India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: వరంగల్లోని మామూనురు ప్రాంతంలో ఎయిర్పోర్టు అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. విమానాశ్రయం విస్తరణలో అవసరమైన భూసేకరణ కోసం రూ.205 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. DPR సిద్ధం చేయాలని ఎయిర్పోర్టు అథారిటీకి లేఖ రాసింది.

AP: విశాఖ వాల్తేరు DRM సౌరభ్ ప్రసాద్ లంచం తీసుకుంటూ CBIకి పట్టుబడ్డారు. ప్రస్తుతం సెలవులో ఉన్న ఆయన మెకానికల్ బ్రాంచ్ పనుల టెండర్ వ్యవహారంలో ఓ కాంట్రాక్టర్ నుంచి ₹25 లక్షలు డిమాండ్ చేశారు. ముంబైలో ₹10 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా సీబీఐకి దొరికారు. DRMను ప్రస్తుతం CBI విచారిస్తోంది. విశాఖ DRM బంగ్లాలోనూ CBI అధికారులు సోదాలు చేశారు. రైల్వే చరిత్రలో లంచం తీసుకుంటూ పట్టుబడిన 2వ DRM సౌరభ్.

నటి పూనమ్ కౌర్ మరో సంచలన ట్వీట్ చేశారు. ఒక హీరోయిన్ను స్టార్ హీరో వేధిస్తున్నారని రాసుకొచ్చారు. ఆమె తనతో పాటు ఓ ఫాంటసీ చిత్రంలో నటించినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత హీరోయిన్గానూ చేసి సినిమాలకు దూరమైనట్లు తెలిపారు. ఇటీవల ఆమెను విమానంలో కలిసినపుడు ఓ హీరో వెంటపడి వేధిస్తున్నారని చెప్పినట్లు పేర్కొన్నారు. ఆమెను తాను ఓదార్చినట్లు చెప్పారు. అయితే వారిద్దరూ ఎవరనే విషయాన్ని పూనమ్ వెల్లడించలేదు.

గోవా టూరిజంను తిరిగి గాడిలో పెట్టడానికి నెట్టింట కొన్ని సలహాలు వినిపిస్తున్నాయి. అవి: స్థానిక ట్యాక్సీ మాఫియా ఆగడాలను అరికట్టాలి *Luxury Roomsపై ఉన్న 28% GSTని తగ్గించాలి. *సన్ సెట్ పాయింట్లు మాత్రమే కాకుండా అమ్యూజ్మెంట్ పార్క్లు, భారీ బీచ్ క్లబ్స్, సుదీర్ఘ కాలినడక మార్గాలు ఏర్పాటు చేయాలి. *ట్రాఫిక్ నియంత్రణ, విదేశీయుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మీరిచ్చే సలహాలు ఏంటి?

పుష్ప-2కి ఉత్తరాది రాష్ట్రాల్లో క్రేజ్ పీక్స్లో ఉంది. ఈ నేపథ్యంలో హిందీ బెల్ట్లో ఈ మూవీ రికార్డ్ కలెక్షన్లు సాధించే అవకాశం కనిపిస్తోంది. హిందీలో తొలిరోజు అత్యధిక కలెక్షన్ల రికార్డు జవాన్(రూ.63.90 కోట్లు) పేరిట ఉంది. ఇక వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్లలో RRR (రూ.223 కోట్లు) అగ్రస్థానంలో ఉంది. పుష్ప-2కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆ రెండింటినీ దాటేందుకు మంచి అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

తెలంగాణలో BRSను నిషేధించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న BRS విధ్వంసకర పార్టీ అని ఆరోపించారు. ఆ పార్టీ నేతలను నియంత్రించాల్సిన బాధ్యత సీఎందేనని, ఆయన అసమర్థత వల్లే వారు రెచ్చిపోతున్నారని విమర్శించారు. ఇక TGలో ఇద్దరు సీఎంలు(రేవంత్, KTR) ఉన్నారని, కాంగ్రెస్, BRS కలిసి రాష్ట్రంలో నాటకాలు ఆడుతున్నాయని బండి ధ్వజమెత్తారు.

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తన రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీని వారసుడిగా ప్రకటించినట్టు తెలుస్తోంది. 85 ఏళ్ల అయతుల్లా ఆరోగ్యం క్షీణిస్తోందన్న వార్తల నేపథ్యంలో వారసుడి ఎంపిక రహస్యంగా జరిగినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. సెప్టెంబర్ 26న జరిగిన సమావేశంలో మొజ్తాబా ఎంపికను అసెంబ్లీ సభ్యులు ఆమోదించారు. అయతుల్లా బతికుండగానే మొజ్తాబాకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీని ఔట్ చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ తెలిపారు. అతడి వల్ల ఎంత ముప్పు ఉందో తమకు తెలుసని పేర్కొన్నారు. ‘కోహ్లీతో కలిసి IPLలో ఆడాను కాబట్టి మైదానం వెలుపల ఎలా ఉంటారో నాకు తెలుసు. అతడ్ని రెచ్చగొట్టాలని మునుపెన్నడూ యత్నించలేదు. ఈసారి కూడా నా బౌలింగే మాట్లాడుతుంది. విరాట్ 30ల్లో ఉండగానే ఔట్ చేస్తా’ అని స్పష్టం చేశారు.

మంత్రి కైలాష్ గహ్లోత్ రాజీనామా ఢిల్లీలో సంచలనంగా మారింది. అవినీతిలేని పాలన, సామాన్యులకు ప్రాధాన్యం అనే మూల సిద్ధాంతాల్ని ఆప్ విస్మరించిందని ఆయన ఆరోపించడం విపక్ష BJPకి అస్త్రమైంది. మున్ముందు మరికొందరు ఆప్ నేతలు పార్టీని వీడే అవకాశం ఉందనే చర్చ ప్రారంభమైంది. గహ్లోత్ రాజీనామా ఆప్ అవినీతి, అబద్ధాల పాలనకు నిదర్శనమని బీజేపీ విమర్శించింది. BJP, ED ఒత్తిడి వల్లే ఆయన రాజీనామా చేశారని ఆప్ చెబుతోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. పట్నాలోని గాంధీ మైదాన్లో ఈ వేడుక జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు స్పెషల్ ఫ్లైట్లో అల్లు అర్జున్, రష్మిక మందన్న పట్నాకు బయల్దేరారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది.
Sorry, no posts matched your criteria.