India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బాలీవుడ్ హీరో ఆమిర్ఖాన్ మాజీ భార్య కిరణ్రావు తెరకెక్కించిన ‘లాపతా లేడీస్’ 2023లో విడుదలై అందర్నీ ఆకట్టుకుంది. భారత్ నుంచి 2025 ఆస్కార్ అవార్డులకు సైతం నామినేట్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ క్యాంపెయినింగ్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే దేశవిదేశాల్లో ఉన్న వారికి సులభంగా అర్థమయ్యేలా టైటిల్ను ‘లాస్ట్ లేడీస్’(Lost Ladies)గా మార్చేశారు. కాగా ఆస్కార్ వేడుక 2025 మార్చి 3న జరగనుంది.

డంబుల్లా వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య శ్రీలంక గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.2 ఓవర్లలో 324/5 స్కోర్ చేసింది. వర్షం వల్ల మ్యాచ్ను 27 ఓవర్లకు కుదించి టార్గెట్ను 221 రన్స్ చేశారు. కాగా NZ 175/9 స్కోరుకే పరిమితమైంది. దీంతో DLS ప్రకారం 45 పరుగుల తేడాతో శ్రీలంక గెలిచింది. SL ఆటగాళ్లు మెండిస్(143), అవిష్క(100) సెంచరీలు చేశారు. నవంబర్ 17న తర్వాతి వన్డే జరగనుంది.

1. యాకుత్స్క్, రష్యా (-41 F/ -40 C)
2. నోరిల్స్క్, రష్యా (-22 F/-30 C)
3. ఎల్లోనైఫ్, కెనడా (-18.2 F/-27.9 C)
4. బారో, యునైటెడ్ స్టేట్స్ (-13 F/-25 C)
5. ఉలాన్బాతర్, మంగోలియా (-11.2 F/-24.6 C)
6. ఇంటర్నేషనల్ ఫాల్స్, US (4.4 F/-15 C)
7. అస్తానా, కజకిస్థాన్ (6.4 F/ -14.2 C)

భారత పేస్ సెన్సేషన్ అర్ష్దీప్ సింగ్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. భారత్ తరఫున టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన పేస్ బౌలర్గా నిలిచారు. సౌతాఫ్రికాతో జరిగిన 3వ టీ20లో సింగ్ 3 వికెట్లు తీశారు. దీంతో టీ20 కెరీర్లో మొత్తం 92 వికెట్లు సొంతం చేసుకొని టాప్ ప్లేస్ సొంతం చేసుకున్నారు. కాగా ఆ తర్వాతి స్థానాల్లో భువనేశ్వర్(90), బుమ్రా(89) ఉన్నారు. మొత్తంగా చూస్తే స్పిన్నర్ చాహల్(96) టాప్లో ఉన్నారు.

* 1949: బాలల దినోత్సవం
* 1889: భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జననం.(ఫొటోలో)
* 1948: రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ జననం.
* 1967: భారత మాజీ క్రికెటర్ సి.కె.నాయుడు మరణం.
* 2020: తెలంగాణ నీటిపారుదల దినోత్సవం.
* ప్రపంచ మధుమేహ దినోత్సవం.

AP: విద్యార్థులకు ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ ద్వారా అందిస్తున్న ఆహారం నాణ్యతలో రాజీ పడవద్దని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ.1,854 కోట్లు కేటాయించిందని తెలిపారు. కొన్ని పాఠశాలల్లో నాణ్యతా లేదనే ఫిర్యాదులు తన దృష్టికి రావడంతో ఆయన ఇలా స్పందించారు. అధికారులు తనిఖీలు చేపట్టి, నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

భారత్, సౌతాఫ్రికా మధ్య 3వ టీ20 తీవ్ర ఉత్కంఠగా సాగింది. చివర్లో హెన్రిచ్ క్లాసెన్ 41(22 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు), మార్కో జాన్సెన్ 54(17బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) భారత బౌలర్లకు చెమటలు పట్టించారు. చక్రవర్తి వేసిన 14వ ఓవర్లో క్లాసెన్ హ్యాట్రిక్ సిక్సులతో మొత్తం 22 రన్స్ కొట్టారు. హార్దిక్ వేసిన 19వ ఓవర్లో జాన్సెన్ (4, 6, 4, 2, 6, 4) మొత్తం 26 రన్స్ బాదారు. వీరు ఔటవడంతో భారత్ <<14604651>>గెలిచింది<<>>.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

సౌతాఫ్రికాతో మూడో టీ20లో భారత్ గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 219/6 స్కోర్ చేయగా ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 208/7 చేసింది. దీంతో భారత్ 11 రన్స్ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్లో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ సెంచరీ(107)తో రాణించారు. కాగా 4 మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యం సాధించింది. తర్వాతి మ్యాచ్ నవంబర్ 15న జరగనుంది.

సౌతాఫ్రికాతో జరుగుతున్న 3వ టీ20లో భారత క్రికెటర్ అక్షర్ పటేల్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నారు. సిక్సు కొట్టి ఊపుమీదున్నట్లు కనిపించిన సఫారీ హిట్టర్ డేవిడ్ మిల్లర్ ఆ తర్వాత బంతిని భారీ షాట్ కొట్టారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అక్షర్ గాల్లోకి ఎగిరి అద్భుతంగా క్యాచ్ అందుకున్నారు. దీంతో మిల్లర్(18) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం సౌతాఫ్రికా స్కోర్ 15.5 ఓవర్లలో 142/5. భారత్ గెలుస్తుందా?
Sorry, no posts matched your criteria.