News August 16, 2024

ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కోదండరామ్, అలీఖాన్

image

TG: ఎట్టకేలకు TJS అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ శాసనమండలిలో అడుగుపెట్టారు. గవర్నర్ కోటాలో ఆయనతో పాటు అలీఖాన్‌ MLCలుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా పాల్గొన్న కోదండరామ్‌ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్‌తో విభేదించారు. తెలంగాణ జనసమితి పార్టీని స్థాపించి, అప్పటి ప్రభుత్వంపై పోరాడారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో కోదండరామ్‌కు MLC పదవి ఇచ్చి గౌరవించింది.

News August 16, 2024

నీరజ్‌ను మా ఇంటికి ఆహ్వానిస్తా: అర్షద్ తల్లి

image

పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ తల్లి రిజియా పర్వీన్ మరోసారి నీరజ్ చోప్రాపై తన అభిమానం చాటుకున్నారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ‘నీరజ్‌ను మీ ఇంటికి పిలుస్తారా?’ అని జర్నలిస్టు అడగ్గా ‘అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. తప్పకుండా ఆహ్వానిస్తా’ అని ఆమె చెప్పుకొచ్చారు. పారిస్ ఒలింపిక్స్‌లో నదీమ్ గోల్డ్ గెలిచాక పర్వీన్ స్పందిస్తూ ‘సిల్వర్ గెలిచిన నీరజ్ కూడా నా కొడుకులాంటి వాడే’ అని పేర్కొనడం తెలిసిందే.

News August 16, 2024

బంగారంలో ఎంత పెట్టుబడి పెట్టాలంటే..

image

స్థిరమైన, సురక్షితమైన పెట్టుబడి అంటే గుర్తొచ్చేది బంగారం. బలహీనమైన డాలర్, ఎకానమీ, ఆర్థిక, యుద్ధ సంక్షోభ సమయాల్లో ఇంతకు మించిన ఆర్థిక సాధనం మరొకటి లేదని నానుడి. పుత్తడిపై ఎంత పెట్టుబడి పెట్టాలని చాలామందికి సందేహం. మీ పోర్టుఫోలియోలో 10-15% వరకు పెడితే సమతూకం వస్తుందని ఆర్థిక నిపుణులు, ఫండ్ మేనేజర్లు చెబుతున్నారు. ఫిజికల్ గోల్డ్, గోల్డ్ ETF, గోల్డ్ MF, SGBల్లో అనువైనది ఎంచుకోవచ్చని సూచిస్తున్నారు.

News August 16, 2024

ఎమ్మెల్సీలుగా కాసేపట్లో ప్రమాణం చేయనున్న కోదండరామ్, అలీఖాన్

image

TG: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా TJS అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్, అలీఖాన్ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీలో వారితో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ప్రమాణం చేయించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే వీరిని నామినేట్ చేయగా దీనిపై BRS హైకోర్టుకు వెళ్లింది. నియామక గెజిట్‌ను HC కొట్టివేయడంతో ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ప్రభుత్వానికి అనుకూలంగా SC నిన్న తీర్పిచ్చింది.

News August 16, 2024

ప్రేమించిన బాలికతో కొడుకు పరార్.. తల్లికి చిత్రహింసలు!

image

TG: వికారాబాద్(D) నవల్గాకు చెందిన నరేశ్(17), ఓ బాలిక(16) ప్రేమించుకుని మే 2న ఇంట్లో నుంచి పారిపోయారు. దీంతో అతనిపై జహీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదైంది. అయితే బాలుడి ఆచూకీ చెప్పాలంటూ తనను 3 నెలలుగా పోలీసులు చిత్ర హింసలు పెడుతున్నారని, దెబ్బలకు చేతులు, కాళ్లు వాచిపోయాయని తల్లి కళావతి వాపోతున్నారు. పోలీసులు కొట్టిన విషయం తమ దృష్టికి రాలేదని, దీనిపై విచారణ చేస్తామని CI అశోక్ తెలిపారు.

News August 16, 2024

మీ విజయాలతో దేశం గర్విస్తోంది: ప్రధాని మోదీ

image

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల ప్రతిభను చూసి యావత్ దేశం గర్విస్తోందని ప్రధాని మోదీ అన్నారు. మన ప్రతి అథ్లెట్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారని ఆయన కొనియాడారు. భారత అథ్లెట్లతో ఢిల్లీ వేదికగా ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పతకాలు సాధించిన వారిని సత్కరించారు. పారిస్ ఒలింపిక్స్‌తో భారత క్రీడారంగంలో మార్పులు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

News August 16, 2024

‘డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్’కు షాకింగ్ కలెక్షన్లు!

image

పూరీ జగన్నాథ్-రామ్ కాంబోలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్, హరీశ్ డైరెక్షన్‌లో రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాలకు తొలిరోజు అంతంతమాత్రంగానే కలెక్షన్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఇస్మార్ట్‌ ₹6.3 కోట్లు నెట్(గ్రాస్ ₹1.1 కోట్లు), బచ్చన్‌ ₹4.5 కోట్లు నెట్(గ్రాస్ ₹95 లక్షలు) వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. సోమవారం వరకు వరుస సెలవులు ఉండటంతో కలెక్షన్లు పెరగొచ్చని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు.

News August 16, 2024

స్కిల్ వర్సిటీకి ఛైర్మన్ నియామకం.. త్వరలో అడ్మిషన్స్

image

TG: ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఏడాదిపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఛైర్మన్‌గా ఆనంద్ నియామకం పూర్తి కావడంతో యూనివర్సిటీ పరిపాలన, తరగతుల ప్రారంభం ప్రక్రియలో వేగం పుంజుకోనుంది. ఈనెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో పాఠ్యప్రణాళిక సిద్ధం కానుంది.

News August 16, 2024

మీ అబ్బాయిలకు ఇది చెబుతున్నారా?

image

కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఉదంతం కుదిపేస్తోంది. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈక్రమంలో ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి మీ కూతురికి నేర్పిస్తున్నారు. అలాగే మీ కుమారుడికి కూడా దాని గురించి తెలిసి ఉండాలి’ అని రాసి ఉన్న ప్లకార్డు ఆలోచింపజేస్తోంది. పరాయి అమ్మాయిల పట్ల ఎలా వ్యవహరించాలనే జ్ఞానం ఉన్నప్పుడే ఇలాంటి దారుణాలు కాస్తయినా తగ్గుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీరేమంటారు?

News August 16, 2024

ఇస్రో ప్రయోగం విజయవంతం

image

శ్రీహరికోటలోని షార్‌ నుంచి దూసుకెళ్లిన SSLV-D3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈవోఎస్-08ను సైంటిస్టులు కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఉదయం 9.17 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా, 4 దశల్లో ఘన, ద్రవ ఇంధనాలను ఉపయోగించి భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. మొత్తంగా 16.57 నిమిషాల్లో ప్రయోగం ముగిసింది. దీంతో సైంటిస్టులు సంతోషం వ్యక్తం చేశారు.