News August 16, 2024

సీఎంపై చీటింగ్ కేసు పెట్టాలి: కేటీఆర్

image

TG: రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ దుయ్యబట్టారు. ఈ వ్యవహారంలో రైతులను మోసం చేసినందుకు రేవంత్‌పై చీటింగ్ కేసు పెట్టాలన్నారు. CM మాటలు చూస్తే మానసిక పరిస్థితి మీద అనుమానం కలుగుతోందని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమైనా కుటుంబ సభ్యులు ఆయన్ను సరిగ్గా చూసుకోవాలని కోరారు. రేవంత్ కుటుంబ పాలన బ్రహ్మాండంగా సాగుతోందని విమర్శించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని హితవు పలికారు.

News August 16, 2024

వరుస సెలవులు.. ప్రయాణికులకు GOOD NEWS

image

వరుస సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారి కోసం <>దక్షిణ మధ్య రైల్వే<<>> ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. ఇవాళ్టి నుంచి 19వ తేదీ వరకు సికింద్రాబాద్-నర్సాపూర్, కాకినాడ-సికింద్రాబాద్, కాచిగూడ-తిరుపతి మార్గాల్లో ఈ రైళ్లు నడుస్తాయని వెల్లడించింది. ఆ రైళ్ల వివరాలను పైన ఫొటోలో చూడొచ్చు.

News August 16, 2024

రేవంత్ ఢిల్లీ పర్యటనపై కేటీఆర్ సెటైర్లు

image

TG: రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు జరుగుతుంటే CM రేవంత్ రెడ్డి మాటిమాటికీ ఢిల్లీ వెళ్తున్నారని మాజీ మంత్రి KTR విమర్శించారు. ‘ఇప్పటివరకు 19సార్లు CM ఢిల్లీ వెళ్లారు. నాకు తెలిసి ఇదో రికార్డ్. KCR తన పదేళ్ల పాలనలో ఇన్నిసార్లు పోయినట్లు లేదు. పాపం ఈయన ఇంకెన్నిసార్లు వెళ్లాలో?’ అని సెటైర్ వేశారు. ప్రభుత్వ టీచర్లను పట్టుకొని CM స్థాయి వ్యక్తి ఇంటర్, డిగ్రీ ఫెయిలైనవాళ్లు అని మాట్లాడటం సరికాదని మండిపడ్డారు.

News August 16, 2024

సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

image

TG: సీఎం రేవంత్ మాటలు చూస్తే ఆయన చిరాకులో ఉన్నట్లు అర్థమవుతోందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం చెప్పేవరకు భాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందని తమకు తెలియదని సెటైర్లు వేశారు. కొడంగల్‌లో అయినా, వేరే ఏ ఊర్లోనైనా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందని చెబితే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. దీనిపై సీఎం మీడియా చర్చకు రావాలన్నారు.

News August 16, 2024

‘దమ్ముంటే రాజీనామా చెయ్ హరీశ్’.. ఫ్లెక్సీల కలకలం

image

హరీశ్ రావు రాజీనామా చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయిన క్రమంలో HYDలో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ‘దమ్ముంటే రాజీనామా చెయ్.. రుణమాఫీ అయిపోయే.. నీ రాజీనామా ఏడబోయే.. అగ్గిపెట్ట హరీశ్ రావు’ అని ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. మైనంపల్లి అభిమానుల పేరిట వీటిని ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్, పంజాగుట్టలో ఇవి దర్శనమిస్తున్నాయి.

News August 16, 2024

నేషనల్ అవార్డ్స్-2022

image

* బెస్ట్ కొరియోగ్రాఫర్ – జానీ మాస్టర్, సతీశ్ కృష్ణన్
* బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ – పవన్ రాజ్ మల్హోత్రా (ఫౌజా)
* ఉత్తమ నటి సపోర్టింగ్ రోల్- నీనా గుప్తా(ఉంచాయ్)
* బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్- శ్రీపత్(మళ్లికాపురం)
* ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ మేల్- అర్జీత్ సింగ్(కేసరియాసాంగ్ – బ్రహ్మాస్త్ర-1)
* ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ ఫీమేల్ – బాంబే జయశ్రీ
* బెస్ట్ సినిమాటోగ్రఫీ – రవి వర్మ(పొన్నియన్ సెల్వన్-1)

News August 16, 2024

దులీప్ ట్రోఫీ ఆడని రోహిత్, కోహ్లీ: జైషా కామెంట్స్

image

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దులీప్ ట్రోఫీ ఆడాల్సిన అవసరం లేదని BCCI కార్యదర్శి జైషా స్పష్టం చేశారు. ‘అలాంటి సీనియర్లపై పనిభారం ఉండొద్దని బోర్డు భావిస్తోంది. లేదంటే గాయాల భయం వెంటాడక మానదు. వారిని గౌరవించాలి. ఆసీస్, ఇంగ్లండ్‌లో ప్రతి అంతర్జాతీయ ఆటగాడు దేశవాళీ క్రికెట్ ఆడరు. అయితే మిగతా వాళ్లంతా ఆడాలి. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ బుచ్చిబాబు టోర్నీ ఆడటం మీరు గమనించే ఉంటారు’ అని షా తెలిపారు.

News August 16, 2024

బెస్ట్ యాక్టర్‌గా రిషభ్ శెట్టి

image

ఉత్తమ నటుడిగా రిషభ్ శెట్టికి జాతీయ అవార్డు లభించింది. ‘కాంతార’లో నటనకుగానూ ఆయనకు ఈ అవార్డు దక్కింది. అలాగే ఉత్తమ నటి అవార్డు నిత్యా మేనన్(తిరుచిత్రమ్‌బలం), మానసి పరేఖ్(కచ్ ఎక్స్‌ప్రెస్) ఇద్దరినీ వరించింది. బెస్ట్ డైరెక్టర్‌గా ‘ఉంచాయ్’ చిత్రానికి సూరజ్‌ అవార్డ్ అందుకోనున్నారు.

News August 16, 2024

బెస్ట్ తెలుగు ఫిల్మ్ ‘కార్తికేయ-2’

image

నిఖిల్ నటించిన కార్తికేయ-2ను జాతీయ అవార్డు వరించింది. బెస్ట్ తెలుగు రీజినల్ మూవీగా ఈ చిత్రం నిలిచింది. ఈ అవార్డుకు తెలుగు నుంచి బలగం, సీతారామం, మేజర్ సినిమాలు పోటీ పడ్డాయి. ఇక తమిళ్ నుంచి పొన్నియన్ సెల్వన్-1, కన్నడ నుంచి కేజీఎఫ్-2 ఉత్తమ రీజినల్ చిత్రాలుగా నిలిచాయి.

News August 16, 2024

చంద్రబాబు ఇంటిపై దాడి కేసు.. విచారణకు జోగి

image

AP: టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ విచారణకు హాజరయ్యారు. మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆయనను విచారిస్తున్నారు. పోలీసులు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని, విచారణకు సహకరిస్తానని ఆయన ఈ సందర్భంగా మీడియాతో అన్నారు. మరోవైపు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఇప్పటికే ఆయన కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అరెస్ట్ చేసింది.