India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘కంగువ’ వచ్చే నెల 14వ తేదీన ఎనిమిది భాషల్లో రిలీజ్ కానుంది. అయితే, దీనికోసం మూవీ టీమ్ డబ్బింగ్ ఆర్టిస్టును ఉపయోగించలేదు. దర్శకుడు శివ అతని బృందం అధునాతన AI సాంకేతికతను ఉపయోగించినట్లు సినీవర్గాలు తెలిపాయి. సూర్య వాయిస్ని ప్రతి భాషలో AI డబ్బింగ్ చేసినట్లు పేర్కొన్నాయి. కాగా, ఈనెల 20న జరిగే ఆడియో లాంచ్కు సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రభాస్లను ఆహ్వానించినట్లు సమాచారం.

AP: గత ఐదేళ్లలో ఆలయాలను భ్రష్టు పట్టించారని కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతి రాజు మండిపడ్డారు. APలోని అన్ని ఆలయాల్లో ప్రసాదం కల్తీ చేశారని ఆరోపించారు. రామతీర్థ విగ్రహాన్ని ధ్వంసం చేసి విధ్వంస పాలన చేశారని దుయ్యబట్టారు. నాడు విగ్రహం కోసం నిధులు సేకరించి పంపిస్తే వెనక్కి పంపారన్నారు. ఇంట్లో ఒక మతం, బయట మరో మతంపై మాట్లాడే నాయకులను నమ్మొద్దని, తమ ప్రభుత్వంలో ఆలయాల నిర్వహణ సవ్యంగా సాగుతోందన్నారు.

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇది రానున్న 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించింది. బుధ, గురువారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని పేర్కొంది.

TG: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ MLA జగ్గారెడ్డి ప్రకటించారు. తన భార్య నిర్మలారెడ్డి లేదా తన అనుచరుడు ఆంజనేయులతో పోటీ చేయిస్తానని తెలిపారు. ‘దీనిపై CM రేవంత్, మహేశ్ కుమార్ గౌడ్తో చర్చిస్తా. గత ఎన్నికల్లో BRS నేతలు ఓటుకు రూ.2వేలు ఇచ్చి నన్ను ఓడించారు. ఓడినా ప్రజల మధ్యే ఉంటూ అభివృద్ధికి నిధులు తెస్తా’ అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

ఉమెన్స్ టీ20 WC సందర్భంగా భారత అభిమానులకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ గెలవాలని కోరుకునే పరిస్థితి వచ్చింది. నిన్న ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో భారత మహిళా జట్టు సెమీస్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. ఇవాళ న్యూజిలాండ్పై పాక్ గెలిస్తేనే మనం సెమీస్ చేరుతాం. దీంతో ఇవాళ ఎలాగైనా పాక్ గెలవాలని టీమ్ ఇండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దీనిపై మీ కామెంట్?

ఏపీలోని గ్రామీణ సంస్థలకు కేంద్రం రూ.988.773 కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రపంచాయతీరాజ్ శాఖ ఈ నిధులు అందించింది. 9 జడ్పీలు, 615 మండల పంచాయతీలు, 12,853 గ్రామ పంచాయతీలకు ఈ నిధులు అందిస్తారు. అత్యవసర సౌకర్యాలు, మౌలిక వసతుల కోసం ఈ నిధులు వెచ్చించుకోవచ్చు. జీతాలు, పరిపాలన ఖర్చుల కోసం వాడకూడదు.

బిహార్లోని సీతామర్హికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మిథిలేశ్ కుమార్ విద్యార్థినులకు కత్తులు పంపిణీ చేశారు. అమ్మాయిలను తాకిన దుర్మార్గుల చేతులను నరికేయాలని పిలుపునిచ్చారు. విజయదశమి వేడుకల్లో భాగంగా కత్తులు, తుపాకులు, ఇతర ఆయుధాలకు ఆయుధపూజ నిర్వహించారు. సోదరీమణులను తాకడానికి కూడా ఎవరూ ధైర్యం చేయకూడదని, చేస్తే నరికేయాలని స్పష్టం చేశారు. ఇలాంటి నిర్ణయాలకు ప్రజలూ మద్దతు తెలపాలని కోరారు.

టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ బర్త్ డే సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ స్పెషల్ విషెస్ తెలిపింది. ‘తన పనిపట్ల ఎంతో కమిటెడ్గా ఉంటారు. పేరుకు తగ్గట్లు అంత గంభీరంగా ఉండరు. కానీ, చాలా అగ్రెసివ్, బెస్ట్ టీచర్’ అని తెలుపుతూ ఓ ఫొటోను పోస్ట్ చేసింది. పైన తెలిపిన వాటిలో పట్టు సాధించిన లెజెండ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ట్వీట్లో రాసుకొచ్చింది. గంభీర్ ఇన్నింగ్స్లో మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేయండి.

ఇజ్రాయెల్పై 9/11 తరహా దాడులకు హమాస్ కుట్ర పన్నినట్లు IDF తెలిపింది. ఈ కుట్రకు సంబంధించిన రికార్డులను ఖాన్ యూనిస్లోని హమాస్ కమాండ్ సెంటర్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. టెల్ అవీవ్లోని 70 అంతస్తుల భవనం మోషే అవివ్, ఇజ్రాయెల్ టవర్లను నేలమట్టం చేసేందుకు ప్లాన్ చేసినట్లు వెల్లడించింది. ఈ రికార్డుల్లో ఇరాన్ ప్రతినిధులతో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్ జరిపిన సంభాషణలు కూడా ఉన్నట్లు తెలిపింది.

వారం ప్రారంభంలో స్టాక్ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 319 పాయింట్లు, నిఫ్టీ 72 పాయింట్ల ప్లస్లో ఉన్నాయి. దీంతో సెన్సెక్స్ ప్రస్తుతం 81,666 పాయింట్ల వద్ద, నిఫ్టీ 25,037 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. JSW స్టీల్, L&T, టాటా స్టీల్, HDFC, అదానీ పోర్ట్స్, రిలయన్స్, NTPC తదితర షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, టైటాన్, నెస్లే ఇండియా షేర్లు పడిపోయాయి.
Sorry, no posts matched your criteria.