India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హీరో జయం రవి, ఆర్తి విడాకుల కేసుపై చెన్నై కోర్టులో విచారణ జరిగింది. రవి నేరుగా కోర్టుకు రాగా ఆర్తి వర్చువల్గా హాజరయ్యారు. ఇరువురి లాయర్ల వాదనలు విన్న న్యాయస్థానం మరోసారి ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలని చెప్పింది. రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నించాలని సూచించింది. విడిపోవడమే సబబు అనుకుంటే కచ్చితమైన కారణాన్ని తెలియజేయాలని పేర్కొంది. కాగా 2009లో పెళ్లి చేసుకున్న రవి, ఆర్తికి ఇద్దరు పిల్లలున్నారు.

ఝార్ఖండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ శుక్రవారం ఐఏఎఫ్ విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. ముందుగా ఆయన ప్రయాణించాల్సిన విమానంలో <<14619050>>సాంకేతిక లోపం<<>> తలెత్తింది. దీంతో ఆయన దేవ్ఘర్ విమానాశ్రయంలో వేచిచూడాల్సి వచ్చింది. కొంత సమయం తరువాత కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో చివరికి ఐఏఎఫ్ విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. మోదీ విమానంలో సమస్య కారణంగా ఇతర విమానాల టేకాఫ్, ల్యాండింగ్ ఆలస్యమైంది.

భారత్లో వారానికి 5 రోజుల పని విధానం నిరాశపరిచిందని, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ను తాను నమ్మనని పేర్కొన్న ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆయనలాంటి వారివల్లే వర్క్ ప్లేసెస్ టాక్సిక్ అవుతున్నాయని అంటున్నారు. ఈవై కంపెనీలో వీకాఫ్ లేకుండా కొన్నినెలలు రోజుకు 14 గంటలు పనిచేస్తూ ఉద్యోగి మరణించడాన్ని గుర్తుచేస్తున్నారు. అలాంటి చావులకు ఇలాంటి బాస్లే కారణం అంటున్నారు. మీ కామెంట్.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ మూవీ ట్రైలర్ ఎల్లుండి విడుదల కానుంది. పట్నాలోని గాంధీ మైదాన్లో 17న సాయంత్రం 5 గంటలకు ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 5న ఈ మూవీ విడుదల కానుంది.

అమెరికా డాలర్ బలపడటంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. స్పాట్ గోల్డ్ విలువ ఈ వారంలోనే 4% మేర పతనమైంది. దీంతో ఈ మూడేళ్లలో పుత్తడికి ఇదే వరస్ట్ వీక్గా మారింది. యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల తగ్గింపులో దూకుడు ప్రదర్శించదన్న అంచనాలూ మరో కారణం. హైదరాబాద్లో OCT 30న రూ.81,885గా ఉన్న 10గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.77500కు తగ్గింది. డాలర్ బలహీనపడితేనే మళ్లీ గోల్డ్ ధరలకు రెక్కలొస్తాయని నిపుణులు అంటున్నారు.

TG: పలువురు బీఆర్ఎస్ అగ్ర నాయకులు బీజేపీలోకి వెళ్తారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్, హరీశ్ రావు ఒకే పార్టీలో ఉండబోరని ఆయన జోస్యం చెప్పారు. త్వరలోనే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారని మహేశ్ వ్యాఖ్యానించారు. ఇక ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రేపటి నుంచి తాను జిల్లాల్లో పర్యటిస్తానని ఆయన వెల్లడించారు.

AP: సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్న ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించడంతో పాటు నిధులు కేటాయించాలని కోరనున్నారు. అనంతరం విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్తో భేటీ కానున్నారు. మరికొందరు కేంద్రమంత్రులను సైతం సీఎం కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సూర్య నటించిన ‘కంగువా’ మూవీని పైరసీ భూతం వెంటాడుతోంది. నిన్న విడుదలైన ఈ సినిమా పలు వెబ్సైట్లలో దర్శనమివ్వడం మేకర్స్ని షాకింగ్కు గురి చేస్తోంది. తమిళ్ రాకర్స్, ఫిల్మీజిల్లా, మూవీ రూల్స్, టెలిగ్రామ్ తదితర సైట్లలో కంగువా HD ప్రింట్ అందుబాటులో ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రూ.కోట్లు ఖర్చు పెట్టిన సినిమాను ఇలా పైరసీ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూర్య ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

కొన్ని ప్రేమ కథలు కాలాల్ని దాటి ప్రయాణిస్తాయి. అలాంటిదే ఈ కథ. ఆర్కియాలజిస్టుల కథనం ప్రకారం.. 2800 ఏళ్ల క్రితం ఇరాన్లోని టెప్పే హసన్లు ప్రాంతానికి చెందిన ఓ జంట, తమ తండాలో కార్చిచ్చు నుంచి పారిపోతూ ఓ గుంతలో తలదాచుకున్నారు. మృత్యువు వెంటాడటంతో ప్రాణాలు పోయే చివరి క్షణంలో ఒకరినొకరు ముద్దాడారు. 1972లో ఈ ప్రేమికుల అస్థిపంజరాలు వెలుగుచూశాయి. ఆ ప్రాంతం పేరిట వీరిని ‘హసన్లూ ప్రేమికులు’గా పిలుస్తున్నారు.

నందమూరి మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మూవీలో విలన్ రోల్కి తమిళ నటుడు విక్రమ్ తనయుడు ధ్రువ్ను సంప్రదించారని భోగట్టా. అందుకాయన సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. ఇక హీరోయిన్గా రవీనా టాండన్ కుమార్తె రాశా థడానీని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. బాలయ్య క్లైమాక్స్లో ప్రత్యేక పాత్రలో తళుక్కుమంటారని మూవీ టీమ్ చెబుతోంది.
Sorry, no posts matched your criteria.