India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బంగారం ధరలు మరోసారి పైపైకి ఎగబాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.220 పెరిగి రూ.79,640కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.200 పెరిగి రూ.73,000గా నమోదైంది. అటు సిల్వర్ రేట్ దూసుకెళ్తోంది. నిన్నటి వరకు రూ.1,07,000 ఉండగా ఇవాళ మరో రూ.2000 పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ రేట్ రూ.1,09,000కి చేరింది.

TG: గ్రూప్-1 మెయిన్స్ రీషెడ్యూల్, జీవో 29 రద్దు పిటిషన్పై జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని, హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచించింది. అటు ఫలితాల వెల్లడికి, నవంబర్ 20కి ముందే తుది తీర్పు ఇవ్వాలని హైకోర్టును ఆదేశించింది. తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయన్న HC వ్యాఖ్యలను కోట్ చేసింది.

జీవన ప్రయాణంలో ఎదురయ్యే వ్యక్తుల గురించి ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘మీ జీవిత ప్రయాణంలో ఎవరినీ నిందించకండి. ఎందుకంటే, మంచి వ్యక్తులు మాత్రమే మీకు ఆనందాన్ని ఇస్తారు. చెడు వ్యక్తులు మీకు అనుభవాన్ని ఇస్తారు. చెత్తవారు మీకు గుణపాఠం చెబుతారు. ఉత్తమమైన వారు మీకు జ్ఞాపకాలను మిగిల్చి వెళ్లిపోతారు’ అని పోస్ట్ చేశారు. గోయెంకా తెలిపిన వ్యక్తులు మీకూ పరిచయం అయ్యారా?

TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల అంశంలో అభ్యర్థులకు చుక్కెదురైంది. పరీక్షల రీషెడ్యూల్, జీవో 29 రద్దుపై గ్రూప్-1 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణను న్యాయస్థానం తిరస్కరించింది. ఇవాళ జరిగే పరీక్ష కోసం అభ్యర్థులు కేంద్రాల్లోకి వెళ్లారని, ఇలాంటి సమయంలో తాము జోక్యం చేసుకోలేమని పిటిషన్ను కొట్టేసింది. ఈ అంశంలో మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చేందుకు నిరాకరించింది.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు మీడియేషన్ చేయగల క్రెడిబిలిటీ భారత్కు ఉందని బ్రిటన్ మాజీ PM డేవిడ్ కామెరాన్ అన్నారు. అవతలి భూభాగాన్ని ఫోర్స్తో ఆక్రమించకుండా పుతిన్ను ఆపగలదని చెప్పారు. మూడో హయాం ఆరంభంలో ఇంత ఎనర్జీతో మోదీ స్పీచ్ చూడటం చాలా బాగుందన్నారు. ‘ఇండియా సెంచరీ’ని తాను నమ్ముతానని, ఏదో ఒక దశలో దేశం అతిపెద్ద ఎకానమీగా ఎదుగుతుందన్నారు. UNSCలో భారత్కు పర్మనెంట్ సీట్ ఉండాల్సిందేనన్నారు.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షపై దాఖలైన పిటిషన్ విచారణను CJI చంద్రచూడ్ <<14413566>>పాస్ ఓవర్<<>> చేశారు. అడ్వకేట్లకు ఒకే సమయంలో వేర్వేరు కేసులు ఉన్నపక్షంలో ఏదైనా కేసును పాస్ ఓవర్ చేయమని కోర్టును కోరవచ్చు. అంటే ఆరోజు విచారణకు సిద్ధంగా ఉన్న కేసులన్నీ విచారించిన తర్వాత పాస్ ఓవర్ చేసిన కేసును విచారిస్తారు.

భారత విమానాలకు వరుస బెదిరింపుల నడుమ ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ తీవ్ర హెచ్చరికలు చేశాడు. నవంబర్ 1 నుంచి 19 వరకు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దని వార్నింగ్ ఇచ్చాడు. గత ఏడాది కూడా ఇదే తరహా బెదిరింపులకు పాల్పడ్డాడు. కాగా అతడిని 2020లో కేంద్రం టెర్రరిస్ట్గా ప్రకటించింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ సినిమా నుంచి ఇవాళ సాయంత్రం 4.05 గంటలకు అప్టేడ్ రానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ‘నేను రెడీ.. మీరు రెడీ నా?’ అంటూ రాసుకొచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. హారర్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల కానుంది.

TG: గ్రూప్-1పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం అయింది. సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే పిటిషన్ను న్యాయమూర్తి పాస్ ఓవర్ చేశారు. లిస్ట్లో పిటిషన్లపై విచారణ మొత్తం పూర్తయ్యాక దీన్ని విచారణకు స్వీకరిస్తామని చెప్పారు. కాగా గ్రూప్-1 అభ్యర్థుల తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించనున్నారు.

ఏపీ హైకోర్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని ఆయన పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం రేపు విచారించే అవకాశం ఉంది. 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా, అనుమతి లేకుండా భారీగా జన సమీకరణ చేపట్టారని అల్లు అర్జున్పై గతంలో కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.