News November 16, 2024

నయన్ పోస్ట్‌పై త్వరలోనే స్పందించనున్న ధనుష్!

image

హీరో ధనుష్‌పై హీరోయిన్ నయనతార <<14627063>>సంచలన పోస్ట్ <<>>నేపథ్యంలో ఆయన తరఫు లాయర్ స్పందించారు. హీరోయిన్ పోస్ట్‌కు త్వరలోనే ధనుష్ సమాధానం చెప్తారని పేర్కొన్నారు. కాగా నయనతారపై చేసిన డాక్యుమెంటరీ‌ ట్రైలర్‌లో ఉపయోగించిన 3 సెకన్ల వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ధనుష్ లీగల్ నోటీసులు జారీ చేశారు. దీనిపై నయన్ తీవ్రంగా స్పందిస్తూ పోస్ట్ చేశారు.

News November 16, 2024

చిన్నాన్నతో అనుబంధం మరువలేనిది: లోకేశ్

image

AP: తన చిన్నాన్న నారా రామ్మూర్తి నాయుడి మృతితో మంత్రి నారా లోకేశ్ ఎమోషనల్ అయ్యారు. చిన్నాన్నతో చిన్నప్పటి అనుబంధం కళ్ల ముందే మెదలాడుతోందన్నారు. ‘ఇన్నాళ్లు ఆయన కంటికి కనిపించే ధైర్యం. కానీ ఇకపై చిరకాల జ్ఞాపకం. అంతులేని దుఖంలో ఉన్న పిన్ని, తమ్ముళ్లు ధైర్యంగా ఉండాలి. చిన్నాన్న ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.

News November 16, 2024

వ్యాక్సిన్ల వ్యతిరేకికి వైద్యశాఖ.. ఫార్మా కంపెనీలకు ప్రతికూలమే!

image

వ్యాక్సిన్ల‌కు బ‌ద్ద‌వ్య‌తిరేకి అయిన రాబ‌ర్ట్ ఎఫ్ కెనెడీను US ఆరోగ్య‌ మంత్రిగా ట్రంప్ నామినేట్ చేయడం భారత ఫార్మా సంస్థలపై ప్రభావం చూపవచ్చని తెలుస్తోంది. 2023-24లో విదేశీ ఎగుమ‌తుల్లో అమెరికాకు భార‌త్ 31% మందులు స‌ర‌ఫ‌రా చేసింది. 2024-25లో US$ 7.2 బిలియ‌న్ల విలువైన మందులను విదేశాలకు భారత్ ఎగుమతి చేసింది. కెనడీ రాక భారత్ సహా ఇతర దేశాల సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చన్నది విశ్లేషకుల అభిప్రాయం.

News November 16, 2024

AP అసెంబ్లీ న్యూస్ రౌండప్

image

* టిడ్కో ఇళ్ల అక్రమాలపై విచారణ జరిపించాలి: MLAలు
* 2019కల్లా 313832 ఇళ్లు 90శాతం పూర్తి: GV ఆంజనేయులు
* టిడ్కో ఇళ్లను YCP నేతలు అమ్ముకున్నారు: పల్లా
* సోషల్ మీడియా సైకోలను శిక్షించాలి: గౌతు శిరీష
* తుంగభద్ర గేట్లు మార్చేందుకు నిధులు కేటాయించాలి: కాలవ శ్రీనివాసులు
* మల్లవల్లి పారిశ్రామిక వాడకు భూములు కేటాయించాలి: యార్లగడ్డ
* వెలిగొండపై YCP సినిమా స్టైల్ ప్రచారం: ఉగ్ర నరసింహారెడ్డి

News November 16, 2024

‘మేడిన్ ఇండియా’కు రెస్పెక్ట్ పెరిగింది: వేదాంత ఫౌండర్

image

భారత్‌‌కు, భారతీయులకు, భారతీయ ఉత్పత్తులకు ప్రపంచంలో అత్యధిక డిమాండ్ ఏర్పడిందని వేదాంత ఫౌండర్ అనిల్ అగర్వాల్ అన్నారు. మన దేశం ఈ పరిస్థితికి చేరిన విధానం ఇతర దేశాలు అనుసరించేందుకు ఒక మోడల్‌గా మారిందన్నారు. భారతీయ ప్రతిభావంతులకు ఉద్యోగాలిచ్చేందుకు కంపెనీలు వెంటపడుతున్నాయని తెలిపారు. ‘మేడిన్ ఇండియా’ లేబుల్‌కు ఇప్పుడు గౌరవం పెరిగిందని, దేశంలో అవకాశాలను పెంచిందని HTLS 2024లో వెల్లడించారు.

News November 16, 2024

ఏఆర్ రెహమాన్‌కు ఐఐటీ మద్రాస్ అవార్డు

image

సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు ఎక్స్‌పీరియెన్షియల్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్(XTIC) పురస్కారాన్ని మద్రాస్ ఐఐటీ ప్రకటించింది. వర్చువల్ రియాలిటీ సినిమా ‘లే మస్క్’కు పనిచేసినందుకు గాను ఆయనకు ఈ అవార్డు ఇస్తున్నట్లు తెలిపింది. రేపు జరిగే ‘XR’ సదస్సులో ఈ అవార్డును ఆయనకు అందిస్తామని వెల్లడించింది.

News November 16, 2024

నెలలో నారా రోహిత్ పెళ్లి.. ఈలోగా తండ్రి రామ్మూర్తి మరణం

image

AP: చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు TDP తరఫున 1994లో గల్లా అరుణపై చంద్రగిరి MLAగా గెలిచారు. 1999లో ఆమెపైనే ఓడిపోయారు. అనంతరం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. చంద్రబాబు, రామ్మూర్తి మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. అప్పట్లోనే తన తమ్ముడికి MLA టికెట్ ఇప్పించుకుని గెలిపించుకున్నారు. రామ్మూర్తికి భార్య ఇందిర, కుమారులు రోహిత్, గిరీశ్ ఉన్నారు. రోహిత్ పెళ్లి సరిగ్గా నెల రోజులు ఉందనగా ఆయన మరణించారు.

News November 16, 2024

మెట్రో రెండో దశ భూసేకరణకు ఆమోదం

image

TG: మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ నిర్మాణానికి ముందడుగు పడింది. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ గుట్ట వరకు మెట్రో నిర్మాణానికి భూసేకరణకు కలెక్టర్ ఆమోదం తెలిపారు. దీంతో భూసేకరణ పనులు ప్రారంభం కానున్నాయి. సీఎం ఆదేశాలతో ఇప్పటికే ఈ మార్గంలోని 200లకు పైగా ఆస్తులకు డిక్లరేషన్ ఇచ్చారు. ఆస్తుల సేకరణ పూర్తయ్యాక డిసెంబర్‌లో అవార్డు ఆమోదం పొందుతుంది. జనవరిలో మెట్రో రైలు పనులు ప్రారంభమవుతాయని కలెక్టర్ పేర్కొన్నారు.

News November 16, 2024

‘ఆరెంజ్’ మూవీ హీరోయిన్‌ ఎంగేజ్మెంట్

image

తనకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు హీరోయిన్ షాజన్ పదమ్సీ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తన ప్రియుడు, బిజినెస్‌మెన్ ఆశిష్ కనాకియాతో ఆమె వివాహం జరగనుంది. కాగా, కొత్త జీవితంలోకి అడుగుపెట్టేందుకు ఆగలేకపోతున్నానంటూ కాబేయే భర్తతో ఉన్న ఫొటోలను ఆమె పంచుకున్నారు. రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ మూవీతో షాజన్ గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మసాలా’ మూవీలోనూ ఆమె నటించారు.

News November 16, 2024

గ్రూప్-3 పరీక్షలు.. అభ్యర్థులకు ALERT

image

TG: రేపటి నుంచి రెండు రోజుల పాటు <<14624157>>గ్రూప్-3 పరీక్షలు<<>> జరగనున్నాయి. ఎగ్జామ్ రాసే అభ్యర్థులు తమ వెంట తప్పనిసరిగా ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. డూప్లికేట్ హాల్ టికెట్ జారీ చేయరు. తుది ఎంపిక పూర్తయ్యే వరకు హాల్ టికెట్స్, ప్రశ్నపత్రాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. తప్పుడు గుర్తింపు పత్రాలతో, అభ్యర్థి స్థానంలో ఇతరులు హాజరైనా క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు.