India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(GAIL)లో 261 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. వచ్చే నెల 12 వరకు అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగాన్ని బట్టి బీఏ, బీకాం, BSC LLB, MSC, PG <
వెబ్సైట్: https://gailonline.com/

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 21, 22 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 21న హకీంపేట ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి NTR స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవానికి హాజరవుతారు. 22న హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో లోక్మంతన్-2024 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రపతి పర్యటనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎస్ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.

జీవించి ఉన్నవారిలో 2024కు గాను ‘సెక్సియెస్ట్ మ్యాన్’గా అమెరికా నటుడు, డైరెక్టర్ జాన్ క్రసిన్స్కీని ఎంపిక చేసినట్లు పీపుల్స్ మ్యాగజైన్ ప్రకటించింది. ఈ అవార్డు వస్తుందని ఊహించలేదని, చాలా సంతోషంగా ఉందని జాన్ తెలిపారు. అమెజాన్ ప్రైమ్ నిర్మించిన ‘జాక్ ర్యాన్’ వెబ్సిరీస్తో ఆయన ఫేమస్ అయ్యారు. హారర్ చిత్రం ‘ఎ క్వైట్ ప్లేస్’కు డైరెక్టర్, కో రైటర్గానూ పనిచేశారు.

డయాబెటిస్ రోగుల్లో చక్కెర స్థాయులను నియంత్రించడానికి వాడే ఔషధం మెట్ఫార్మిన్. మహిళలకు గర్భదారణ సమయంలో షుగర్ ముప్పును తగ్గించడానికీ దీన్ని వైద్యులు సిఫారసు చేస్తుంటారు. అయితే ఇది పిండం ఎదుగుదలను అడ్డుకునే ఛాన్స్ ఉందని US సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. గర్భస్థ కోతులకు మెట్ఫార్మిన్ను ఇవ్వగా అవయవాల ఎదుగుదలను నియంత్రించిందని తేలింది. ఈ అంశంపై మరింత అధ్యయనం చేయాలని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

TG: కార్తీక పౌర్ణమి సందర్భంగా కులగణన సర్వేకు రేపు సెలవు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘం PRTU డిమాండ్ చేసింది. సర్వేలో పాల్గొన్న టీచర్లను కొందరు అధికారులు వేధిస్తున్నారని, సర్వే గడువును పొడిగించాలని CSకు విజ్ఞప్తి చేసింది. కొన్నిచోట్ల ఉ.7-రా.9 వరకు, సెలవు దినాల్లో ఉ.7-సా.6 గంటల వరకు సర్వేలో ఉండాలని అధికారులు ఆదేశించడం సరికాదని పేర్కొంది. అత్యవసర, ఆరోగ్యరీత్యా సెలవు పెట్టుకునే అవకాశం ఇవ్వాలని CSను కోరింది.

AP: తన వల్ల YCPకి చెడ్డపేరు వచ్చిందని, మాజీ CM జగన్ క్షమించాలని నటి శ్రీరెడ్డి కోరారు. ప్రత్యర్థులపై తాను వాడిన భాషతో పార్టీకి నష్టం జరిగిందని, ఇకపై YCPకి దూరంగా ఉంటానని లేఖ రాశారు. మరోవైపు, తన కుటుంబాన్ని కాపాడాలని మంత్రి లోకేశ్ను కోరారు. కూటమి పార్టీలు, నేతలపై జుగుప్సాకరంగా మాట్లాడి తప్పు చేశానని, సారీ చెబుతున్నట్లు రాసుకొచ్చారు. శ్రీరెడ్డిపై రాజమండ్రి, అనకాపల్లి, విజయవాడలో కేసులు నమోదయ్యాయి.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ నెల 16న చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ కానున్నారు. పెరూలో జరుగుతున్న APEC సదస్సులో ఇద్దరు నేతలు విడిగా భేటీ అవుతారని తెలుస్తోంది. బైడెన్ హయాంలో వీరి మధ్య ఈ సమావేశం మూడోది, ఆఖరిది కావడం గమనార్హం. చైనాను వ్యతిరేకించే ట్రంప్ వచ్చే జనవరిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది.

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 8గంటల సమయం పడుతోంది. 2 కంపార్టుమెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 66,441 మంది దర్శించుకోగా, 20,639మంది తలనీలాలు సమర్పించారు. బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.12కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

AP: వైసీపీ హయాంలో కర్నూలులో ఏర్పాటుచేసిన లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(SHRC) కార్యాలయాలను అమరావతికి తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయాన్ని SGP ప్రణతి హైకోర్టుకు నివేదించారు. ఇందుకు చట్ట సవరణ చేయాల్సి ఉందని తెలిపారు. దీంతో న్యాయమూర్తి విచారణను 3 నెలలకు వాయిదా వేశారు. కర్నూలులో లోకాయుక్త, SHRC ఆఫీసులను ఏర్పాటుచేయడాన్ని సవాల్ చేస్తూ మద్దిపాటి శైలజ అనే మహిళ గతంలో పిల్ దాఖలు చేశారు.

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మంత్రివర్గాన్ని, కీలక పదవుల్ని వేగంగా భర్తీ చేస్తున్నారు. భారత సంతతి మహిళ తులసీ గబ్బార్డ్ను జాతీయ నిఘా విభాగానికి డైరెక్టర్గా, ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియోను విదేశాంగ మంత్రిగా నామినేట్ చేశారు. చైనాపై రూబియో తరచూ ఘాటు విమర్శలు చేస్తుంటారు. మరోవైపు రక్షణ విభాగం నుంచి తొలగించాల్సిన అధికారుల పేర్లతో ఓ జాబితాను ట్రంప్ రెడీ చేస్తున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.