News November 18, 2024

Stock Market: బేర్స్ జోరు.. బుల్స్ బేజారు

image

స్టాక్ మార్కెట్లు మార్నింగ్ సెషన్‌లో భారీ న‌ష్టాల్లో ట్రేడ‌వుతున్నాయి. మొద‌టి అర‌గంట పాటు బెంచ్ మార్క్ సూచీలు రిట్రేస్‌మెంట్ అవ్వ‌కుండా న‌ష్టాల‌వైపు ప‌య‌నించాయి. అయితే సెన్సెక్స్ 77,000 ప‌రిధిలో, నిఫ్టీ 23,350 పరిధిలో ఇప్ప‌టికే రెండు సార్లు స‌పోర్టు తీసుకున్నాయి. ప్ర‌స్తుతం సెన్సెక్స్ 459 పాయింట్ల న‌ష్టంతో 77,127 వ‌ద్ద‌, నిఫ్టీ 130 పాయింట్ల న‌ష్టంతో 23,401 వ‌ద్ద ట్రేడ్ అవుతున్నాయి.

News November 18, 2024

RGVకి హైకోర్టులో నిరాశ

image

AP: ప్రకాశం(D) మద్దిపాడు పోలీసులు తనపై నమోదు చేసిన <<14597682>>కేసును <<>>కొట్టివేయాలని దర్శకుడు RGV దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలన్న వర్మ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది. పోలీసుల విచారణకూ సమయం ఇచ్చేలా ఆదేశించాలని కోర్టును RGV కోరగా, ఆ విషయం పోలీసులనే అడగాలని న్యాయస్థానం బదులిచ్చింది.

News November 18, 2024

లగచర్ల ఘటనలో A2పై లుకౌట్ నోటీసులు

image

TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న A2 సురేశ్ కోసం గాలిస్తున్నారు. అతడిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 25 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటనలో A1గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.

News November 18, 2024

రాజకీయ లబ్ధి కోసమే YCPపై ఆరోపణలు: బొత్స

image

AP: వైసీపీ హయాంలో క్రైమ్ రేట్ పెరిగిందన్న హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే లేని పోని ఆరోపణలు చేస్తున్నారని MLC బొత్స సత్యనారాయణ అన్నారు. శాంతిభద్రతలపై Dy.CM పవన్ ఆందోళన వ్యక్తం చేశారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అనిత వ్యాఖ్యలకు తాము వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు దమ్ము, ధైర్యం అంటూ మంత్రి మాట్లాడటం సరికాదని మండలి ఛైర్మన్ మోషన్ రాజు అన్నారు.

News November 18, 2024

లా అండ్ ఆర్డర్‌పై మండలిలో హాట్ హాట్ చర్చ

image

AP శాసనమండలిలో లా అండ్ ఆర్డర్‌పై చర్చ అధికార, విపక్షాల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. రాష్ట్రంలో నేరాల కట్టడికి చర్యలు చేపడుతున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. జగన్ తల్లికి, చెల్లికి అన్యాయం జరిగినా అండగా నిలుస్తామని ఆమె అన్నారు. దీంతో అనిత వ్యాఖ్యలపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు.

News November 18, 2024

బీజేపీలో చేరనున్న గహ్లోత్!

image

కేజ్రీవాల్ తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసి మంత్రి ప‌ద‌వికి <<14635271>>రాజీనామా<<>> చేసిన కైలాష్ గ‌హ్లోత్ బీజేపీలో చేర‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ స‌క్సేనాకు గ‌హ్లోత్ స‌న్నిహితుడు. పంద్రాగ‌స్టున జెండా ఎగుర‌వేసేందుకు ఆతిశీకి బ‌దులుగా గ‌హ్లోత్‌కు స‌క్సేనా అవకాశం ఇచ్చారు. పైగా లిక్క‌ర్ కేసులో ఆయ‌న పాత్ర‌పై ED కూపీ లాగుతుండడంతోనే బీజేపీలో చేరుతున్నార‌నే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

News November 18, 2024

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

image

ఇటీవల తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.660 పెరిగి రూ.76,310కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.600 పెరిగి రూ.69,950గా నమోదైంది. మరోవైపు సిల్వర్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేజీ వెండి ధర రూ.99వేలుగా ఉంది.

News November 18, 2024

త్వరలో కీరవాణి కుమారుడి పెళ్లి

image

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారు. సీనియర్ నటుడు మురళీమోహన్ మనవరాలు రాగను ఆయన వివాహమాడనున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్‌లో వీరి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు ప్రిన్స్ మహేశ్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి, నటులు నరేశ్, పవిత్ర, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తదితరులు హాజరయ్యారు.

News November 18, 2024

వెంటనే IR ప్రకటించాలి: APTF

image

APలో NDA ప్రభుత్వం ఏర్పడి 5 నెలలైనా ఇంకా టీచర్లు, ఉద్యోగులకు ఎలాంటి భరోసా కల్పించలేదని APTF ఆరోపించింది. పెండింగ్ DAలు, వేతన సవరణ గడువు రెండేళ్లు దాటినా ఇంకా నిర్ణయం తీసుకోలేదని మండిపడింది. గత ప్రభుత్వం నియమించిన PRC కమిషన్ ఛైర్మన్ ప్రభుత్వం మారిన తర్వాత రాజీనామా చేశారని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరింది. PRC ప్రకటించే వరకూ ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేసింది.

News November 18, 2024

PDS ధాన్యం పక్కదారి.. రూ.69 వేల కోట్ల నష్టం

image

PDS ద్వారా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌ర‌ఫ‌రా చేసిన ఆహార ధాన్యాలు ప‌క్క‌దారి ప‌ట్ట‌డంతో ₹69 వేల కోట్ల న‌ష్టం వాటిల్లిన‌ట్టు ఎకాన‌మిక్ థింక్ ట్యాంక్ అధ్య‌య‌నంలో తేలింది. 28% లబ్ధిదారుల‌కు ధాన్యం చేర‌డం లేద‌ని వెల్ల‌డైంది. ఆగ‌స్టు, 2022-జులై, 2023 మ‌ధ్య కాలానికి సంబంధించి సంస్థ అధ్య‌య‌నం చేసింది. ధాన్యాన్ని ఓపెన్ మార్కెట్, ఇత‌ర ఎగుమ‌తుల‌కు మ‌ళ్లించివుంటార‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.