India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొరియన్ మహిళలు వయసు పెరిగినా కూడా మెరిసే పాలరాయి శిల్పంలా కనిపిస్తారు. దీనికి కారణం చర్మాన్ని తేమగా ఉంచే క్లీన్స్, టోన్లు, మాయిశ్చరైజ్ చేసే మల్టీ స్టెప్ స్కిన్ కేర్, సన్ స్క్రీన్ లోషన్స్ ఉపయోగించడమే. పులియబెట్టిన ఆహారం తీసుకోవడం, రోజంతా హైడ్రేటెడ్గా ఉండటం, కంటి నిండా నిద్ర పోవడం, ఒత్తిడి లేకుండా, జంక్ ఫుడ్కు దూరంగా ఉండటం, బరువును అదుపులో ఉంచుకోవడం వంటివి వారి అందానికి కారణాలుగా ఉన్నాయి.
TG: మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. దీనిపై విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయన వ్యాఖ్యలు మహిళల్ని కించపరిచేలా ఉన్నాయని కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ల శారద Xలో అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై మాట్లాడుతూ ‘బస్సుల్లో కుట్లు, అల్లికలు కాదు. బ్రేక్ డాన్సులు వేసుకున్నా మాకు అభ్యంతరం లేదు’ అని KTR వ్యాఖ్యానించడం వివాదాస్పదమవుతోంది.
AP: అన్నక్యాంటీన్లలో రూ.15కే కడుపు నింపుకోవచ్చు. తొలి విడతలో ప్రభుత్వం 100 క్యాంటీన్లను ప్రారంభించింది. అయితే ఆస్పత్రుల వద్ద వీటిని ఏర్పాటు చేస్తే చాలా మందికి ప్రయోజనం కలుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రోగిని చూసుకునే అటెండెంట్ బయట హోటల్లో ఒక్కపూట భోజనం చేయాలంటే కనీసం రూ.50 నుంచి రూ.80 ఖర్చవుతోంది. వీటి ఏర్పాటుతో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ రూ.15తో చేయొచ్చు. మీరేమంటారు?
కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై <<13822185>>హత్యాచారం<<>> ఘటన గురించి దేశం మొత్తం చర్చిస్తోంది. తాజాగా దీనిపై బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ స్పందించారు. ‘ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండే సమాజం మనకు కావాలి. కానీ అది పరిణామం చెందేందుకు ఏళ్లు పడుతుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే కఠినమైన శిక్షలే ఏకైక మార్గం. బాధిత కుటుంబానికి నేను అండగా ఉంటా. నిన్న రాత్రి దాడికి గురైన వైద్యులందరికీ సపోర్ట్గా ఉంటా’ అని ట్వీట్ చేశారు.
AP: మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాస్పై ‘ఆట్యపాట్య’ సంస్థ సీఈవో ప్రసాద్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో అవినీతికి పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరపాలని ఎన్టీఆర్ జిల్లా సీపీని సీఐడీ ఏడీజీ ఆదేశించారు.
CM చంద్రబాబు ఇవాళ 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. సెప్టెంబర్ చివరి నాటికి 203 క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ క్యాంటీన్ల నిర్వహణకు రోజుకు రూ.53 లక్షల ఖర్చు అవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. అల్పాహారానికి రూ.22, మధ్యాహ్న, రాత్రి భోజనానికి కలిపి రూ.68 ఖర్చుతో ఒక్కరికి మూడు పూటలకు రూ.90 అవుతుందని పేర్కొంది. తినేవారు రూ.15 చెల్లిస్తే మిగతా రూ.75 ప్రభుత్వం, దాతలు ఖర్చు పెడతాయి.
విమాన ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈక్రమంలో రద్దీకి అనుగుణంగా విమానాశ్రయాలు సైతం పెరుగుతున్నాయి. అయితే, సౌదీ అరేబియాలోని కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఓ దేశ విస్తీర్ణం కంటే కూడా పెద్దదనే విషయం మీకు తెలుసా? ఈ విమానాశ్రయం 780 చ.కిలోమీటర్ల విస్తీర్ణంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఇది మూడు ఎయిర్పోర్టులున్న బహ్రెయిన్ దేశం కంటే కూడా పెద్దది.
ప్రమాదకరమైన <<13855532>>ఎంపాక్స్ వైరస్<<>> విస్తరిస్తోంది. తాజాగా ఆఫ్రికా వెలుపల స్వీడన్లో మొదటి కేసు నమోదైందని పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ వెల్లడించింది. క్లాడ్ I వేరియంట్ వల్ల ఓ వ్యక్తికి mpox సోకినట్లు నిర్ధారణ అయింది. కాగా ఇప్పటికే WHO గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే.
లోన్ ఏజెంట్ల వేధింపులు ఓ కుటుంబం మొత్తాన్ని బలితీసుకున్నాయి. కర్ణాటకలోని హాసన్కు చెందిన శ్రీనివాస్ క్యాబ్ డ్రైవర్. అతని భార్య శ్వేత ప్రైవేట్ టీచర్. తీసుకున్న లోన్ చెల్లించలేదని ఏజెంట్లు వేధించడంతో దంపతులిద్దరూ తమ కూతురు నాగశ్రీ(13)తో కలిసి కెనాల్లో దూకారు. కుటుంబ సభ్యులు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వగా, వారం రోజుల తర్వాత మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
AP: రేపు పార్వతీపురం, అల్లూరి, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. వైజాగ్, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, నంద్యాల, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూ.గో , ప.గో , కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరులో తేలికపాటి జల్లులు కురుస్తాయని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.