India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: గ్రూప్-3 పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ పేపర్-1, పేపర్-2 పరీక్ష జరగగా రేపు ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-3 పరీక్ష జరగనుంది. కాగా నిమిషం నిబంధన కారణంగా పలువురు అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అధికారులు అనుమతించలేదు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేస్తారని తెలుస్తోంది. ఇన్నింగ్స్ చివర్లో మెరుపులు మెరిపించగల సత్తా ఉండటంతో మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో ఆయనను తుది జట్టులో ఆడిస్తారని వార్తలు వస్తున్నాయి. నితీశ్తోపాటు దేవదత్ పడిక్కల్ లేదా సాయి సుదర్శన్లలో ఒకరు డెబ్యూ చేస్తారని టాక్.

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మితిమీరిపోతోంది. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలుష్యం తగ్గట్లేదు. దీంతో ప్రజలు శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో చైనా రాజధాని బీజింగ్లో పన్నెండేళ్లలో తగ్గిపోయిన కాలుష్యం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. అక్కడ 2012లో కాలుష్యంతో నిండిపోయి పొగ కమ్మేయగా.. ఇప్పుడు గాలి నాణ్యత పూర్తిగా మారిపోయింది. అలాంటి ఏర్పాట్లు చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.

మరికొన్ని క్షణాల్లో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ ట్రైలర్ రిలీజ్ కానుంది. ఎన్నో అంచనాలతో విడుదలవుతుండటంతో యూట్యూబ్ సైతం అందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ‘పుష్ప రూల్ బిగిన్స్’ అని యూట్యూబ్ ఇండియా ట్వీట్ చేసింది. గత రికార్డులన్నింటినీ ఈ ట్రైలర్ బ్రేక్ చేస్తుందని, యూట్యూబ్ షేక్ అవడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు. కాగా పట్నాలో జరుగుతోన్న ఈవెంట్కు వేలాదిగా ప్రేక్షకులు తరలివచ్చారు.

APలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ముఖ్య గమనిక. ఫిజికల్ టెస్టులకు <

వరి దిగుబడిలో తెలంగాణ రికార్డు సృష్టించిందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావడం రైతులు సాధించిన ఘన విజయమని అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 3 బ్యారేజ్ల్లో నీటి వినియోగం లేకుండానే దిగుబడి సాధించడం ప్రభుత్వం, అధికారుల పనితీరు, రైతన్నల అంకితభావానికి నిదర్శనమన్నారు. ఉమ్మడి APలోనూ ఇంతటి పంట పండిన సందర్భమే లేదన్నారు.

అప్పట్లో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఓ గొరిల్లాతో ఫైట్కు సిద్ధపడ్డారు. 1980ల్లోన్యూయార్క్లోని ఓ జూకు అప్పటి తన భార్య రాబిన్ గివెన్స్తో కలిసి ఆయన సందర్శనకు వెళ్లారు. ఆ జూలో ఓ గొరిల్లా ఇతర గొరిల్లాలను కొట్టడాన్ని ఆయన చూశారు. దీంతో దాని అంతు చూసేందుకు టైసన్ సిద్ధమై జూ కీపర్తో చర్చించారు. 10,000 డాలర్లు ఇస్తా, తనను గొరిల్లాతో ఫైట్కు అనుమతించాలని కోరారు. కానీ దీనికి ఆ జూ కీపర్ అంగీకరించలేదు.

మరికొన్ని గంటల్లో ‘పుష్ప-2’ ట్రైలర్ విడుదలవనుంది. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డు గ్రహీత, సౌండ్ డిజైనర్ రెసుల్ పూకుట్టి థియేటర్ యజమానులకు ఓ సూచన చేశారు. ‘పుష్ప-2 ట్రైలర్ ఇవాళ విడుదలవనుంది. అంతా చాలా హడావుడిగా ఉంది. స్టాండర్డ్ డాల్బీ లెవల్ 7లో సౌండ్ మిక్స్ చేశామని సినీ ప్రేమికులకు చెప్తున్నా. కాబట్టి యాంప్లిఫయర్లను సరైన సమయంలో ట్యూన్ అప్ చేయాలని థియేటర్లకు సూచిస్తున్నా’ అని పేర్కొన్నారు.

ఇటీవల సీజేఐగా పదవీ విరమణ చేసిన జస్టిస్ డీవై చంద్రచూడ్ శివసేన ఎమ్మెల్యేల అనర్హత కేసులో తీర్పు చెప్పకపోవడంపై నిరాశ చెందినట్టు ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. న్యాయాన్ని వెల్లడించకుండా చంద్రచూడ్ కేవలం కామెంటేటర్గా మిగిలిపోయారని దుయ్యబట్టారు. జడ్జిగా కాకుండా న్యాయ విద్య లెక్చరర్గా చంద్రచూడ్ పని చేసి వుంటే మరింత పేరు సంపాదించేవారని వ్యంగ్యంగా విమర్శించారు.

భారత్లో ఆదివారం ఏం నడుస్తోంది అని ఎవరైనా ప్రశ్నిస్తే, పుష్ప-2 ట్రైలర్ నడుస్తోందని చెప్పే పరిస్థితి కనిపిస్తోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. Xలో ఇదే ట్రెండింగ్లో ఉంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలు మరో 3 రోజుల్లో జరుగుతున్నా రాజకీయ అంశాలను తలదన్ని పుష్ప క్రేజ్ నడుస్తోంది. తరువాత నయనతార-ధనుష్ వివాదం, కుంగువపై <<14634886>>జ్యోతిక<<>> స్పందన ట్రెండింగ్లో ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.