India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ఈ రబీ సీజన్లో రైతులకు లక్ష కోట్ల రుణ పరపతి కల్పించాలని వ్యవసాయశాఖ నిర్దేశించింది. అందులో రూ.68,060 కోట్లు పంట రుణాలు, రూ.32,390 కోట్లు టర్మ్ లోన్స్ ఇవ్వనుంది. గత సంవత్సరం 3.60 లక్షల మంది కౌలు దారులకు రూ.4,100 కోట్లు రుణాలు ఇచ్చింది. కాగా ఈసారి కనీసం 5 లక్షల మందికి రూ.5వేల కోట్ల రుణాలివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.

ప్రతి ఎకానమీకి బ్యాంకింగ్ సిస్టమే పట్టుగొమ్మ. దానికే చీడపడితే ఆ దేశం దివాలా తీయడం ఖాయం! భూతల స్వర్గంగా భ్రమించే అమెరికా ప్రస్తుత పరిస్థితి ఇదే. ఎందుకంటే US బ్యాంకుల నష్టాలు చరిత్రలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఉన్నాయి. 2008లో సబ్ప్రైమ్ క్రైసిస్ టైమ్లో $75bns లాసెస్తోనే ప్రపంచం అతలాకుతలమైంది. 2024 నాటికి ఇవి 7 రెట్లు పెరిగి $500bnsకు చేరాయి. చాలా బ్యాంకులు లిక్విడ్ క్యాష్ లేక తల్లడిల్లుతున్నాయి.

AP: విజయవాడలో డ్రోన్షోకు సర్వం సిద్ధమైంది. 5000 డ్రోన్లతో పున్నమి ఘాట్లో రేపు, ఎల్లుండి షో నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కనకదుర్గమ్మ, వివిధ రూపాలు, బొమ్మలు, ఆకారాలు, పేర్లు వచ్చేలా నింగిలో డ్రోన్లు కనువిందు చేయనున్నాయి. బెంజ్ సర్కిల్, రామవరప్పాడు రింగ్, వారధి, బస్టాండు, ప్రకాశం బ్యారేజీ వద్ద డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేలు షో చూసేందుకు హాజరవనున్నారు.

అత్యాచారాలు, లైంగిక వేధింపుల ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల మితిమీరుతున్నాయి. చట్టమంటే భయం, భక్తి లేకుండా ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. ఆడబిడ్డల ఉసురుతీస్తున్న మృగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిందే. అలాంటి నేరాలకు పాల్పడాలనే ఆలోచన వస్తేనే వణికేలా మరింత కఠిన శిక్షలు ఉండాలి. కేసుల విచారణ వేగవంతం చేసేలా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని సభ్య సమాజం కోరుతోంది. మీరేమంటారు?

ఇంగ్లండ్లో జరిగే ‘ది హండ్రెడ్’ లీగ్లో పెట్టుబడి పెట్టేందుకు IPL ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఉన్నాయి. ఇప్పటికే CSK, SRH, LSG, MI, KKR, DC తమ బిడ్స్ సబ్మిట్ చేసినట్లు సమాచారం. రాజస్థాన్ కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది తొలి రౌండ్ బిడ్డింగ్ మాత్రమే కావడంతో ఇప్పటికిప్పుడు ఆయా ఫ్రాంచైజీలు జట్లను ఎంచుకోవాల్సిన అవసరం లేదు. IPL మెగావేలం తర్వాత జట్ల ఎంపిక ఉండొచ్చని తెలుస్తోంది.

జాతీయ రైతు నేత రాకేశ్ టికాయత్కు వెస్ట్రన్ UP రైతులు కోలుకోలేని షాక్ ఇచ్చారు. లోక్సభ, హరియాణా ఎన్నికల్లో ఆయన BJPకి వ్యతిరేకంగా, INDIA కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. వెస్ట్రన్ UP రైతుల్లో ఆయనకు గట్టి పట్టుంది. ఆయన చెప్పిందే చేస్తారు. అలాంటిది చెరకు రైతు సహకార ఎన్నికల్లో 151కి 148 సీట్లు BJP గెలవడంతో ఆయన నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టైందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. మరి మీరేమంటారు?

స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 24,956 వద్ద ఆరంభమైన నిఫ్టీ 24,978 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. వెంటనే నష్టాల్లోకి జారుకుంది. ప్రస్తుతం 100 పాయింట్ల పతనంతో 24,754 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 169 పాయింట్ల నష్టంతో 81,054 వద్ద చలిస్తోంది. HDFC BANK, TECH M, HDFC LIFE, ASIAN PAINTS, WIPRO టాప్ గెయినర్స్. టాటా కన్జూమర్, KOTAK BANK, BPCL, INDUS IND, AIRTEL టాప్ లూజర్స్.

AP: మాజీ మంత్రి, YCP నేత పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ను పోలీసులు మదురైలో అరెస్ట్ చేశారు. కోనసీమ అల్లర్ల సమయంలో(2022 జూన్ 6న) అయినవిల్లికి చెందిన వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఇప్పటికే YCP సోషల్ మీడియా కన్వీనర్ ధర్మేశ్ను అరెస్ట్ చేశారు. విచారణలో శ్రీకాంత్ పేరు బయటికి రావడంతో తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ శ్రీకాంత్ను కోర్టులో హాజరుపర్చనున్నారు.

AP: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధురికి తిరుమల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల తిరుమల వెళ్లిన మాధురి అక్కడ ఫొటోషూట్స్, రీల్స్ చేశారంటూ టీటీడీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు<<14326522>> కేసు నమోదైంది<<>>. దీంతో తిరుమల వన్ టౌన్ పోలీసులు టెక్కలిలోని అక్కవరం సమీపంలో శ్రీనివాస్, మాధురి ఉంటున్న ఇంటికి వెళ్లి ఆమెకు నోటీసులిచ్చారు.

IDFC బ్యాంక్: రూ.5లక్షల లోపు బ్యాలెన్స్పై 3% వడ్డీ, రూ.5 లక్షల- రూ.100 కోట్ల మధ్య బ్యాలెన్స్ ఉంటే అత్యధికంగా 7.25% వడ్డీ అందిస్తోంది.
HDFC, ICICI: రూ.50 లక్షల లోపు 3% వడ్డీ, ఆపై బ్యాలెన్స్ ఉంటే 3.5% వడ్డీ అందిస్తున్నాయి.
SBI: రూ.10 కోట్ల లోపు బ్యాలెన్స్పై 2.70 %, ఆపై ఉంటే 3% వడ్డీ అందిస్తోంది
PNB: రూ.10 లక్షల లోపు బ్యాలెన్స్కు 2.70%, రూ.10 లక్షల- రూ.100 కోట్ల మధ్య ఉంటే 2.75% చెల్లిస్తుంది.
Sorry, no posts matched your criteria.