News August 12, 2024

రైల్వే ఉద్యోగికి మూడేళ్ల జైలు

image

లంచం కేసులో వెస్ట్రన్ రైల్వేస్‌లో ఓ మాజీ ఉద్యోగికి గుజరాత్‌లోని గాంధీనగర్ CBI కేసుల ప్ర‌త్యేక జ‌డ్జి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. పెండింగ్ బిల్లులు క్లియ‌ర్ చేయ‌డానికి ఓ కాంట్రాక్ట‌ర్ నుంచి 2008లో అప్ప‌టి సీనియ‌ర్ అసిస్టెంట్ ఆర్థిక స‌లహాదారైన విద్యాసాగ‌ర్ రూ.20 వేలు లంచం తీసుకోవ‌డంతో సీబీఐ కేసు న‌మోదైంది. 2009లో చార్జిషీట్ దాఖలు చేయగా తాజాగా కోర్టు శిక్ష, రూ.75 వేల జరిమానా విధించింది.

News August 12, 2024

టాప్-5 రాష్ట్రాలతో పోటీపడేలా పారిశ్రామిక విధానం: CBN

image

AP: పరిశ్రమల స్థాపనలో రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ను తిరిగి తీసుకురావాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. కొత్త పారిశ్రామిక విధానం రూపకల్పనపై సీఎం సమీక్ష చేశారు. ‘దేశంలో మొదటి 5 రాష్ట్రాలతో పోటీ పడేలా, వృద్ధి రేటు 15% లక్ష్యంగా కొత్త పారిశ్రామిక విధానం ఉండాలి. పారిశ్రామికాభివృద్ధికి చెందిన ముఖ్య పాలసీలు వంద రోజుల్లోగా తీసుకురావాలి’ అని CM వెల్లడించారు.

News August 12, 2024

రైల్వేలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్

image

రైల్వేలో వివిధ కేటగిరీల్లో 1,376 పారా మెడికల్ ఉద్యోగాల భర్తీకి రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులను భట్టి 10+2, నర్సింగ్, డిప్లొమా, B.Sc, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్స్, ఈబీసీలు రూ.250, ఇతరులు రూ.500 చెల్లించాలి. నోటిఫికేషన్ కోసం <>క్లిక్<<>> చేయండి.

News August 12, 2024

మొదటి జాతీయ జెండాను చూశారా?

image

స్వాతంత్ర్య దినోత్సవం అనగానే గుర్తొచ్చేది రెపరెపలాడే మువ్వన్నెల జెండా. మొట్ట మొదటగా 1947 ఆగస్టు 15న ఆవిష్కరించిన జెండాను మీరెప్పుడైనా చూశారా? చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్ మ్యూజియంలో 12 అడుగుల పొడవు 8 అడుగుల వెడల్పు గల జాతీయ జెండాను భద్రపరిచారు. దేశవ్యాప్తంగా స్వాతంత్ర్యం వచ్చిన రోజు ఆవిష్కరించిన జెండాల్లో ఇది ఒకటి. దీనిని స్వచ్ఛమైన సిల్క్‌తో తయారుచేశారు.

News August 12, 2024

B12 లోపంతో రక్తహీనత!

image

విటమిన్ B12 లోపం రక్తహీనత, నరాలు దెబ్బతినడం వంటి ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. ఆరోగ్య‌క‌ర‌మైన నాడీ వ్య‌వ‌స్థ నిర్వ‌హ‌ణ‌, ఎర్ర ర‌క్త క‌ణాల ఉత్ప‌త్తిలో విట‌మిన్ B12 స‌హాయ‌ప‌డుతుంది. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజంలో ప్రచురించిన పరిశోధన ప్రకారం ఉత్తర భారతంలోని 47% మందిలో బి12 లోపం ఉన్నట్టు తేలింది.

News August 12, 2024

ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేముందు ఇవి చూడండి!

image

ఫుడ్ ఐటమ్స్ కొనేముందు MFG, EXP తేదీలు ఎలా చెక్ చేస్తామో.. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేటప్పుడు వీటిని చెక్ చేయాలని BIS సూచిస్తోంది. మీ బడ్జెట్‌ను బట్టి వస్తువులను ఎంచుకోండి. ఆ వస్తువు మీ ఇంట్లోకి వెళ్తుందా లేదా? అని సైజులు చూసుకోండి. ముఖ్యంగా BIS రిజిస్ట్రేషన్ ఉంటేనే కొనండి. ప్రొడక్ట్‌పై ఉన్న R నంబర్‌తో ఆ వస్తువు నకిలీదా? లేక అసలైనదేనా? అనేది తెలుసుకోవచ్చు. ఈ <>వెబ్‌సైట్‌లో<<>> R నంబర్‌తో చెక్ చేయండి.

News August 12, 2024

గజరాజులకు స్పెషల్ విందు

image

ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌ అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. జూలో ఉన్న వనజ, ఆశా, సీత, విజయ్ అనే పేరుగల నాలుగు ఆసియా ఏనుగులకు స్పెషల్ విందు ఏర్పాటు చేశారు. పచ్చి సలాడ్, బెల్లం, చెరుకుతో పాటు పండ్లు, కొబ్బరికాయలతో ప్రత్యేక విందును అందించారు. వీటిని అవి ఎంతో ఇష్టంగా ఆరగించాయి. దీనికి సంబంధించిన ఫొటోలను అదికారులు షేర్ చేశారు.

News August 12, 2024

4 సెకన్ల ఆలస్యంతో అప్పీల్.. కాంస్యం కోల్పోయిన అథ్లెట్

image

ఒలింపిక్స్‌: జిమ్నాస్టిక్స్‌లో 4 సెకన్లు లేట్‌గా అప్పీల్ చేసినందుకు ఓ అథ్లెట్ కాంస్యం కోల్పోయారు. AUG 5న పోటీలో USకు చెందిన జోర్డాన్ 13.666 స్కోరుతో ఐదోస్థానంలో నిలిచారు. పాయింట్లు తప్పుగా వేశారంటూ ఆమె రివ్యూకు వెళ్లడంతో బ్రాంజ్ దక్కింది. అయితే ఆమె నిర్దేశిత టైం కంటే 4 సెకన్లు ఆలస్యంగా అప్పీల్ చేశారంటూ రొమేనియా బృందం CASను ఆశ్రయించింది. నిజమని తేలడంతో కాంస్యం తిరిగిచ్చేయాలని కోర్టు ఆదేశించింది.

News August 12, 2024

స్కూలు బస్సులకు ఫిట్‌నెస్ టెస్టులు చేయాలి: సీఎం

image

AP: స్కూళ్లకు విద్యార్థులను తరలించే అన్ని వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అన్నమయ్య జిల్లాలో స్కూలు వ్యాను బోల్తా పడి భవిష్య అనే చిన్నారి మృతి చెందడంపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘అన్ని బస్సుల ఫిట్‌నెస్‌పై అధికారులు స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టాలి. ఫిట్‌నెస్ లేని బస్సుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి’ అని CM స్పష్టం చేశారు.

News August 12, 2024

ముగిసిన ఒలింపిక్స్.. ఏర్పాట్లపై మళ్లీ విమర్శలు

image

పారిస్ ఒలింపిక్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. అయితే, అథ్లెట్లకు సరైన వసతులు కల్పించలేదని నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఈక్రమంలో గోల్డ్ మెడలిస్ట్ పార్క్‌లో నిద్రపోయిన ఫొటోను షేర్ చేస్తూ అథ్లెట్లు ఉక్కపోతతో ఇబ్బందిపడ్డారని గుర్తుచేస్తున్నారు. భారత అథ్లెట్లూ ఇబ్బంది పడితే కేంద్రం పోర్టబుల్ ఏసీలు పంపింది. వసతులు బాలేకపోవడంతో కొందరు అమెరికన్ అథ్లెట్లు హోటల్స్‌లో ఉండాల్సి వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు.