్వారా నియమితులయ్యారని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గుర్తు చేశారు. RSSకి చెందిన వారిని ప్రభుత్వ శాఖల్లో నియమిస్తున్నారన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలను ఆయన తిప్పికొట్టారు. నిబంధనలు రూపొందించే బాధ్యతను UPSCకి ఇచ్చి లేటరల్ ఎంట్రీ విధానాన్ని ప్రధాని మోదీ క్రమబద్ధీకరించారని మంత్రి పేర్కొన్నారు.
భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్ తెరకెక్కనుంది. ఆయన క్రీడా ప్రయాణాన్ని మూవీగా తీసుకురానున్నట్లు Tసిరీస్ అధికార ప్రకటన వెల్లడించింది. ఈ సినిమాలో యువరాజ్ సింగ్ అద్వితీయ క్రికెట్ ప్రయాణం, ఆయన పాత్ర వంటి అంశాల నేపథ్యంలోనే సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. 2007 టీ20WC, 2011 వరల్డ్ కప్ గెలవడంలో యువీ కీలక పాత్ర పోషించారు. క్యాన్సర్తో పోరాడి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.
TG: హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తుండటంతో GHMC జలమండలి ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. జీఎం, డీజీఎం, మేనేజర్లతో ఎండీ అశోక్రెడ్డి అత్యవసర జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఉద్యోగులు, సిబ్బందికి అన్ని రకాల సెలవులూ రద్దు చేశారు. కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రాంతాలకు ట్యాంకర్లతో సురక్షిత జలాలను సరఫరా చేయాలని ఆదేశించారు. మ్యాన్హోళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ తెరవొద్దని ప్రజలకు సూచించారు.
దేశంలో BSNL 4G సర్వీసులు అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ట్రయల్ ఫలితాలు సంతృప్తికరంగా ఉండటంతో కస్టమర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 4G సర్వీసులను ఆక్టోబర్ నుంచి ప్రారంభిస్తామని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. ప్రారంభానికి ముందు మరిన్ని ట్రయల్స్ చేస్తామన్నారు. ఇప్పటికే దేశంలో 25 వేల టవర్లను ప్రారంభించిన BSNL తన కస్టమర్లకు 4G సిమ్ కార్డులను జారీ చేస్తోంది.
AP: ప్రభుత్వ పాఠశాలల్లోని టాయిలెట్ల ఫొటోల <<13896129>>అప్లోడ్<<>> బాధ్యతలను తమకు అప్పగించడంపై గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది మండిపడుతున్నారు. విద్యాశాఖతో సంబంధం లేని తమకు ఆ డ్యూటీలు అప్పగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని మంత్రి నారా లోకేశ్ను ఎంప్లాయిస్ అసోసియేషన్ కోరింది. ప్రభుత్వం స్పందించకపోతే బాత్రూమ్ కడుగుతూ నిరసన తెలియజేస్తామని తెలిపారు.
Mr.ఎన్టీఆర్-జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న దేవర సినిమా నుంచి ఇప్పటికే పలు డైలాగ్స్ లీకైన విషయం తెలిసిందే. తాజాగా ఆయుధ పూజ సాంగ్ నుంచి 25 సెకన్ల మ్యూజిక్ బిట్ <
గంటల తరబడి నడిచేందుకు ఆసక్తిగా ఉన్నవారికి వాహన తయారీ సంస్థ టెస్లా వినూత్న ఆఫర్ ప్రకటించింది. తమ వద్ద 7 గంటల పాటు నడిస్తే గంటకు రూ.4వేలు(రోజుకు రూ.28వేలు) ఇస్తామని వెల్లడించింది. అచ్చం మనిషిని పోలి ఉండే హ్యూమనాయిడ్ రోబోట్ను సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఈక్రమంలో మోషన్-క్యాప్చా సాంకేతికత సాయంతో దానికి శిక్షణ ఇచ్చేందుకు వారిని వినియోగించుకోవాలని టెస్లా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.