News August 18, 2024

‘డియర్ రజనీ.. నన్ను క్షమించు’ అని లేఖ రాసి..

image

TG: సరిగ్గా జీతాలు రాక, కుటుంబ సమస్యలతో సూర్యాపేట GOVT ఆస్పత్రిలో పనిచేస్తున్న వసీమ్ ఆత్మహత్య చేసుకున్నారు. తనను క్షమించాలంటూ భార్యకు రాసిన సూసైడ్ లెటర్ కన్నీళ్లు పెట్టిస్తోంది. ‘డియర్ రజనీ. నిన్ను చాలా బాధపెట్టా. మనకు ఎవరూ లేరు. పిల్లలు అలా కాకూడదని చాలా ఊహలు కన్నా. కానీ ఏదీ కుదరలేదు. వచ్చే జన్మలో నా పిల్లలకే కొడుకుగా పుడతా’ అని రాశారు. తాను కొందరి వద్ద చేసిన అప్పును చెల్లించాలని భార్యను కోరారు.

News August 18, 2024

చివరి వరకూ రహస్యంగానే(2/2)

image

ఎమిలీ ఓ భారతీయుడి వద్ద పని చేయడం ఆమె పేరెంట్స్‌కు ఇష్టం లేదు. అయితే బోస్‌ను కలిసిన తర్వాత వారు తమ అభిప్రాయం మార్చుకున్నారు. ఇక ఎమిలీతో ప్రేమలో ఉన్న సుభాష్ చంద్రబోస్ ఆమెకు తరచూ ప్రేమ లేఖలు రాస్తుండేవారు. వీరి వివాహం 1937 డిసెంబర్ 27న ఆస్ట్రియాలో జరిగింది. వీరికి ఓ కూతురు అనితా బోస్ ఫాఫ్. విదేశీ వనితను పెళ్లాడారన్న ఇమేజ్ ఆయనపై ప్రభావం చూపే అవకాశం ఉందని వివాహాన్ని వారు చివరి వరకూ రహస్యంగానే ఉంచారు.

News August 18, 2024

బోస్‌ – ఎమిలీ.. ఓ రహస్య ప్రేమకథ(1/2)

image

సుభాష్ చంద్రబోస్ 1934లో యూరప్‌లో ఉండగా ‘ది ఇండియన్ స్ట్రగుల్’ పుస్తకం రాయడానికి పూనుకున్నారు. దానికి ఇంగ్లిష్ తెలిసిన ఎమిలీ షెంకెల్(23)ని అసిస్టెంట్‌గా నియమించుకున్నారు. ఆమె ఆస్ట్రియాలోని క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు. ఆమె తన మనసులో ప్రేమ విత్తనం నాటుతుందని బోస్ ఊహించలేకపోయారు. మొదట బోసే ప్రేమ విషయాన్ని ఆమెకు చెప్పారని బోస్ సోదరుడి మనవడు సుగత్ బోస్ ఓ పుస్తకంలో రాశారు. > నేడు బోస్ వర్ధంతి.

News August 18, 2024

ఇతని మరణానికి కారణం ఎవరు?: కేటీఆర్

image

TG: ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలన్నీ అవాస్తవాలని కేటీఆర్ విమర్శించారు. సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న వసీమ్ అనే ఉద్యోగి 3 నెలలుగా జీతాలు రాక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని Xలో పోస్టు చేశారు. అతని మరణానికి బాధ్యులెవరు? అని ప్రశ్నించారు.

News August 18, 2024

ఏపీలో మరో దారుణం

image

AP: భర్తను చితక్కొట్టి, అతని భార్యపై ముగ్గురు యువకులు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఏలూరులో సంచలనంగా మారింది. జీవనోపాధి కోసం వచ్చి రామకోటిలో ఉంటున్న ఈ జంటకు జులాయిగా తిరిగే ఈ యువకులు పరిచయమయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి మహిళ భర్తతో కలిసి మద్యం సేవించిన ఉన్మాదులు అతడిపై దాడి చేసి, భార్యను కొద్ది దూరం లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

News August 18, 2024

మహిళల బ్యాంక్ డిపాజిట్ల మొత్తం రూ.39 లక్షల కోట్లు

image

గత ఏడాది మార్చి నాటికి దేశంలో మొత్తం 252 కోట్ల బ్యాంకు ఖాతాలుండగా, అందులో 91.77 కోట్లు(36.4%) మహిళలవని NSO వెల్లడించింది. డిపాజిట్ల మొత్తం రూ.187 లక్షల కోట్లు కాగా మగువల వాటా కేవలం రూ.39 లక్షల కోట్లు(20.8%) అని తెలిపింది. అయితే పట్టణాలతో పోలిస్తే గ్రామీణ స్త్రీల డిపాజిట్లే అధికమంది. అలాగే బ్యాంకుల్లో 13.2 లక్షల మంది పురుషులు పని చేస్తుండగా, మహిళా ఉద్యోగులు 4.41 లక్షలేనని పేర్కొంది.

News August 18, 2024

నీరజ్ అందుకే ఫౌల్స్ వేశాడు: PCI ప్రెసిడెంట్

image

పారిస్ ఒలింపిక్స్‌ జావెలిన్ త్రో ఫైనల్స్‌లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా ఫౌల్స్ వేయడంపై పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఝఝారియా స్పందించారు. ‘పాక్ అథ్లెట్ నదీమ్ వేసిన 92.97M త్రోను ఎలాగైనా అధిగమించాలనే ఉద్దేశంతో నీరజ్ ఎక్కువ ఎఫర్ట్ పెట్టారు. అప్పటికే 89Mతో తాను రెండో స్థానంలో ఉండటంతో ఫౌల్స్ గురించి పట్టించుకోలేదు. ఈక్రమంలోనే ఫౌల్స్ అయ్యాయి’ అని ఝఝారియా చెప్పారు.

News August 18, 2024

రుణమాఫీ కోసం రోడ్డెక్కిన రైతన్నలు

image

TG: 3వ విడతలోనూ తమకు రుణమాఫీ కాలేదని రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టి రహదారులపై రాకపోకలను అడ్డుకున్నారు. నిజామాబాద్, జగిత్యాల రైతులు నిరసనకు దిగారు. ADBలో CM దిష్టిబొమ్మతో శవయాత్ర చేశారు. కర్మకాండ కుండలతో మహారాష్ట్ర బ్యాంకులోకి వెళ్లి CM డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. KMNRలోని కొత్తపల్లి మండలంలో ఇండియన్ బ్యాంక్‌ను రైతులు మూసేశారు.

News August 18, 2024

ఫోన్‌పే, గూగుల్‌పేలో కరెంట్ బిల్లులు కట్టొచ్చు

image

TG: ఫోన్‌పే, గూగుల్‌పేలో కరెంట్ బిల్లులు చెల్లించవచ్చని TGNPDCL వెల్లడించింది. మొన్న TGSPDCL పరిధిలో ఈ సౌకర్యం రాగా.. తాజాగా NPDCL పరిధిలోనూ అందుబాటులోకి వచ్చింది. భారత్ బిల్‌పేలో చేరకపోవడంతో RBI ఆదేశాలతో ఈ సంస్థలు ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించడాన్ని జులై 1న నిలిపివేశాయి. తాజాగా భారత్ బిల్‌పేలో చేరడంతో గతంలో మాదిరిగానే విద్యుత్ బిల్లులు UPI యాప్‌లలో నేరుగా చెల్లించవచ్చు.

News August 18, 2024

జనగామ జిల్లాకు పాపన్న గౌడ్ పేరు పెట్టాలి: శ్రీనివాస్ గౌడ్

image

TG: జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఇవాళ పాపన్న జయంతి సందర్భంగా ప్రభుత్వం జిల్లాకు ఆయన పేరు ప్రకటించాలని కోరారు. ట్యాంక్‌బండ్‌పై బహుజన పోరాటయోధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విగ్రహ ఏర్పాటు కోసం గతంలో తమ ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు.