India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హీరోయిన్ రాధికా ఆప్టే తల్లి కాబోతున్నారు. ఆమె నటించిన ‘సిస్టర్ మిడ్నైట్’ మూవీని BFI లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శిస్తున్న సందర్భంగా రాధిక బేబీ బంప్తో కనిపించారు. ఈ ఫొటోలు వైరలవుతున్నాయి. దీంతో ఆమెకు అభిమానులు, తోటి నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ENGకు చెందిన మ్యుజీషియన్ బెనెడిక్ట్ టేలర్ను రాధిక 2012లో వివాహం చేసుకున్నారు. ఈమె తెలుగులో రక్తచరిత్ర, లెజెండ్, లయన్ చిత్రాల్లో నటించారు.

NZతో తొలి టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. లంచ్ బ్రేక్ సమయానికి 34 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. భారత్ ఇన్నింగ్సులో నలుగురు ప్లేయర్లు (కోహ్లీ, సర్ఫరాజ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా) డకౌట్ అయ్యారు. ప్రస్తుతం పంత్ (15*) క్రీజులో ఉన్నారు. విలియం 3, హెన్రీ 2, సౌథీ ఒక వికెట్ పడగొట్టారు.

ప్రభాస్ నటించిన సలార్-1 మూవీ హిందీ వెర్షన్ మరో అరుదైన ఘనత సాధించింది. ఉత్తరాదిన టీవీ ప్రీమియర్స్లో 30 మిలియన్ల వ్యూస్ సాధించింది. తద్వారా ఈ ఏడాది అత్యధిక వ్యూస్ పొందిన టాప్-3 చిత్రాల జాబితాలో చేరింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ‘స్టార్ గోల్డ్’ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. అలాగే 2023 నుంచి అత్యధిక రేటింగ్ పొందిన డబ్బింగ్ మూవీగా రికార్డు సృష్టించినట్లు పేర్కొంది.

అన్నాడీఎంకే 53వ వార్షికోత్సవం సందర్భంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ తాను ఆరాధించే గొప్ప నాయకుడని, పేదల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన వారసత్వాన్ని జయలలిత కొనసాగించారని, ఆమె అడుగుజాడల్లో పార్టీ మరింత పుంజుకోవాలని ఆకాంక్షించారు. తమిళ భాష, సంస్కృతి, వారి పోరాట పటిమ పట్ల తనకెంతో గౌరవముందని పేర్కొన్నారు.

ఖలిస్థానీ టెర్రరిస్టు హర్దీప్ నిజ్జర్ హత్యకేసులో ఆధారాల్లేవన్న జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు భారత్కు ఘన విజయమని కెనడా జర్నలిస్టు డేనియెల్ బార్డ్మన్ అన్నారు. ‘ఎవిడెన్స్ లేదు కాబట్టి జియో పొలిటికల్గా ఇది భారత్కు విక్టరీ. కానీ కెనడాకు వచ్చిందేంటి? హర్దీప్ టెర్రరిస్టా లేక కమ్యూనిస్టా అనే జవాబివ్వని ప్రశ్నపైనే దౌత్యవివాదం నెలకొంది. దీనిపై కదలికే లేదు. అసలేం చేస్తున్నాడో ట్రూడోకే తెలియడం లేదు’ అన్నారు.

పరిస్థితులు ఎలా ఉన్నా రిషభ్ పంత్ మాత్రం తన దూకుడు తగ్గదని మరోసారి నిరూపించారు. NZతో తొలి టెస్టులో భారత్ 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో పంత్ క్రీజులోకి వచ్చారు. బంతి స్వింగ్ అవుతుండటంతో తన ట్రేడ్మార్క్ షాట్కు ప్రయత్నించారు. పంత్ ధైర్యం చూసి ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం జైస్వాల్ (12*), పంత్ (13) నెమ్మదిగా కుదురుకుంటున్నారు.

తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన 8 మెడికల్ కాలేజీలను ఈ నెల 21న ప్రారంభించాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. వీటిని CM రేవంత్తో ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. మంత్రి సీతక్క నియోజకవర్గంలోని కాలేజీని ప్రారంభించాలని CMను కోరినట్లు సమాచారం. జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, నర్సంపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరిలో మెడికల్ కాలేజీలు ఏర్పాటైన సంగతి తెలిసిందే.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక మార్పులు చేస్తోంది. ఇప్పటికే హెడ్ కోచ్ రికీ పాంటింగ్ను తప్పించగా, కెప్టెన్ రిషభ్ పంత్పైనా వేటు వేయనున్నట్లు సమాచారం. అతని స్థానంలో అక్షర్ పటేల్కు సారథ్య బాధ్యతలు అప్పగించనుందని వార్తలు వస్తున్నాయి. అయితే పంత్ను రూ.18 కోట్లకు రిటెన్షన్ చేసుకుంటుందని తెలుస్తోంది. కాగా తాను వేలంలో పాల్గొంటే ఎంత రేటు రావొచ్చని ఇటీవల రిషభ్ చేసిన <<14336476>>ట్వీట్<<>> వైరలైన విషయం తెలిసిందే.

TG: గుజరాత్ పత్తికి మద్దతు ధరగా క్వింటాకు ₹8,257 చెల్లిస్తున్న కేంద్రం.. తెలంగాణ పత్తికి ₹7,521 మాత్రమే ఇవ్వడం దుర్మార్గమని హరీశ్రావు మండిపడ్డారు. రాష్ట్ర రైతులపై ఎందుకీ వివక్ష అని ప్రశ్నించారు. ‘వన్ నేషన్-వన్ ట్యాక్స్, వన్ ఎలక్షన్, వన్ రేషన్ కార్డ్, వన్ మార్కెట్ అని ఊదరగొట్టే కేంద్రం వన్ నేషన్- వన్ MSP ఎందుకు ఇవ్వట్లేదు. ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఎందుకుంది?’ అని Xలో నిలదీశారు.

అల్లు అర్జున్-రష్మిక జంటగా నటిస్తున్న పుష్ప-2 రిలీజ్(డిసెంబర్ 6)కు మరో 50 రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో మేకర్స్ ఐకాన్ స్టార్ స్పెషల్ పోస్టర్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సీరియస్గా కుర్చీలో కూర్చొన్న బన్నీ లుక్ ఆకట్టుకుంటోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, అజయ్ ఘోష్, రావు రమేశ్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.