News August 14, 2024

హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్

image

కవలలు పుట్టారన్న సంతోషంలో ఉన్న ఓ తండ్రికి తీరని శోకం మిగిలింది. ఇజ్రాయెల్ చేసిన ఎయిర్‌స్ట్రైక్స్‌లో గాజా వాసి అబు కుటుంబం మృత్యువాతపడింది. నాలుగు రోజుల క్రితం పుట్టిన అసెర్, ఐసెల్‌ తమ అమ్మ ఒడిలో సేదతీరుతుండగా వారి ఇంటిపై బాంబు పడింది. దీంతో పిల్లలతో పాటు అబు భార్య, తల్లి మరణించారు. ఆ సమయంలో బర్త్ సర్టిఫికెట్ కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లిన అతడికి విషయం తెలిసి గుండె పగిలింది.

News August 14, 2024

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (సికింద్రాబాద్) గుడ్ న్యూస్ చెప్పింది. జోన్ పరిధిలోని అన్ని స్టేషన్లలో క్యూఆర్ కోడ్ ద్వారా నగదు చెల్లింపుల సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. డిజిటల్ చెల్లింపులను SCR ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని తెలిపింది. కౌంటర్ వద్ద ఉంచిన ప్రత్యేక డివైజ్‌లో వచ్చే క్యూఆర్ కోడ్ సాయంతో పేమెంట్ చేసి, టికెట్ పొందవచ్చని వెల్లడించింది. దీనివల్ల చిల్లర సమస్యలు తీరనున్నాయి.

News August 14, 2024

అవసరమైతే నన్ను తిట్టండి: మమతా బెనర్జీ

image

కోల్‌కతాలో డాక్టర్‌పై హత్యాచార ఘటనలో అన్ని చర్యలు తీసుకున్నా తమపై దుష్ప్రచారం జరుగుతోందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. అవసరమైతే తనను తిట్టొచ్చని, కానీ బెంగాల్‌ని దూషించొద్దని కోరారు. కేసు త్వరగా పరిష్కారమయ్యేందుకు సీబీఐకి పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకునేందుకు బీజేపీ, సీపీఐ బంగ్లాదేశ్ తరహాలో నిరసనలకు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు.

News August 14, 2024

SBI, PNBలకు కర్ణాటక సర్కార్ షాక్

image

కర్ణాటకలో సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. SBI, PNB(పంజాబ్ నేషనల్ బ్యాంక్)లతో అన్ని రకాల లావాదేవీలను సస్పెండ్ చేసింది. ఆయా బ్యాంకుల్లో ఉన్న ప్రభుత్వ అకౌంట్లను వెంటనే మూసివేయాలని అన్ని శాఖలకు ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఆదేశాలిచ్చింది. ఆ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన నిధులు దుర్వినియోగానికి గురవుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

News August 14, 2024

అన్న క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.కోటి విరాళం

image

AP: అన్న క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.కోటి విరాళం ఇచ్చారు. ‘అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్‌లో ఆకలి అనే పదం వినబడకూడదనే మహోన్నత లక్ష్యంతో చంద్రబాబు అన్న క్యాంటీన్లను పునఃప్రారంభిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజే అన్న క్యాంటీన్లు స్టార్ట్ అవుతుండటం శుభపరిణామం. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరఫున రూ.కోటి ఇచ్చాను. నిరుపేదల ఆకలి తీర్చే కార్యక్రమంలో మీరూ భాగస్వాములు అవ్వండి’ అని ఆమె ట్వీట్ చేశారు.

News August 14, 2024

ఫాక్స్‌కాన్ సీఈవోతో మోదీ చర్చలు

image

తైవాన్‌కు చెందిన దిగ్గజ కంపెనీ ‘ఫాక్స్‌కాన్’ సంస్థ సీఈవో యంగ్ లియు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఏఐ, సెమీకండక్టర్, ఫ్యూచరిస్టిక్ రంగాల గురించి ఆయనతో చర్చించారు. ‘భవిష్యత్‌లో ఇతర రంగాల్లో భారతదేశం అందించే అవకాశాలను నేను ఆయనకు వివరించా. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో భారతదేశంలో వారి పెట్టుబడి ప్రణాళికలపై కూడా మేము చర్చలు జరిపాము’ అని మోదీ ట్వీట్ చేశారు.

News August 14, 2024

ధనుష్ ‘3’ మరోసారి రీరిలీజ్

image

తమిళ స్టార్ హీరో ధనుష్, శ్రుతి హాసన్ జంటగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘3’ మరోసారి రీరిలీజ్ కానుంది. సెప్టెంబర్ 14న ఈ మూవీ తెలుగు వెర్షన్‌ను రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య తెరకెక్కించిన ఈ మూవీ 2012లో రిలీజవగా 2022లో రీరిలీజ్ చేశారు. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందించారు. థియేటర్లలో మరోసారి ‘3’ మూవీ చూసేందుకు మీరూ వెళ్తారా?

News August 14, 2024

ED నూతన డైరెక్టర్‌గా రాహుల్ నవీన్

image

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నూతన డైరెక్టర్‌గా 1993 బ్యాచ్‌కు చెందిన IRS రాహుల్ నవీన్ నియమితులయ్యారు. ప్రస్తుతం EDలోనే స్పెషల్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలం పూర్తయిన సందర్భంగా ED ఇన్‌ఛార్జ్ డైరెక్టర్‌గా రాహుల్ నవీన్‌ గతేడాది సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టారు.

News August 14, 2024

ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం చేసింది ఇతడే!

image

కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో <<13851492>>ట్రైనీ<<>> డాక్టర్‌పై హత్యాచార ఘటనతో దేశం ఉలిక్కిపడింది. ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టింది బిహార్‌కు చెందిన సంజయ్ రాయ్. ఇతడు కోల్‌కతాలో పోలీసు విభాగంలో పౌర వాలంటీర్‌గా పని చేస్తున్నాడు. 2022లో గర్భవతి అయిన భార్యపై దాడి చేయడంతో కేసు నమోదైంది. పలువురు మహిళల నంబర్లు తీసుకుని వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు సంజయ్‌ను ఇప్పటికే అరెస్టు చేశారు.

News August 14, 2024

ఆ ప్రచారంలో నిజం లేదు: RTC MD సజ్జనార్

image

TG: బస్సు డిపోలు ప్రైవేట్‌ పరమవుతాయనే ప్రచారంలో నిజం లేదని RTC MD సజ్జనార్ స్పష్టం చేశారు. TGSRTC ఆధ్వర్యంలోనే బస్సుల నిర్వహణ ఉంటుందన్నారు. ఎలక్ట్రిక్‌ బస్సులను అన్ని రూట్లలో తిప్పడం సాధ్యపడదన్నారు. ప్రతి డిపోలోనూ ఎలక్ట్రిక్‌, డీజిల్‌ బస్సులు నడుస్తాయన్నారు. ప్రైవేట్ అద్దె బస్సుల్లాగే ఎలక్ట్రిక్ బస్సులన్నీ TGSRTC ఆధ్వర్యంలోనే నడుస్తాయని, ఆదాయం నేరుగా సంస్థకే వస్తుందని వెల్లడించారు.