India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మధ్యప్రదేశ్లో వార్ వన్సైడ్ కొనసాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్లో ఎన్డీయే అత్యధిక స్థానాల్లో దూసుకుపోతోంది. మొత్తం 29 నియోజకవర్గాల్లో బీజేపీ 17 స్థానాల్లో అదరగొడుతోంది. విపక్ష ఇండియా కూటమి రెండిట్లో ఆధిక్యంలో ఉంది. గుణలో జ్యోతిరాధిత్య సింధియా, విదిశాలో శివరాజ్ సింగ్ చౌహాన్ దూసుకెళ్తున్నారు. చింద్వాడాలో నకుల్ కమల్నాథ్ (కాంగ్రెస్), బాలాఘాట్లో అశోక్ సింగ్ (కాంగ్రెస్) పోటీనిస్తున్నారు.
ఉమ్మడి ప.గో. జిల్లా భీమవరంలో జనసేన అభ్యర్థి అంజిబాబు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు కాకినాడ రూరల్లో జనసేన క్యాండిడేట్ పంతం నానాజీ, తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఆధిక్యంలో ఉన్నారు. అటు ఉండి, రాజమండ్రి సిటీ, పాలకొల్లు, దెందులూరులో టీడీపీ అభ్యర్థులు రఘురామకృష్ణరాజు, ఆదిరెడ్డి వాసు, నిమ్మల రామానాయుడు, చింతమనేని ప్రభాకర్ లీడ్లో ఉన్నారు.
AP: ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్ధన్ రావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 2,760 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు.
TG: ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఫస్ట్ రౌండ్లో 19,935 ఓట్ల లీడింగ్లో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
AP: గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య వెనుకంజలో ఉన్నారు. పొన్నూరులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర ముందంజలో ఉన్నారు.
AP: తిరుపతి పార్లమెంట్ స్థానంలో వైసీపీ సిట్టింగ్ ఎంపీ మద్దెల గురుమూర్తి ఆధిక్యంలో వచ్చారు. తొలి రౌండులో బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ లీడింగులో ఉండగా, ఇప్పుడు గురుమూర్తి ముందంజలో ఉన్నారు. అనంతపురం అర్బన్ అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆధిక్యంలో ఉన్నారు. వైసీపీ నుంచి అనంత వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నారు. పుట్టపర్తిలో శ్రీధర్రెడ్డి(వైసీపీ) లీడింగులో ఉన్నారు.
AP: శ్రీకాకుళం ఎంపీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్నాయుడు ముందంజలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్పై రామ్మోహన్ నాయుడు 1,861 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
హైదరాబాద్ ఎంపీ స్థానంలో BJP అభ్యర్థి మాధవీలత లీడింగ్లో ఉన్నారు. అక్కడ ఎవరూ ఊహించని విధంగా అసదుద్దీన్ ఒవైసీ వెనకబడ్డారు.
AP: జగ్గంపేటలో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రు 3550 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ముమ్మడివరం, అమలాపురంలో టీడీపీ అభ్యర్థులు దాట్ల సుబ్బరాజు, అయితాబత్తుల ముందంజలో ఉన్నారు.
TG: మహబూబ్నగర్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఫస్ట్ రౌండ్లో 3వేల ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
Sorry, no posts matched your criteria.