News November 14, 2024

ప్రభుత్వానికి గ్రూప్-4 అభ్యర్థుల హెచ్చరిక

image

TG: త్వరలో గ్రూప్-4 ఫలితాలు వస్తాయనే వార్తల నేపథ్యంలో బ్యాక్‌లాగ్ పోస్టులు మిగిల్చితే మెరుపు ధర్నా చేస్తామని అభ్యర్థులు హెచ్చరించారు. ‘గ్రూప్-4లో అన్‌విల్లింగ్ ఆప్షన్ ఇవ్వకుండా రిజల్ట్స్ ఇస్తే ఆందోళనలు చేస్తాం. దీనిపై గతంలోనే మంత్రులు, ప్రభుత్వ పెద్దలను కలిశాం. గురుకుల ఉద్యోగాల్లో బ్యాక్‌లాగ్ పోస్టులు మిగలడంతో 2000 మందికి అన్యాయం జరిగింది. గ్రూప్-4లో అలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలి’ అని కోరారు.

News November 14, 2024

కడప దర్గాను దర్శించుకోనున్న రామ్ చరణ్

image

సినీ నటుడు రామ్ చరణ్ కడప అమీన్ దర్గాను ఈ నెల 18న దర్శించుకోనున్నారు. అక్కడ జరిగే 80వ దర్గా నేషనల్ ఘజల్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. కాగా.. శంకర్ దర్శకత్వంలో ఆయన నటించిన గేమ్ ఛేంజర్ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ‘ఉప్పెన’ బుచ్చిబాబు డైరెక్షన్లో కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు.

News November 14, 2024

ఎంత వేడుకున్నా వదిలిపెట్టొద్దు: వైఎస్ షర్మిల

image

AP: సోషల్ మీడియాలో పోస్టుల కేసులో తనను వదిలేయాలంటూ మంత్రి లోకేశ్‌కు శ్రీరెడ్డి రాసిన లేఖపై APCC చీఫ్ షర్మిల పరోక్షంగా స్పందించారు. ‘ఇది పొలిటికల్ ఇష్యూ కాదు, సోషల్ ఇష్యూ. ఎన్నో బూతులు మాట్లాడారు. అసలు లిమిట్ లేకుండా పోయింది. అసభ్యకరంగా పోస్టులు పెట్టినా, కామెంట్స్ చేసినా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు వదిలిపెట్టాలని ఎంత వేడుకున్నా, క్షమాపణలు కోరినా విడిచిపెట్టొద్దు’ అని షర్మిల వ్యాఖ్యానించారు.

News November 14, 2024

IND, PAK హక్కుల్ని ICC రద్దు చేయాలి: పాక్ మాజీ కెప్టెన్

image

భారత్, పాకిస్థాన్ బోర్డులకు ఉన్న టోర్నీల హోస్టింగ్ హక్కుల్ని ఐసీసీ రద్దు చేయాలని పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ సూచించారు. భేదాలు సెట్ అయ్యేవరకూ హోస్టింగ్‌ను ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ‘2023-2031 మధ్యకాలంలో పాక్‌లో రెండు ఈవెంట్లు, INDలో 5 ఈవెంట్లు ఉన్నాయి. ఆ నిర్వహణ హక్కులన్నింటినీ ఐసీసీ వేరే దేశాలకు తరలించాలి. అప్పుడే సమస్యలకి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది’ అని అభిప్రాయపడ్డారు.

News November 14, 2024

DMK బిగ్గెస్ట్ డోనర్‌పై ED దాడులు.. WHAT NEXT?

image

తమిళనాడులో యాక్టర్ విజయ్ జోసెఫ్ కొత్త పార్టీతో అధికార DMKకు ఇప్పటికే తలనొప్పి ఎదురైనట్టు విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీకి బిగ్గెస్ట్ ఫండ్ డోనర్, లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్‌ ఆస్తులపై ఈడీ నేడు దాడులు చేపట్టడం సంచలనంగా మారింది. DMKకు వచ్చిన 90% ఎలక్టోరల్ బాండ్లను ఆయనే కొన్నారు. గతేడాది దాడుల్లోనే రూ.450 కోట్ల ఆయన ఆస్తుల్ని అటాచ్ చేసిన ED ఈసారి ఏం చేస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.

News November 14, 2024

విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం

image

AP: విశాఖ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. కొంతకాలంగా మేఘనకు నీరభ్ శర్మ అశ్లీల చిత్రాలు పంపడంతో పాటు ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధిస్తుండేవాడు. ప్రేమను అంగీకరించట్లేదనే కోపంతో ఇవాళ పెదగంట్యాడ మండలం బాలచెరువు సమీపంలోని యువతి ఇంటికి వెళ్లి ఐరన్‌రాడ్డుతో దాడి చేశాడు. ఆమె తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. ఘటన అనంతరం యువకుడు పరారయ్యాడు. ఘటనపై న్యూపోర్ట్ పోలీసులు విచారణ చేస్తున్నారు.

News November 14, 2024

నా రూమ్‌కి వచ్చి తిలక్ ఏం అడిగారంటే.: సూర్య

image

నిన్నటి SAvsIND మ్యాచ్‌లో తిలక్ వర్మ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌కు ముందు ఆయన తన గదికి వచ్చారని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘3వ స్థానంలో తాను ఆడతానని తిలక్ నా రూమ్‌కి వచ్చి మరీ రిక్వెస్ట్ చేశారు. అతడిపై విశ్వాసంతో సరేనన్నాను. ఆ నమ్మకాన్ని సెంచరీతో నిలబెట్టుకున్నారు’ అని కొనియాడారు. గత మ్యాచ్‌లలో సూర్య వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చారు.

News November 14, 2024

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర సమస్యలపై ఆర్థిక మంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. వివిధ అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఆరా తీసే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత సీఎం ఎల్లుండి మహారాష్ట్రకు వెళ్లే ఛాన్స్ ఉంది.

News November 14, 2024

వరుణ్ తేజ్ ‘మట్కా’ రివ్యూ

image

చిన్నప్పటి నుంచి రౌడీయిజం ఫాలో అయిన హీరో గ్యాంబ్లింగ్ కింగ్‌గా ఎదగడం, చివరికి ఏమయ్యాడనేదే కథ. డిఫరెంట్ గెటప్‌లు, నటనతో వరుణ్ తేజ్ మెప్పించారు. కెమెరా వర్క్ బాగుంది. పాత స్టోరీని కొత్తగా చూపించడంలో డైరెక్టర్ కరుణ కుమార్ ఫెయిల్ అయ్యారు. జి.వి ప్రకాశ్ మ్యూజిక్ తేలిపోయింది. స్టోరీ మధ్యలో ప్లేస్‌మెంట్ లేకుండా వచ్చే సాంగ్స్, లెంగ్తీ డైలాగ్స్ ప్రేక్షకులను ఇబ్బంది పెడతాయి.
RATING: 2/5

News November 14, 2024

మండలిలో మా గొంతు నొక్కుతున్నారు: YCP ఎమ్మెల్సీలు

image

AP: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే తమను పదే పదే అడ్డుకుంటున్నారని YCP MLCలు ఆరోపించారు. మండలిలో తమ సభ్యులు మాట్లాడకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘మా నాయకుడు జగన్ ఎక్కడికీ పారిపోలేదు. ఆయన ప్రతిపక్ష హోదా అడిగితే ఇప్పటివరకు స్పీకర్ స్పందించలేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఆయన సభకు వచ్చి ఏం లాభం? మమ్మల్ని అవహేళనగా మాట్లాడటం సరికాదు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు’ అని పేర్కొన్నారు.