India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
* ఈ-పంటలో నమోదైతే ఉచిత పంటల బీమా: చంద్రబాబు
* తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేలా సీఎం మాట్లాడొద్దు: KTR
* హైదరాబాద్లో అమెజాన్ సంస్థ విస్తరణ
* ఏపీ హోంమంత్రి అనితకు తప్పిన ప్రమాదం
* కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేట్
* హిండెన్బర్గ్ ఆరోపణలు నిరాధారం: అదానీ గ్రూప్
* 109 కొత్త వంగడాలను విడుదల చేసిన ప్రధాని మోదీ
* బంగ్లా కల్లోలం వెనుక అమెరికా కుట్ర: హసీనా
* పతకానికి ఫొగట్ అర్హురాలు: గంగూలీ
సంస్థ ఛైర్పర్సన్ మాధబీ బుచ్పై ఆరోపణలపై సెబీ తొలిసారి స్పందించింది. ‘అలాంటి నివేదికలపై స్పందించేముందు ప్రశాంతంగా ఉండి తగిన శ్రద్ధ వహించండి’ అని ఇన్వెస్టర్లకు సూచించింది. కాగా హిండెన్బర్గ్ నివేదిక రేపు భారత మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని మదుపర్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. స్టాక్ మార్కెట్లు ఉదయం నష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా శరవేగంగా తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రస్తుతం ఆయుధ పూజ పాట చిత్రీకరణ నడుస్తోందని మూవీ టీం ట్విటర్లో పంచుకుంది. పోస్టర్లలో ఎన్టీఆర్ చేతిలో కనిపిస్తున్న గొడ్డలి వంటి ఆయుధం తాలూకు ఫొటోను పోస్ట్ చేసింది. అటు.. తాను ఆయుధ పూజ సాంగ్ షూట్ చూస్తూ ఎమోషనల్ అయ్యానని గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ట్వీట్ చేశారు. కాగా, చుట్టమల్లే సాంగ్ ఇప్పటికే ట్రెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే.
ఈరోజు రాత్రి 12గంటల సమయంలో ‘2024 పీకే2’ అనే గ్రహశకలం భూమి సమీపానికి రానుందని నాసా తెలిపింది. గంటకు 31,380 కిలోమీటర్ల వేగంతో అది ప్రయాణిస్తోందని పేర్కొంది. 83 అడుగుల పొడవుతో సుమారు ఓ చిన్న భవనమంతటి సైజులో ఉండే ఆ శకలం, భూమికి 12 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుందని వివరించింది. తరచూ భూ కక్ష్యలోకి వచ్చే ఆస్టరాయిడ్స్ని అటెన్ గ్రూప్గా పిలుస్తున్నారు. ఇది ఆ గ్రూప్నకే చెందినదిగా నాసా తెలిపింది.
టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు పంజాబ్కు చెందిన భక్తులు రూ.21కోట్ల భారీ విరాళం అందించారు. ట్రైడెంట్ గ్రూపునకు చెందిన రాజిందర్ గుప్తా ఈ చెక్కును టీటీడీ అదనపు ఈవో వెంకయ్యకు తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో అందించారు. కాగా టీటీడీకి చెందిన ప్రాణదాన ట్రస్ట్ ద్వారా పేదలకు గుండె, కిడ్నీ, బ్రెయిన్, క్యాన్సర్ వ్యాధులకు ఉచితంగా వైద్యం అందుతుంది.
తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఒంగోలుకు చెందిన ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. చెన్నైలోని SRM కాలేజీలో చదువుతున్న ఏడుగురు విద్యార్థులు నిన్న సెలవు కావడంతో తిరువళ్లూరు వెళ్లారు. ఇవాళ చెన్నైకి తిరిగివస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో నితీశ్ వర్మ, రామ్, చేతన్, నితీశ్, యుకేశ్ మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
సెలబ్రిటీల పిల్లలకు కేర్టేకర్గా పేరు తెచ్చుకున్నారు లలితా డిసిల్వా. ఇటీవల పెళ్లైన అనంత్ అంబానీ మొదలు, సైఫ్-కరీనాల తనయుడు తైమూర్, రామ్ చరణ్-ఉపాసనల తనయ క్లీంకార వరకు ఎంతోమంది ప్రముఖుల పిల్లలకు ఆమె ఆయాగా ఉన్నారు. ప్రస్తుతం మెగా మనుమరాలి పట్ల శ్రద్ధ తీసుకుంటూ నెలకు రూ.2 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. చరణ్ దంపతులు తన పట్ల చాలా ప్రేమ చూపిస్తారని తెలిపారు.
సినీ చరిత్రలో తొలిసారి ఓ కుక్క తన పాత్రకు డబ్బింగ్ చెప్పింది. కన్నడ మూవీ ‘నాను మత్తు గుండ-2’లో నటుడు రాకేశ్ అడిగతో పాటు లాబ్రాడర్ జాతికి చెందిన శునకం ‘సింబా’ పాత్రలో లీడ్ రోల్ పోషిస్తోంది. రఘు హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం డబ్బింగ్ వర్క్ జరుగుతోంది. సింబా పాత్రకు శునకం సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఈ మూవీ కన్నడ, తెలుగు, హిందీ తదితర భాషల్లో రిలీజ్ కానుంది.
కోల్కతా ట్రైనీ డాక్టర్(31)పై హత్యాచార <<13822185>>ఘటనలో<<>> సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచారానికి ముందు నిందితుడు సంజయ్ రాయ్ ఆసుపత్రి వెనకాల మద్యం తాగుతూ పోర్న్ వీడియోలు చూశాడు. అత్యంత దారుణంగా ఆమెను రేప్ చేయడంతో ప్రైవేట్ భాగాల నుంచి బ్లీడింగ్ అయినట్లు పోస్ట్మార్టం రిపోర్ట్లో తేలింది. ఇక సంజయ్కి ఇప్పటికే 4 పెళ్లిళ్లు కాగా అతడి టార్చర్ భరించలేక ముగ్గురు భార్యలు వదిలిపెట్టి వెళ్లిపోయారు.
2013లో మొదలైన IPE- ప్లస్ ఫండ్ వన్ అదానీ స్టాక్స్లో అసలు పెట్టుబడే పెట్టలేదని 360 వన్ (గతంలో IIFL వెల్త్) వెల్లడించింది. హిండెన్బర్గ్ ఆరోపణలపై స్పందించింది. 2019లో క్లోజ్ చేసే సమయానికి ఫండ్ AUM $48 మిలియన్లకు చేరిందని, ఇందులో 90% బాండ్లలోనే మదుపు చేశామంది. ఈ వ్యవహారాలను ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ చూశారని, ఇతరుల జోక్యానికి తావులేదని స్పష్టం చేసింది. మాధబీ, ధవళ్కు ఫండ్లో1.5% వాటా ఉండేదని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.