India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: వికారాబాద్ కలెక్టర్పై దాడి కేసులో కేటీఆర్ను అరెస్ట్ చేయాలని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఇలా అధికారులపై దాడులకు దిగడం దారుణమని ఆయన మండిపడ్డారు. మరోవైపు KTR అరెస్టు విషయంలో కాంగ్రెస్ ఎందుకు వెనక్కి తగ్గుతోందని విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ మూవీ ట్రైలర్ ఈ నెల 17న విడుదల కానుంది. పట్నాలో సాయంత్రం 5 గంటలకు లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ట్రైలర్ నిడివి 2 నిమిషాల 44 సెకన్లు ఉండనుంది. కాగా దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన నగరాల్లో మూవీ టీమ్ ప్రమోషన్లు చేయనుంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్గా మూవీ రిలీజ్ కానుంది.

AP: సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ పోస్టులు పెడుతూనే ఉంటామని YCP నేత ఆర్కే రోజా స్పష్టం చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అని ఆమె నిలదీశారు. ‘రాష్ట్రంలోని యువత, మహిళలు, రైతులను మోసం చేశారు. మహిళలకు రూ.1,500, విద్యార్థులకు రూ.15 వేలు, రైతులకు రూ.20 వేలు, యువతకు రూ.3 వేలు ఎగ్గొట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడతాం’ అని ఆమె ట్వీట్ చేశారు.

UP గ్రేటర్ నోయిడాకు చెందిన నితిన్ భాటి తన కొడుకుకు ఎడమ కంట్లో నుంచి తరచూ నీరు కారుతోందని ఆనంద్ స్పెక్ట్రమ్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు బాలుడి కంట్లో ఫారెన్ బాడీ(మెటల్ వంటి ధూళి) ఉన్నట్లు గుర్తించి, ఆపరేషన్ చేశారు. అయినా సమస్య తీరకపోవడంతో మరో ఆసుపత్రిని సంప్రదించారు. అయితే బాలుడి ఎడమ కంటికి కాకుండా కుడి కంటికి ఆపరేషన్ చేశారని తేలింది. ఘటనపై బాలుడి తండ్రి PSలో ఫిర్యాదు చేశారు.

టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించారు. టీ20ల్లో 200కుపైగా రన్స్ ఎక్కువ సార్లు కొట్టిన జట్టుకు నాయకత్వం వహించిన రెండో కెప్టెన్గా సూర్య (9) రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో ఆయన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (9) రికార్డును సమం చేశారు. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ (12) ఉన్నారు. మూడో స్థానంలో విండీస్ కెప్టెన్ రోవ్మన్ పావెల్ (7) కొనసాగుతున్నారు.

TG: కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఘనంగా విజయోత్సవాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. డిసెంబర్ 7న ట్యాంక్బండ్ పరిసరాల్లో, 8న సచివాలయ పరిసరాల్లో, 9న నెక్లెస్ రోడ్డులో వేడుకలు నిర్వహించనున్నారు. 9న సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీనికి రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని సీఎం నిర్ణయించారు.

సినీ ఇండస్ట్రీలో అత్యంత ధనవంతులెవరో తెలుసా? హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 ప్రకారం రూ.10వేల కోట్ల నికర విలువతో T-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అగ్రస్థానంలో ఉన్నారు. గతంలో కపూర్లు, చోప్రాలకే ఈ ట్యాగ్ ఉండేది. అయితే, ఇప్పుడు అత్యంత ధనవంతులైనప్పటికీ.. భూషన్ కుటుంబం ఒకప్పుడు పండ్లు అమ్ముకునేది. 1970లలో భూషన్ తండ్రి గుల్షన్ కుమార్ సంగీత క్యాసెట్లు విక్రయించే షాపును కొనుగోలు చేయడంతో వీరి రాత మారిపోయింది.

TG: వచ్చే నెలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో విజయోత్సవాలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన నేతలకు సూచించారు. ముఖ్యంగా మహిళా సాధికారత, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన పనులను వివరించాలని చెప్పారు. విజయోత్సవాల్లో భాగంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్ సభల్లో సీఎం పాల్గొనే అవకాశం ఉంది.

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న ‘NBK109’ నుంచి రేపు టైటిల్ & టీజర్ విడుదలవనుంది. ఉదయం 10.24 గంటలకే టీజర్ వీడియో రానుండటంతో ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘రేపు వచ్చే అదిరిపోయే BGM కోసం సిద్ధంగా ఉండండి. బాలయ్య బాబు సినిమాలకు తమన్ ఎందుకు మ్యూజిక్ అందించాలో మీకే తెలుస్తుంది’ అని చేసిన ట్వీట్ అంచనాలను పెంచేసింది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై నీలినీడలు కమ్ముకున్న సమయంలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్ విధానానికి అంగీకరించకపోతే ఈ టోర్నీ భారత్లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పాక్ టోర్నీ ఆడటానికి భారత్కు రాకపోతే శ్రీలంకను క్వాలిఫై చేస్తారని టాక్. ఈ విషయంపై ICC తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా CT పాక్లో జరగాల్సి ఉంది. కానీ అక్కడికి వెళ్లేందుకు ఇండియా ససేమిరా అంటోంది.
Sorry, no posts matched your criteria.