News March 21, 2024

మెదడులో రక్తస్రావం ఎందుకు జరుగుతుందంటే..

image

మెదడులో రక్తస్రావం కారణంగా జగ్గీ వాసుదేవ్‌కు బ్రెయిన్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఇది బ్రెయిన్ స్ట్రోక్ వలనే తలెత్తిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘మెదడు కణాలకు అందాల్సిన ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వలన రక్తం సరఫరా నిలిచిపోవడమే బ్రెయిన్ స్ట్రోక్‌. తీవ్రంగా తలనొప్పి, ముఖం ఓవైపునకు వంగడం, చేతులపై నియంత్రణ లేకపోవడం, తిమ్మిర్లు వంటి లక్షణాలుంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి’ అని సూచిస్తున్నారు.

News March 21, 2024

BIG BREAKING: గ్రూప్-1పై హైకోర్టు కీలక తీర్పు

image

AP: 2018 గ్రూప్-1 మెయిన్స్‌ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. విధులు నిర్వహిస్తున్న వారంతా ఉద్యోగాల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. జవాబుపత్రాల మూల్యాంకనం సరిగ్గా చేయలేదంటూ ఇటీవల మెయిన్స్‌‌ను హైకోర్టు రద్దు చేసింది. తాము నిబంధనల ప్రకారమే వ్యవహరించామంటూ APPSC డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది.

News March 21, 2024

2013లో సచిన్‌ను.. ఇప్పుడు కోహ్లీని!

image

రేపు జరిగే IPL తొలి మ్యాచ్ కోసం RCB ప్లేయర్లు చెన్నై స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే, నిన్న నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న కోహ్లీని గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇమిటేట్ చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 2013IPLలో మ్యాక్స్‌వెల్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ బ్యాటింగ్‌ను అచ్చం ఇలానే ఇమిటేట్ చేశారని ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు.

News March 21, 2024

బీజేపీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై విచారణ జరగాలి: సోనియా గాంధీ

image

బీజేపీకి రూ.వేల కోట్ల ఎలక్టోరల్ బాండ్లు ఎలా వచ్చాయని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రశ్నించారు. దీనిపై దర్యాప్తు సంస్థలు విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ‘మేం ప్రజల నుంచి న్యాయబద్ధంగా సేకరించిన నిధులను ఐటీ ఫ్రీజ్ చేయడాన్ని ఖండిస్తున్నాం. అధికార పక్షం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది. దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు’ అని మండిపడ్డారు.

News March 21, 2024

బీజేపీకి మరో షాక్.. రాజకీయాలకు గుడ్‌బై

image

ఎన్నికల వేళ బీజేపీలో అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కర్ణాటక మాజీ CM, ఎంపీ సదానంద గౌడ ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. బెంగళూరు నార్త్ సీటు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరనని, మోదీనే మళ్లీ ప్రధాని కావాలని కోరుకుంటున్నానని అన్నారు. కాగా ఇటీవల RLJP చీఫ్ పశుపతి పరాస్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు.

News March 21, 2024

ఎన్నికల కమిషనర్ల నియామకంపై స్టే విధించలేం: సుప్రీంకోర్టు

image

ఎన్నికల కమిషనర్ల నియామకంపై స్టే విధించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్టే విధిస్తే అది గందరగోళానికి దారి తీస్తుందని ధర్మాసనం తెలిపింది. ఈసీలుగా నియమితులైన జ్ఞానేశ్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధుపై ఎలాంటి అభియోగాలు లేవని పేర్కొంది. ఈసీ నియామక ప్రక్రియపై కేంద్రాన్ని ప్రశ్నించిన కోర్టు.. ఆరు వారాల్లోగా దీనిపై సమాధానం చెప్పాలని ఆదేశించింది.

News March 21, 2024

BREAKING: వాలంటీర్లకు షాక్

image

AP: ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రచారాల్లో పాల్గొంటున్న వాలంటీర్లపై ఉన్నతాధికారులు వేటు వేస్తున్నారు. మచిలీపట్నంలో YCP అభ్యర్థి పేర్ని కిట్టు ప్రచారంలో పాల్గొన్న ఆరుగురు, పొదిలిలో ముగ్గురు, మైలవరంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న 11 మంది వాలంటీర్లు, గుంటూరు జిల్లా చేబ్రోలులో వైసీపీ ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్న 45 మంది వాలంటీర్లపై వేటు వేశారు. ఇటీవలే 19 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు.

News March 21, 2024

స్టార్ క్రికెటర్లకు షాక్

image

పొట్టి ఫార్మాట్ క్రికెట్‌లో అదరగొడుతోన్న బాబర్ ఆజం, డేవిడ్ వార్నర్, జేసన్ రాయ్, టిమ్ డేవిడ్, మహ్మద్ రిజ్వాన్‌కు షాక్ తగిలింది. ఇంగ్లండ్‌లో జరిగే ది హండ్రెడ్ లీగ్-2024 వేలంలో వీళ్లని కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ముందుకు రాలేదు. విండీస్ ఆటగాళ్లు నికోలస్ పూరన్, ఆండ్రూ రస్సెల్, హెట్‌మెయిర్‌ ఫస్ట్ రౌండ్‌లోనే అమ్ముడుపోయారు. మహిళల విభాగంలో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్, జెమీమా, దీప్తి శర్మను ఎవరూ తీసుకోలేదు.

News March 21, 2024

‘మాజీ జవాన్‌కు రూ.50లక్షల పరిహారం’.. సైన్యానికి సుప్రీం ఆదేశం

image

తప్పుడు కారణంతో ఉద్యోగం కోల్పోయిన మాజీ జవాన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రూ.50 లక్షల పరిహారం సహా పెన్షన్ అందించాలని సైన్యాన్ని ధర్మాసనం ఆదేశించింది. కాగా 2001లో హవల్‌దార్‌గా విధులు నిర్వహిస్తున్న ఆ జవాన్‌కు మిలిటరీ ఆస్పత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో HIV ఉన్నట్లు తప్పుడు రిపోర్ట్ వచ్చింది. ఫలితంగా ఆయనను విధుల్లోంచి తొలగించారు. దీనిపై ఆయన సుప్రీంను ఆశ్రయించగా ఈ మేరకు తీర్పునిచ్చింది.

News March 21, 2024

రోహిత్, హార్దిక్ రాణిస్తారనే నమ్మకముంది: హర్భజన్

image

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ మార్పుపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించారు. ‘కెప్టెన్సీ మార్పు తర్వాత ఏ జట్టయినా కుదురుకోవడం తేలిక కాదు. రోహిత్, హార్దిక్ పాండ్యలలో ఎవరు ఇబ్బంది లేకుండా ఆడతారు? ఎవరు అసౌకర్యంగా భావిస్తారు? అనేది కాలమే చెబుతుంది. వీరిద్దరూ వివాదాలను పక్కనపెట్టి జట్టు భవిష్యత్ కోసం రాణిస్తారనే నమ్మకం నాకుంది’ అని అభిప్రాయపడ్డారు.

error: Content is protected !!