News November 14, 2024

Delhi Pollution: ప్రైమరీ స్కూళ్లు బంద్

image

ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్య స్థాయుల్ని త‌గ్గించేందుకు ఎయిర్ క్వాలిటీ క‌మిష‌న్ స్టేజ్‌-3 ప్ర‌ణాళికను శుక్రవారం నుంచి అమల్లోకి తేనుంది. దీని ప్రకారం ఎల‌క్ట్రిక్‌, CNG, BS-6 మినహా ఇంటర్ స్టేట్ బ‌స్సులు తిర‌గ‌డంపై నిషేధం. BS-3 పెట్రోల్‌, BS- 4 డీజిల్ ఫోర్ వీల‌ర్స్‌పై నిషేధం. ప్రజా రవాణా వాడాలని అధికారులు ప్రజలకు సూచించారు. ప్రైమరీ స్కూళ్లను మూసివేసి Online Classes నిర్వహించాలని CM ఆతిశీ ఆదేశించారు.

News November 14, 2024

స్టార్ క్రికెటర్ల చిన్ననాటి ఫొటోలు

image

ఇవాళ చిల్డ్రన్స్ డే కావడంతో తమ అభిమాన హీరోలు, క్రికెటర్ల చిన్ననాటి ఫొటోలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. క్రికెటర్లు రోహిత్ శర్మ, కోహ్లీ, సచిన్, ధోనీ, గిల్, యువరాజ్, పంత్, బుమ్రాల చైల్డ్‌హుడ్ ఫొటోలు తెగ వైరలవుతున్నాయి. నెలల బాబుగా ఉన్న రోహిత్ క్యూట్‌గా ఉన్నారని, మొదటిసారి ఈ ఫొటో చూస్తున్నామని కొందరు పోస్టులు చేస్తున్నారు. ఇందులో మీ అభిమాన క్రికెటర్ ఉన్నారా? కామెంట్ చేయండి.

News November 14, 2024

CBSE విద్యార్థులకు అల‌ర్ట్‌

image

వచ్చే ఏడాది 10, 12వ‌ తరగతి బోర్డు పరీక్షల్లో మార్పులు ఉంటాయని వస్తున్న వార్తల్ని CBSE కొట్టిపారేసింది. సిల‌బ‌స్ 15% త‌గ్గింపు స‌హా కొన్ని సబ్జెక్టుల్లో ఓపెన్‌-బుక్ ప‌రీక్ష‌ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డంపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని స్ప‌ష్టం చేసింది. ఇండోర్‌లో జ‌రిగిన ఓ స‌మావేశంలో సిల‌బ‌స్ త‌గ్గిస్తున్న‌ట్టు CBSE అధికారులు ప్ర‌క‌టించారని వార్త‌లు వ‌చ్చాయి. దీంతో బోర్డు ఈ వార్త‌ల్ని ఖండించింది.

News November 14, 2024

OTTలోకి ‘కంగువా’ ఎప్పుడంటే?

image

సూర్య నటించిన ‘కంగువా’ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. శివ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ రూ.100కోట్లకు దక్కించుకున్నట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కోలీవుడ్ సినిమాలు 4వారాలకే ఓటీటీలోకి వెళ్తుండగా, అందుకు భిన్నంగా ‘కంగువా’ 6వారాల ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ చివరి వారంలో ఇది ఓటీటీకి వచ్చే అవకాశం ఉంది.

News November 14, 2024

మన దేశంలో ఇలాంటివి చూడగలమా?

image

అమెరికా ప్రస్తుత, కాబోయే అధ్యక్షులు జో బైడెన్, ట్రంప్ భేటీ కావడాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. వారిద్దరూ ప్రపంచ రాజకీయాలు, అమెరికా పాలసీల గురించి చర్చించారు. అగ్రరాజ్యంలోని ఈ సంప్రదాయం బాగుందని, గత ప్రభుత్వ పాలసీలు కొత్త ప్రభుత్వానికి తెలుస్తాయని చెబుతున్నారు. ఇండియాలోనూ ఇలాంటి స్నేహపూర్వక రాజకీయాలు ఉండాలంటున్నారు. మరి మన దేశంలో అలాంటి ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఊహించడమైనా సాధ్యమేనా?

News November 14, 2024

దేశంలోని ప్రధాన నగరాల్లో కాలుష్యం ఎంతలా ఉందంటే?

image

కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఢిల్లీ విలవిలలాడుతోంది. ప్రస్తుతం వాయు నాణ్యత సూచిక (AQI) ప్రమాదకర స్థితిలో 432 వద్ద కొనసాగుతోంది. గాలిలో పొగ పెరగడంతో విజిబిలిటీ భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో AQI ఎలా ఉందో తెలుసుకుందాం. చండీగఢ్‌లో 418, లక్నోలో 234, నోయిడాలో 367, గురుగ్రామ్‌లో 309, చురులో 290, కోల్‌కతాలో 162, హైదరాబాద్‌లో 96, చెన్నైలో 44, బెంగళూరులో 49, ముంబైలో 127గా ఉంది.

News November 14, 2024

‘దేవర’@50 డేస్.. ఎన్ని సెంటర్లలో అంటే?

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ 50 డేస్ పూర్తి చేసుకుంది. 52 కేంద్రాల్లో 50 రోజులు ప్రదర్శితమైనట్లు మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 27న విడుదలైన సంగతి తెలిసిందే. కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు.

News November 14, 2024

కొత్త పెన్షన్లపై ప్రభుత్వం GOOD NEWS

image

AP: అర్హులైన పెన్షన్‌దారులు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పెన్షన్‌దారులు గ్రామంలో ఒకటి, రెండు నెలలు లేకపోయినా తదుపరి నెలలో పెన్షన్ మొత్తాన్ని కలిపి ఇవ్వాలని ఆదేశించారు. అనర్హులు పెన్షన్ తీసుకుంటున్నట్లు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

News November 14, 2024

చంద్రబాబూ.. నీపై 420 కేసు ఎందుకు పెట్టకూడదు?: రజిని

image

AP: సూపర్ సిక్స్ హామీలిచ్చి ఎగ్గొట్టిన చంద్రబాబుపై 420 కేసు ఎందుకు పెట్టకూడదని మాజీ మంత్రి రజిని ప్రశ్నించారు. ‘ఆడబిడ్డ నిధి, దీపం, తల్లికి వందనం, అన్నదాత పథకాలకు ఎన్ని కోట్లు కేటాయించావ్? ఉచిత బస్సుకు అతీగతీలేదు. ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావ్? రూ.4వేల పింఛన్ ఎంత మందికిచ్చావ్? ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తానంటున్నావ్? నాతో సహా మా పార్టీ కార్యకర్తలు నిలదీస్తూ కచ్చితంగా పోస్టులు పెడతారు’ అని తెలిపారు.

News November 14, 2024

ఎట్టకేలకు రిలయన్స్-డిస్నీ విలీనం పూర్తి

image

రిలయన్స్, డిస్నీ+హాట్‌స్టార్ విలీన ప్రక్రియ పూర్తైంది. ఈ సంస్థను జియో స్టార్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీకి ఛైర్‌పర్సన్‌గా నీతా అంబానీ, వైస్ ఛైర్‌పర్సన్‌గా ఉదయ్ శంకర్ వ్యవహరిస్తారు. రూ.70,353 కోట్లతో దేశంలోనే అతి పెద్ద మీడియా సామ్రాజ్యంగా నిలిచింది. ఈ కంపెనీలో రిలయన్స్ వాటా 63.16%, వాల్ట్ డిస్నీకి 36.84 % వాటా ఉంటుంది. ఈ రెండింటిలోని 100కు పైగా ఛానళ్లు ఒకే చోటకు రానున్నాయి.