India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
*స్మార్ట్ వాచ్: హెల్త్ ట్రాకర్ సహా ఎన్నో ఫీచర్స్ ఉంటాయి.
*మొక్కలు: ఓ ఇండోర్ ప్లాంట్ ఇచ్చి ఆశ్చర్యపర్చండి. పర్యావరణానికి మేలు చేసినట్లు అవుతుంది.
*బంగారం: ఇయర్ రింగ్స్, చైన్, రింగ్స్ బహుమతిగా ఇస్తే ఎప్పటికీ గుర్తుంటుంది.
*హెల్త్ ఇన్సూరెన్స్: అత్యవసర సమయాల్లో ఇది ఆర్థిక భద్రతను ఇస్తుంది. మెడికల్ బిల్లుల బాధ తప్పుతుంది.
*ఫిక్స్డ్ డిపాజిట్: వడ్డీతో అవసరాలకు డబ్బు వాడుకోవచ్చు.
AP: CM చంద్రబాబు తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో నేడు పలు పరిశ్రమలను ప్రారంభించనున్నారు. సీఎంవో వివరాల ప్రకారం ఉండవల్లి నుంచి ఉ.10 గంటలకు బయలుదేరి 11.30 గంటలకు తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీసిటీకి చేరుకుని పలు పరిశ్రమల్ని ప్రారంభిస్తారు. 7 కొత్త సంస్థలకు శంకుస్థాపన చేస్తారు. ఆయా సంస్థల ప్రతినిధులతో భేటీ అనంతరం మధ్యాహ్నం నెల్లూరులోని సోమశిలకు చేరుకుని జలాశయాన్ని పరిశీలిస్తారు.
TG: రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. దీంతో కొన్ని స్కూళ్లు సెలవు ఇవ్వగా, మరికొన్ని హాలిడే ఇవ్వలేదు. బాలికలు, ఆడబిడ్డలు ఘనంగా జరుపుకునే రాఖీపండుగకు సాధారణ సెలవు ప్రకటించాలని గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆప్షనల్ హాలిడేను సాధారణ సెలవుగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరింది. అటు ఏపీలో ఆప్షనల్ హాలిడే కూడా లేదు.
AP: ఇవాళ నుంచి ఈనెల 24 వరకు ఒంగోలు నియోజకవర్గ ఈవీఎంల రీ వెరిఫికేషన్ జరగనుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ ఈసీఐని ఆశ్రయించారు. 12 పోలింగ్ కేంద్రాల్లో రీవెరిఫికేషన్ చేయాలంటూ రూ.5.66లక్షలు చెల్లించారు. ఈసీఐ ఆదేశాలతో అధికారులు 6 రోజులపాటు రీ వెరిఫికేషన్ చేయనున్నారు.
AP: బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం భారీ విరాళాన్ని అందించారు. మంత్రి లోకేశ్ను ఆదివారం కలిసిన ఆయన రూ. కోటి చెక్కును అందించారు. క్యాంటీన్ల నిర్వహణ సాఫీగా సాగేందుకు ప్రతి ఒక్కరు తమకు తోచినంత విరాళాన్ని అందించాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే పలువురు భారీ విరాళాల్ని అందిస్తున్నారు.
AP: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సర్కారు వచ్చే నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టొచ్చని తెలుస్తోంది. ఈమేరకు కసరత్తు చేస్తోందని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి ఈ నెల 19 నుంచి 22 వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ సమావేశం కానుందని తెలిపాయి. నెలాఖరులోపు బడ్జెట్ అంచనాలను పంపించాలని అన్ని శాఖలకు సూచించిందని వెల్లడించాయి.
నేడు రక్షాబంధన్. తోబుట్టువుల మధ్య బంధాన్ని మరింత బలపరిచే రాఖీ పౌర్ణమిని ఒకప్పుడు ఉత్తరాదిలో మాత్రమే జరిపేవారు. కాలక్రమేణా దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. సోదరుడు బాగుండాలని సోదరి ఆకాంక్షిస్తుంది. ఆమెకు ఎప్పుడూ అండగా ఉంటానని సోదరుడు భరోసా ఇస్తాడు. ఇదే రక్షాబంధన్. తోబుట్టువులతో ప్రేమగా మెలగాలని, పెద్దల పట్ల వినయ విధేయతలతో ఉండాలని సూచిస్తుంది రాఖీ పండుగ.
AP: 15 శాఖల్లో ప్రభుత్వోద్యోగుల బదిలీలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదేళ్ల సర్వీసు పూర్తైన ఉద్యోగులందరికీ ట్రాన్స్ఫర్ తప్పనిసరి. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ట్రాన్స్ఫర్లకు సంబంధించిన ఎటువంటి మార్గదర్శకాలు విడుదల కాలేదు. వీరిలో అధికశాతం మంది బదిలీలపై విముఖంగా ఉన్నారు. ఆ మార్గదర్శకాలు నేడు వెలువడొచ్చని, ఈ నెలాఖరులోగా ప్రభుత్వం ప్రక్రియను పూర్తి చేయొచ్చని సమాచారం.
కోల్కతాలో వైద్యురాలి హత్యాచార ఘటన తనను కలచివేసిందని, తీవ్ర మనోవేదనకు లోనయ్యానని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు బెంగాల్ సీఎం, గవర్నర్కు ఆయన లేఖ రాశారు. ‘మనందరి మనస్సాక్షిని కుదిపేసిన ఘటన ఇది. ఇది కేవలం ఓ వ్యక్తిపై జరిగిన దాడి కాదు. మన సమాజంలోని ప్రతి మహిళ గౌరవం, భద్రతపై జరిగిన దాడి. సమాజంలో లోతుగా పాతుకుపోయిన సమస్యకు ప్రతిబింబం’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
TG: చట్టసభల్లో క్షత్రియులకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని సీఎం రేవంత్ క్షత్రియ సేవా సమితి సభలో హామీ ఇచ్చారు. ‘రాజకీయాల్లో రాణించాలన్న ఉత్సాహంతో ఉన్నవారిని క్షత్రియ వర్గం గుర్తించి ప్రోత్సహించాలి. వారికి పార్టీలో పదవులు, మున్ముందు టికెట్లు కేటాయిస్తాం. అటువంటి వారి జాబితాను క్షత్రియ వర్గ ప్రతినిధులు ఇస్తే ఆయా నేతలను నాయకులుగా తయారుచేస్తాం. తగిన అవకాశాలు కల్పిస్తాం’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.