India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: విజయనగరం లోక్సభ స్థానం నుంచి టీడీపీయే బరిలోకి దిగనుంది. తొలుత పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించారు. అయితే తాజాగా కమలం పార్టీ విజయనగరానికి బదులు రాజంపేట ఎంపీ స్థానాన్ని తీసుకుంది. అక్కడి నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఇక విజయనగరం నుంచి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకటరావు బరిలోకి దిగే అవకాశముంది.
మార్కెట్లో దొరికే రంగుల్లో రసాయనాలు కలపడంతో చర్మానికి, కళ్లకు హాని కల్గుతుంది. అయితే ఇంట్లోనే కొన్ని వస్తువులతో మీరే కలర్స్ తయారుచేసుకోవచ్చు.
*ఎరుపు: పసుపులో నిమ్మరసం కలపి, ఆరబెట్టండి. లేదా దానిమ్మ తొక్కలను నీటిలో ఉడకబెట్టినా చాలు.
*పింక్: పసుపులో నిమ్మరసం తక్కువ మోతాదులో కలిపితే చాలు.
*ఆకుపచ్చ: గోరింట పిండిని బియ్యప్పిండి లేదా మైదాతో కలపండి.
*బ్రౌన్: కాఫీ పౌడర్ నీటిలో వేసి మరిగించండి.
TG: ఏప్రిల్ 17న శ్రీరామనవమి రోజున జరిగే భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి కల్యాణోత్సవం టికెట్లు నేడు విడుదల కానున్నాయి. ఉభయ దాతల టికెట్ ధర ₹7,500గా ఉంది. దీనిపై ఇద్దరికి ప్రవేశం ఉంటుంది. ₹2500, ₹2000, ₹1000, ₹300, ₹150 టికెట్లపై ఒక్కరు వెళ్లవచ్చు. ఈ టికెట్లతో పాటు 18న జరిగే పట్టాభిషేకం, ఇతర పూజా టికెట్లను టెంపుల్ <
AP: YCP రెబల్ MP రఘురామకృష్ణరాజుకు BJP షాక్ ఇచ్చింది. నరసాపురం టికెట్ కూటమిలోని ఏ పార్టీకి దక్కినా.. తానే పోటీ చేస్తానంటూ పలుమార్లు చెప్పుకున్న ఆయనకు <<12919849>>నిరాశ<<>> ఎదురైంది. ఆ స్థానాన్ని శ్రీనివాసవర్మకు BJP కేటాయించింది. ఇప్పుడు ఆయన టీడీపీలో చేరి కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేస్తారా? లేక ఇండిపెండెంట్గా పోటీలో ఉంటారా? అనేది తెలియాల్సి ఉంది. విజయనగరం ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేస్తారనే ప్రచారమూ జరుగుతోంది.
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ప్రారంభమయ్యాయి. నిన్న రాత్రి హోలికా దహనం (కాముడి దహనం) నిర్వహించారు. హిందూ క్యాలెండర్ ప్రకారం శుక్లపక్షం పౌర్ణమి రోజున హోలీ జరుపుకుంటారు. పౌర్ణమి తిథి నిన్న ఉ.9 గంటలకు ప్రారంభమై.. నేడు మ.12.29 వరకు ఉండనుంది. ఈ సమయంలో హోలీ జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. చీకటి పడ్డాక హోలీ చేసుకుంటే దరిద్రం చుట్టుకునే అవకాశం ఉందని చెబుతుంటారు.
IPL-2024లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరు వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 31 మ్యాచుల్లో తలపడగా PBKS 17, RCB 14 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఈ సీజన్ను పంజాబ్ విజయంతో ఆరంభించగా, ఆర్సీబీ ఓటమితో మొదలుపెట్టింది. మరి ఇవాళ్టి మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందని అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.
నిన్న GTపై ముంబై ఓడిపోవడంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 5 టైటిల్స్ అందించిన సారథిని పక్కనబెట్టినందుకు ముంబైకి ఇలాగే జరగాలని పోస్టులు చేస్తున్నారు. ‘రోహిత్ శర్మ రన్స్ చేయాలి, ముంబై ఓడిపోవాలి’ అనేదే తమ నినాదం అని చెబుతున్నారు. నిన్నటి మ్యాచులో రోహిత్ 43 రన్స్ చేశారు. మరి రోహిత్ శర్మ ఫ్యాన్స్ అభిప్రాయంపై మీ కామెంట్?
TG: రాష్ట్రంలోని ప్రజలందరికీ జులై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులను ఇవ్వనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఆధార్ నంబర్ తరహాలో ఒక్కో పౌరుడికి స్మార్ట్ కార్డు వంటి హెల్త్ ప్రొఫైల్ సంఖ్యను ఇస్తామన్నారు. పేరు ఎంటర్ చేయగానే ఆ వ్యక్తికి సంబంధించిన వైద్య సేవల వివరాలు తెలుస్తాయని, ఏ డాక్టర్ను సంప్రదించినా వెంటనే ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుని వైద్యం చేసేందుకు వీలుంటుందని పేర్కొన్నారు.
టీడీపీ గెలుపుతోనే మాదిగల గెలుపు సాధ్యమని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఉండవల్లిలో చంద్రబాబుతో సమావేశమైన సందర్భంగా ఎన్డీయేకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ‘కొత్త ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలి. రాజ్యాంగబద్ధ సంస్థల్లో మాదిగలకు తగిన ప్రాధాన్యం కల్పించాలి. ఎస్సీలకు వైసీపీ రద్దు చేసిన పథకాలను తిరిగి ప్రారంభించాలి’ అని చంద్రబాబును కోరారు.
TSRDC CET-2024ను ఏప్రిల్ 28న నిర్వహించనున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు వెల్లడించారు. ఈ పరీక్షకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసిన వారు అర్హులని, ఏప్రిల్ 12లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 21 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు.
Sorry, no posts matched your criteria.