News August 14, 2024

వయనాడ్ విపత్తుకు పర్యావరణ మార్పే కారణం: నివేదిక

image

కొండచరియలు విరిగిపడటానికి ముందు వయనాడ్‌లో వర్షపాతం సాధారణం కంటే 10శాతం ఎక్కువగా నమోదైందని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్(WWA) పరిశోధకుల బృందం తేల్చింది. వాతావరణ మార్పులే దీనికి కారణమని వివరించింది. గ్లోబల్ వార్మింగ్ ఇలాగే కొనసాగితే మున్ముందు ఈ ఘటనలు మరింత పరిపాటిగా మారతాయని ఆందోళన వ్యక్తం చేసింది. వయనాడ్ కొండలపై చెట్లను కొట్టేస్తుండటం కూడా చరియలు విరిగిపడేందుకు ఓ కారణమని తెలిపింది.

News August 14, 2024

భారత్‌పై 3-1 తేడాతో గెలుస్తాం: పాంటింగ్

image

ఆస్ట్రేలియా-భారత్ మధ్య 5 టెస్టుల సిరీస్ ఈ ఏడాది నవంబరు నుంచి మొదలుకానుంది. అందులో తమదే విజయమని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ పాంటింగ్ ధీమా వ్యక్తం చేశారు. 3-1 తేడాతో సిరీస్ దక్కించుకుంటామని జోస్యం చెప్పారు. ‘సొంతగడ్డపై గత రెండు సిరీస్‌లు ఓడిపోయాం. మా ఆటగాళ్లు కసిగా ఆడతారు. కచ్చితంగా మేమే గెలుస్తామని నా నమ్మకం’ అని పేర్కొన్నారు. 2014-15 తర్వాత ఆస్ట్రేలియా భారత్‌తో టెస్టు సిరీస్ గెలవకపోవడం గమనార్హం.

News August 14, 2024

డైరెక్టర్‌తో సమంత డేటింగ్?

image

‘ది ఫ్యామిలీ మాన్’ డైరెక్టర్ రాజ్‌తో సమంత డేటింగ్ చేస్తున్నట్లు జాతీయ, బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై వారి నుంచి స్పష్టత రావాల్సి ఉంది. రాజ్&డీకే డైరెక్షన్‌లో ‘ఫ్యామిలీమాన్-2’, ‘సిటాడెల్’ వెబ్ సిరీసుల్లో సమంత నటించారు. 2021లో సమంత, నాగచైతన్య విడిపోగా, తాజాగా శోభితతో చైతన్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

News August 14, 2024

వారంలో గోవా రైలు ప్రారంభం

image

సికింద్రాబాద్ నుంచి నేరుగా వాస్కోడిగామా(గోవా)కు రైలు సర్వీసును మరో వారం రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి వీక్లీ ఎక్స్‌ప్రెస్, కాచిగూడ నుంచి 4 బోగీల సర్వీసు గుంతకల్ వద్ద గోవా రైలుతో లింకై వాస్కోడిగామా వెళ్తున్నాయి. దీంతో కొత్త రైలు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి.. గురు, శనివారాల్లో వాస్కోడిగామా నుంచి ప్రయాణించనున్నాయి.

News August 14, 2024

ఈయనను లంచం అడిగిన వారి పని ఖతం!

image

TG: ఎవరైనా అధికారులు లంచం అడిగితే చాలు, వారిని ACBకి పట్టించేదాకా నిద్రపోరు రంగారెడ్డి(D) గుర్రంగూడకు చెందిన ముత్యంరెడ్డి. గత మూడున్నరేళ్లలో ఏడుగురు ఆఫీసర్లను ఆయన అరెస్ట్ చేయించారు. 2019లో VRO శంకర్, 2021లో గ్రామ సర్పంచ్ భర్త, ఉప సర్పంచ్ సహా నలుగురు, ఈ ఏడాది మార్చిలో మీర్‌పేట్ SI సైదులు, <<13840981>>తాజాగా<<>> రంగారెడ్డి అదనపు కలెక్టర్, రెవెన్యూ ఆఫీసర్‌ను ఆయన ACBకి పట్టించారు.

News August 14, 2024

టీడీపీ నాయకుడి దారుణ హత్య.. పరిస్థితి ఉద్రిక్తం

image

AP: కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ శ్రీనివాసులును దుండగులు దారుణంగా హత్య చేశారు. తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన ఆయన కళ్లలో కారం కొట్టి, వేటకొడవళ్లతో నరికి చంపారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

News August 14, 2024

నిమ్స్‌లో హార్ట్ వాల్వ్ బ్యాంకు?

image

TG: గుండె సమస్యలతో బాధపడుతున్న పేదలకు ఉచితంగా హార్ట్ వాల్వ్‌లు అందించేందుకు నిమ్స్ ముందుకొచ్చింది. ఇందుకోసం ఆస్పత్రిలో ప్రత్యేకంగా హార్ట్ వాల్వ్ బ్యాంకు ఏర్పాటు చేయనుంది. బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి గుండె కవాటాలను సేకరించి అందులో భద్రపరుస్తారు. నామమాత్రపు ఖర్చుతోనే సర్జరీ చేయించుకోవచ్చు. త్వరలో దీనిని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించనున్నట్లు సమాచారం.

News August 14, 2024

6 నెలలు రేషన్ తీసుకోని కార్డులు కట్!

image

AP: జాతీయ ఆహార భద్రత చట్టం కింద 1,36,420 కార్డుదారులు 6 నెలలుగా రేషన్ తీసుకోవడం లేదని కేంద్రం గుర్తించింది. దీంతో వాటిని తొలగించి, రాష్ట్ర కార్డులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పౌరసరఫరాల శాఖ నుంచి ప్రతిపాదనలూ అందాయి. మరోవైపు రేషన్ దుకాణాల్లో ప్రతినెలా బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పు, గోధుమపిండి, జొన్నలు, సజ్జలు కూడా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

News August 14, 2024

మరో 2 నెలల్లో స్కూళ్లకు కొత్త టీచర్లు!

image

TG: టీచర్లు, లెక్చరర్ల రిక్రూట్‌మెంట్‌పై ప్రభుత్వం దృష్టి సారించింది. రెండు నెలల్లో నియామకాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెలాఖరులోగా DSC ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఇంటర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. గతంలో నిలిచిపోయిన డిగ్రీ లెక్చరర్ల(అసిస్టెంట్ ప్రొఫెసర్) నియామక ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తి కానున్నట్లు సమాచారం.

News August 14, 2024

రేపు 4 సినిమాలు రిలీజ్.. మీ ఛాయిస్ ఏది?

image

రేపు థియేటర్లలో నాలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’, రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’, కోలీవుడ్ హీరో విక్రమ్ ‘తంగలాన్’, ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ‘ఆయ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఈ నాలుగు సినిమాలపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి మీరు ఏ సినిమాకు వెళ్తున్నారో కామెంట్ చేయండి.