News March 26, 2024

రజనీ-లోకేశ్ సినిమా ఎప్పుడంటే?

image

డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో మూవీ తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ జూన్‌లో ప్రారంభిస్తామని లోకేశ్ ఓ కార్యక్రమంలో తెలిపారు. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. రజనీ సినిమా తర్వాత ‘ఖైదీ-2’ సినిమాను మొదలు పెడతానని పేర్కొన్నారు.

News March 26, 2024

వెల్లుల్లి, మిరియాల సారంతో గుండె జబ్బులకు ఔషధం

image

గుండె జబ్బుల నుంచి రక్షణ కోసం మూలికలతో HYD కంపెనీ లీ హెల్త్ డొమైన్ ‘లైఫోస్టెరాల్ సాఫ్ట్ జెల్’ అనే క్యాప్సూల్‌ను తయారుచేసింది. వెల్లుల్లి సారం, పసుపు నుంచి తీసిన కుర్కుమిన్, ఫైటోస్టెరాల్, లైకోపిన్, మెంతికూర, నల్ల మిరియాల నుంచి తీసిన ఫైపెరిన్ తదితరాలతో దీన్ని రూపొందించింది. ఈ క్యాప్సూల్ కొలెస్టరాల్, ట్రైగ్లిజరైడ్స్‌ను సమతుల్యం చేసి ఫ్రీరాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తుందని కంపెనీ తెలిపింది.

News March 26, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్యాపింగ్‌తో అధికారులు భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్లు విచారణలో తేలింది. వ్యాపారులు, హవాలా ముఠాల నుంచి భారీగా డబ్బులు వసూల్ చేసి.. విలాసవంతమైన విల్లాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. డబ్బులు వసూలు చేసిన పోలీసుల లిస్ట్‌ను ఏసీబీ సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలో వీరిని విచారించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

News March 26, 2024

మరో మూడు భాషల్లో ‘హనుమాన్’ ఓటీటీ రిలీజ్.. తేదీ ప్రకటన

image

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదలవగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ సంపాదించింది. తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్‍ల ఓటీటీ రిలీజ్‌పై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. హాట్‌స్టార్‌లో ఏప్రిల్ 5వ తేదీ నుంచి మూడు భాషల్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. కాగా, జియో సినిమాలో హిందీ, జీ5లో తెలుగు వెర్షన్‌ను చూడొచ్చు.

News March 26, 2024

రాష్ట్రంలో ‘ఫసల్ బీమా’కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

image

TG: రాష్ట్రంలోనూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయాలంటూ రేవంత్ ప్రభుత్వం చేసిన వినతికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేసే అవకాశం ఉంది. ఈ పథకం రైతులకు అనుకూలంగా లేదని BRS ప్రభుత్వం వ్యతిరేకించగా, కాంగ్రెస్ సర్కారు అమలు చేయడానికి సిద్ధమైంది. ఆహార ధాన్యాల పంటలకు 2%, వాణిజ్య పంటలకు 5% ప్రీమియం చెల్లిస్తే.. ఏదైనా నష్టం వచ్చినప్పుడు పరిహారం అందనుంది.

News March 26, 2024

రఘురామ సీటుపై సస్పెన్స్

image

AP: నరసాపురం MP రఘురామ కృష్ణరాజు BJP నుంచి ఎంపీగా పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా నరసాపురం టికెట్‌ను శ్రీనివాస వర్మకు BJP కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆయనకు అవకాశం ఇవ్వాలని TDP నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. విజయనగరం MP సీటు ఆలోచించగా అక్కడి నాయకులు అంగీకరించలేదట. దీంతో ప.గో జిల్లాలోని ఏదైనా అసెంబ్లీ సీట్లో ఎవరినైనా పోటీకి ఆపి రఘురామను బరిలో నిలిపే అంశంపై యోచిస్తున్నట్లు సమాచారం.

News March 26, 2024

శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం

image

AP: తిరుమల శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 78371 మంది భక్తులు దర్శించుకోగా 25156 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.4 కోట్లు లభించింది.

News March 26, 2024

హార్దిక్ పాండ్యను తిట్టకండి..

image

ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యపై విపరీతమైన ట్రోల్స్ రావడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. అతడిని కెప్టెన్ చేయాలన్న నిర్ణయం ఫ్రాంచైజీది అని.. ఇందుకు అతడిని ఎందుకు తిట్టడం అని ప్రశ్నిస్తున్నారు. చెన్నై కెప్టెన్సీ ధోనీ నుంచి రుతురాజ్‌కు మార్చడంలో CSK ఫ్రాంచైజీ పద్ధతిగా వ్యవహరించిందని, రోహిత్ విషయంలోనూ ముంబై అలా చేసి ఉంటే బాగుండేదంటున్నారు. అలాగే రోహిత్ పట్ల హార్దిక్ గౌరవంగా ఉండాలని సూచిస్తున్నారు.

News March 26, 2024

ఫెడరల్ బ్యాంక్ ‘ఫ్లాష్ పే’.. కీ చైన్‌తో పేమెంట్స్

image

ప్రైవేటు రంగానికి చెందిన ఫెడరల్ బ్యాంక్ ఫ్లాష్ పే పేరుతో స్మార్ట్ కీ చైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్రెడిట్, డెబిట్ కార్డుల తరహాలోనే ఇది పనిచేస్తుంది. పిన్ ఎంటర్ చేయకుండానే రోజుకు 5 లావాదేవీలు, గరిష్ఠంగా రూ.5వేల వరకు చెల్లింపులు చేయొచ్చు. POS మెషీన్ల వద్ద రోజుకు రూ.లక్ష పేమెంట్‌కు అవకాశం ఉంటుంది. ఈ స్మార్ట్ కీ చైన్ ధర రూ.499. సేవలకుగాను ఏడాదికి రూ.199 ఛార్జ్ చేస్తారు.

News March 26, 2024

OTTలోకి కొత్త సినిమా!

image

హర్ష డైరెక్షన్‌లో గోపీచంద్ నటించిన భీమా సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ+హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 5 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. మార్చి 8న విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటించారు.