India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఫోన్ వ్యసనం ఓ బాలుడి ప్రాణం తీసింది. బెంగళూరుకు చెందిన రవికుమార్ కొడుకు తేజస్(14) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అతడు చదువుపై దృష్టి పెట్టకుండా అస్తమానం ఫోన్ చూసేవాడు. ఈక్రమంలోనే మొబైల్ పాడవడంతో రిపేర్ చేయించాలని తండ్రితో వాదనకు దిగాడు. దీంతో కోపోద్రిక్తుడైన రవి క్రికెట్ బ్యాట్తో అతడిని చితకబాదాడు. అంతటితో ఆగకుండా తేజస్ తలను బలంగా గోడకేసి బాదాడు. తీవ్రంగా గాయపడ్డ బాలుడు ప్రాణాలు విడిచాడు.

సాయుధ మిలిటెంట్లపై చర్యలు తీసుకునేందుకు మణిపుర్ ప్రభుత్వానికి అక్కడి మైతేయ్ పౌర హక్కుల సంఘాలు 24 గంటలు టైమ్ ఇస్తూ అల్టిమేటం జారీ చేశాయి. శనివారం ఓ మూక రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ నివాసంలోకి వెళ్లేందుకు యత్నించిన సంగతి తెలిసిందే. ‘సాయుధ మూకలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రజల ఆగ్రహం ఎలా ఉంటుందో చూపిస్తాం’ అని మైతేయ్ సంఘాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం 5 జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.

TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 4696 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టులో మొత్తం 10683 కుటుంబాలు నిర్వాసితులు కాగా ఇప్పటికే 5987 మంది లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించారు. మిగిలిన వారికి తాజాగా ఇళ్లు మంజూరు చేశారు.

సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్-రష్మిక నటించిన పుష్ప-2 సినిమా అమెరికాలో రికార్డులు సృష్టిస్తోంది. ట్రైలర్ విడుదల కాకముందే ప్రీమియర్స్(DEC 4) కోసం అత్యంత వేగంగా 30+వేల టికెట్లు అమ్ముడుపోయిన చిత్రంగా నిలిచింది. మొత్తంగా ఇప్పటికే 8.52 లక్షల డాలర్ల కలెక్షన్లను సాధించినట్లు మూవీ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ సా.6.03 గంటలకు ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది.

మణిపుర్లో పర్యటించి హింసాత్మక ప్రాంతాల్లో శాంతి స్థాపనకు కృషి చేయాలని PM మోదీని రాహుల్ గాంధీ మరోసారి కోరారు. మణిపుర్లో మళ్లీ హింస చెలరేగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా హింస జరుగుతున్నా సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తాయని దేశ ప్రజలు ఆశగా ఎదురుచూశారన్నారు. విదేశీ పర్యటనలకు మోదీ ప్రాధాన్యమిస్తుండడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది.

కర్ణాటక ప్రజల్ని దోచుకుని ఆ డబ్బును మహారాష్ట్రలో ఎన్నికల కోసం కాంగ్రెస్ తరలిస్తోందని PM మోదీ చేసిన ఆరోపణలపై కర్ణాటక CM సిద్దరామయ్య మండిపడ్డారు. ప్రధాని ఆ ఆరోపణల్ని నిరూపిస్తే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొంటానని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో శపథం చేశారు. ‘మోదీ ఇష్టానుసారంగా అబద్ధాలాడి వెళ్లిపోతారు. తను చెప్పిన మాటలకు ప్రూఫ్ చూపించగలరా? నా సవాలు స్వీకరిస్తారా? ఆయనకెందుకు భయం?’ అని ప్రశ్నించారు.

పిల్లలు పిడుగులు అంటే ఇదేనేమో. టీచర్ మీద కోపంతో బాంబు తయారుచేసి పేల్చారు. హరియాణాలో ఓ సైన్స్ టీచర్ 12వ తరగతి విద్యార్థులను తిట్టారు. ఇది మనసులో పెట్టుకున్న స్టూడెంట్స్ ప్రాంక్ చేద్దామని యూట్యూబ్లో చూసి చిన్న బాంబు తయారుచేశారు. టీచర్ చైర్ కింద పెట్టి రిమోట్ కంట్రోల్తో పేల్చేశారు. ఈ ఘటనలో టీచర్కు ఎలాంటి గాయాలు కాలేదు. ఆ విద్యార్థులను ప్రిన్సిపల్ సస్పెండ్ చేయగా టీచర్ క్షమించడంతో వదిలిపెట్టారు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పాల్గొనేందుకు రోహిత్ శర్మ వీలైనంత త్వరగా ఆస్ట్రేలియా వెళ్లాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. ‘రోహిత్ అద్భుతమైన కెప్టెన్. ప్రతిష్ఠాత్మక టోర్నీలో భారత జట్టుకు అతడి లీడర్షిప్ అవసరం. రోహిత్ భార్య ఇప్పటికే బిడ్డకు జన్మనిచ్చారు కాబట్టి అతడు వెళ్లి పెర్త్ టెస్ట్ ఆడాలి’ అని సూచించారు. ఈ సిరీస్ తర్వాత రోహిత్ మళ్లీ ఆస్ట్రేలియా వెళ్లకపోవచ్చని గంగూలీ వ్యాఖ్యానించారు.

నేరస్థులు, మావోలు, సంఘవిద్రోహ శక్తులను పట్టుకునేందుకు వారిస్థాయిని బట్టి పోలీసులు రివార్డులు ప్రకటించడం సహజం. అయితే రాజస్థాన్లోని లఖన్పుర్ పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. ఖుబీరామ్ జాట్(48) అనే క్రిమినల్పై కేవలం పావలా రివార్డు ప్రకటించారు. నేరస్థుల స్థాయిని తక్కువ చేసి చూపడం, వారు కోరుకునే గుర్తింపును దక్కకుండా చేయడం కోసమే పోలీసులు ఇలా చేసినట్లు తెలుస్తోంది.

TG: రాష్ట్రంలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నెల 23న ఆన్లైన్ పరీక్ష నిర్వహించనున్నట్టు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. హాల్టికెట్లను <
Sorry, no posts matched your criteria.