India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు నుంచి తీర్పు ఎప్పుడైనా రావొచ్చని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మైసూర్ బజ్జీలో మైసూర్ ఉందనేది ఎంత వాస్తవమో, జాబ్ క్యాలెండర్లో జాబ్స్ ఉంటాయనేది అంతే నిజమని సెటైర్లు వేశారు. పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ అబద్ధం చెప్పారని దుయ్యబట్టారు. రుణమాఫీ కాకపోవడంతోనే రాహుల్ గాంధీ రాలేదని విమర్శించారు.
TG: కేసీఆర్, హరీశ్ రావు గతంలో అన్నీ బోగస్ మాటలు చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కొత్తగూడెంలోని పూసుగూడెంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని కేసీఆర్ ఎప్పుడూ అనుకోలేదని మండిపడ్డారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో బీఆర్ఎస్ రూ.వేల కోట్ల దోపిడీకి పాల్పడిందని దుయ్యబట్టారు. తాము ఖమ్మం జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు.
డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పవన్ కళ్యాణ్ స్వాతంత్ర్య దినోత్సవాల్లో పాల్గొన్నారు. కాకినాడలో ఏర్పాటుచేసిన జెండా ఆవిష్కరణ వేడుకకు కూతురు ఆద్యతో కలిసి వచ్చారు. ఈక్రమంలో స్టేజీపై కూతురుతో సెల్ఫీ తీసుకున్నారు. తండ్రి మొబైల్లో సెల్ఫీ తీస్తుంటే కూతురు మురిసిపోతూ ఇచ్చిన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఆద్య అంటే పవన్కు ఎంతో ఇష్టమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇష్టమైనవారి పేర్లు పచ్చబొట్టు వేయించుకోవడం కామనే. కానీ యూపీకి చెందిన అభిషేక్ గౌతమ్ అనే వ్యక్తి 631మంది అమరవీరుల ఫొటోలు, పేర్లను పచ్చబొట్టు వేయించుకుని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. మహాత్మా గాంధీ, ఛత్రపతి శివాజీ సహా భారత జవాన్లు, స్మారక చిహ్నాల ఫొటోలు వీటిలో ఉన్నాయి. గత ఏడాది లద్దాక్ వెళ్లినప్పుడు ఓ జవాను తమను రక్షించారని, అప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నానని గౌతమ్ తెలిపారు.
AP: జనాభా తగ్గిపోవడం ప్రమాదకరమని గుడివాడ సభలో CM చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈమధ్య ఒకే బిడ్డను కనాలనుకుంటున్నారు. కొంతమంది అసలు బిడ్డలే వద్దనుకుంటున్నారు. ఇది ప్రమాదకరం. ముసలివాళ్లు పెరిగి, యువత తగ్గిపోతోంది. దీని వల్ల సంపాదన కూడా తగ్గుతోంది. ఎంతమంది పిల్లలుంటే అంత సంపాదించే శక్తి మీకు వస్తుంది. ఒకప్పుడు జనాభా తగ్గించుకోమని నేనే చెప్పాను. కానీ ఇప్పుడు జనాభా పెరగాలి’ అని పిలుపునిచ్చారు.
నీరజ్ చోప్రా వంటి ఒలింపిక్ అథ్లెట్లూ కొత్త NCAను ఉపయోగించుకోవచ్చని BCCI కార్యదర్శి జైషా అన్నారు. ఇందులో అధునాతన వసతులు ఉంటాయన్నారు. వారణాసిలో స్టేడియం, జమ్ము- ఈశాన్య రాష్ట్రాల్లో 7 NCAలు నెలకొల్పుతామని ప్రకటించారు. బెంగళూరు NCAలో ప్రపంచ స్థాయి మైదానాలు, 45 ప్రాక్టీస్, ఇండోర్ క్రికెట్ పిచ్లు, ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్, అద్భుతమైన ట్రైనింగ్, రికవరీ, స్పోర్ట్స్ సైన్స్ సౌకర్యాలు ఉంటాయి.
కస్టమర్లకు SBI షాకిచ్చింది. రుణాల వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్ల మేర సవరించింది. పెరిగిన వడ్డీరేట్లు నేటి నుంచే అమల్లోకి వస్తాయంది. వరుసగా మూడో నెల బ్యాంకు వడ్డీరేట్లను పెంచడం గమనార్హం. తాజా సర్దుబాటుతో MCLR రేట్లు పెరుగుతాయి. దీంతో వేర్వేరు కాల వ్యవధుల్లో తీసుకొనే రుణాల ఖర్చు, వడ్డీ భారం అధికమవుతాయి. యూకో, కెనరా, బరోడా సహా పబ్లిక్ బ్యాంకులు కొన్ని రోజుల ముందే MCLR రేట్లను పెంచడం గమనార్హం.
AP: ఆకలితో అలమటించే పేదలకు 15 రూపాయలకే మూడు పూటలా ఆహారం అందించే బృహత్తరమైన కార్యక్రమం ‘అన్న క్యాంటీన్’ పథకమని సీఎం చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కాగా ఈ క్యాంటీన్ల ద్వారా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ లభించనుంది. ఆదివారం క్యాంటీన్కు సెలవు. ఏ రోజు ఏ ఆహారం అనే వివరాలు పైన ఫొటోలో చూడొచ్చు.
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నా ఆయన హాలీవుడ్ సినిమాలవైపు వెళ్లలేదు. దానికి గల కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ‘భారత్లో నా ఫ్యాన్స్ నాకు ఓ స్థాయిని ఇచ్చారు. హాలీవుడ్ నుంచి ఆ స్థాయికి తగ్గ పాత్ర ఎప్పుడూ రాలేదు. కేవలం అక్కడ నటించాలన్న ఆశ కోసం వారిచ్చిన స్థాయిని చిన్నది చేయలేను. ఆ స్టేటస్ను అందుకునే పాత్ర ఉంటే కచ్చితంగా చేస్తాను’ అని వివరించారు.
పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన అమన్ సెహ్రావత్కు రైల్వే శాఖ ప్రమోషన్ ఇచ్చింది. నార్తర్న్ రైల్వేలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(OSD) హోదాను కల్పించింది. భారత్ తరఫున ఒలింపిక్ మెడల్ సాధించిన అతి పిన్న వయస్కుడిగా(21 ఏళ్లు) అమన్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. రెజ్లింగ్లో 57 కిలోల ఫ్రీ స్టైల్ విభాగంలో అమన్ కాంస్యం గెలిచి భారత్కు ఆరో మెడల్ సాధించిపెట్టారు.
Sorry, no posts matched your criteria.