News November 14, 2025

‘ఫర్టిగేషన్’లో ఎరువులను ఎలా అందించాలి?

image

ఈ మధ్యకాలంలో రైతులు సేంద్రియ వ్యవసాయ పంటలకు జీవామృతం, వేస్ట్ డీకంపోజర్, వర్మీవాష్, జీవన ఎరువులను డ్రిప్ ద్వారానే అందిస్తున్నారు. జీవామృతాన్ని మాత్రం వడకట్టిన తర్వాత డ్రిప్ ద్వారా మొక్కలకు అందించాలి. రసాయన ఎరువులను డ్రిప్ ద్వారా అందిస్తే అన్ని మొక్కలకు సరైన మోతాదులో అందుతుంది. దీంతో పంట ఏకరీతిగా ఉంటుంది. ద్రవ రూపంలో నత్రజని, భాస్వరం, పొటాషియం మాత్రమే కాకుండా సూక్ష్మపోషక పదార్థాలను అందించవచ్చు.

News November 14, 2025

కిషన్ రెడ్డి సచివాలయానికి రావాలని ఆహ్వానిస్తున్నా: రేవంత్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కిషన్ రెడ్డి తానే స్వయంగా అభ్యర్థిగా మారినా డిపాజిట్ దక్కించుకోలేకపోయారని CM రేవంత్ ఎద్దేవా చేశారు. ‘భూకంపం వచ్చే ముందు భూమి కొద్దిగా కంపించి మనల్ని అలర్ట్ చేస్తుంది. మనం తేరుకోకపోతే భూగర్భంలో కలిసిపోతాం. ఇవాళ్టి ఫలితం BJPకి అలాంటి ఇండికేషనే. కిషన్ రెడ్డి తేరుకోవాలి. ఆయన సచివాలయానికి రావాలని రాష్ట్ర CMగా ఆహ్వానిస్తున్నా. మహానగరం అభివృద్ధికి సహకరించాలి’ అని కోరారు.

News November 14, 2025

ఉపఎన్నికల్లో ఏయే పార్టీలు గెలిచాయంటే…

image

దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. వీటిలో TG, రాజస్థాన్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది. J&Kలో 2 సీట్లకు గాను BJP, PDP ఒక్కొక్కటి చొప్పున దక్కించుకున్నాయి. ఝార్ఖండ్‌లో జేఎంఎం, పంజాబ్‌లో ఆప్ అభ్యర్థులు గెలిచారు. మిజోరంలో MNF అభ్యర్థి, ఒడిశాలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.

News November 14, 2025

గెలిస్తేనే మాస్క్ తీస్తానని.. ఓడిపోయింది

image

బిహార్ ఎన్నికల్లో గెలిస్తేనే మాస్క్ తీస్తానని శపథం చేసిన ప్లూరల్స్ పార్టీ చీఫ్ పుష్పమ్ ప్రియాచౌదరి ఓడిపోయారు. దర్భంగా నుంచి పోటీ చేసిన ఆమె 8వ స్థానంతో సరిపెట్టుకున్నారు. BJP అభ్యర్థి సంజయ్ సరోగినే ఈసారి కూడా విజయం సాధించారు. బిహార్‌కు కొత్త బ్రాండ్ తీసుకొస్తానంటూ 2020లో ప్రియ ‘ది ప్లూరల్స్ పార్టీ’ స్థాపించారు. 2020లో 148 స్థానాల్లో పోటీచేసి ఓడిపోయారు. ఈసారి 243 స్థానాల్లో బరిలోకి దిగారు.

News November 14, 2025

‘క్రెడిట్’ రాజకీయం.. BRS ఓటమికి కీలక కారణం?

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బాధ్యత KTRకు అప్పగించడం కొంతమంది ముఖ్య నేతలకు మింగుడు పడలేదని టాక్. గెలిస్తే ఆయనకు క్రెడిట్ దక్కుతుందని దూరంగా ఉన్నట్లు సమాచారం. గ్రేటర్ MLAలు ఆయనతో కలిసి రాలేదని కొంతమంది శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అటు హరీశ్ రావు తన తండ్రి మరణంతో ఏమీ చేయలేకపోయారు. ఇక కిందిస్థాయి కేడర్‌ను కవిత కంట్రోల్ చేసినట్లు తెలుస్తోంది. అంతాకలిసి అంటీముట్టనట్టుగా వ్యవహరించారు.

News November 14, 2025

RITESలో 252 పోస్టులకు నోటిఫికేషన్

image

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(<>RITES<<>>) 252 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, BE, B,Tech, B.ARCH , డిప్లొమా, ITI అర్హతగల అభ్యర్థులు NOV 17నుంచి DEC 5వరకు అప్లై చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌‌లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. వెబ్‌సైట్: https://www.rites.com/

News November 14, 2025

ఈ 3 కారణాలతోనే బిహార్‌లో ఓటమి: కాంగ్రెస్ లీడర్లు

image

బిహార్ ఎన్నికల్లో ఈసారైనా తమకు అధికారం దక్కుతుందని ఆశపడిన కాంగ్రెస్‌కు మరోసారి భంగపాటు తప్పలేదు. NDA భారీ విజయాన్ని కాంగ్రెస్ నాయకులు ఊహించలేదు. బీసీ, ఈబీసీలకు దగ్గరయ్యే క్రమంలో ఉన్నత వర్గాల ఓటు బ్యాంక్ కోల్పోవడం, గతంలో ఎన్డీయేలో ఉన్న అభ్యర్థులకు టికెట్లివ్వడం, SIR, ఓట్ చోరీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవ్వడం తమ ఓటమికి కారణాలుగా వారు భావిస్తున్నారు. కాగా NDA 200+ స్థానాల్లో లీడ్‌లో ఉంది.

News November 14, 2025

KCR ప్రచారం చేసుంటే…

image

TG: హుజూర్‌నగర్, నాగార్జునసాగర్, మునుగోడు ఉపఎన్నికల్లో KCR ప్రచారం చేయగా అప్పట్లో BRS గెలిచింది. దుబ్బాక, హుజూరాబాద్, కంటోన్మెంటు ఉపఎన్నికల్లో ఆయన ప్రచారం చేయలేదు. పార్టీ ఓడింది. ఈసారి ‘జూబ్లీ’ ప్రచారానికి వస్తారని నేతలు ఎదురుచూశారు. అయితే ఆయన పూర్తి బాధ్యతలు KTRకు అప్పగించారు. KTR ఎంతో శ్రమించినా అనుకున్న ఫలితం రాలేదు. KCR వచ్చుంటే గెలిచేదని BRS శ్రేణుల భావన.

News November 14, 2025

యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 4

image

18. నిద్రలో కూడా కన్ను మూయనిది?(జ.చేప)
19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు?(జ.అస్త్రవిద్యచేత)
20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?(జ.యజ్ఞం చేయుట వలన)
21. జన్మించినా ప్రాణం లేనిది?(జ.గుడ్డు)
22. రూపం ఉన్నా హృదయం లేనిది?(జ.రాయి)
23. మనిషికి దుర్జనత్వం ఎలా వస్తుంది?(జ.శరణుకోరిన వారిని రక్షించకపోతే)<<-se>>#YakshaPrashnalu<<>>

News November 14, 2025

IND vs SA టెస్ట్.. తొలిరోజు స్కోర్ ఎంతంటే?

image

ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌత్ ఆఫ్రికాపై తొలి టెస్టులో భారత్ చెలరేగింది. తొలుత బ్యాటింగ్ చేసిన SAను 159కే ఆలౌట్ చేసింది. మార్క్రమ్(31), ముల్డర్(24), టోనీ(24), రికెల్టన్(23) ఫర్వాలేదనిపించారు. బుమ్రా 5, సిరాజ్, కుల్దీప్ చెరో 2, అక్షర్ 1 వికెట్ తీశారు. బ్యాటింగ్‌లో జైస్వాల్(12) అవుటవ్వగా.. KL రాహుల్(13*), సుందర్(6*) క్రీజులో ఉన్నారు. తొలిరోజు ఆటముగిసే సరికి IND ఒక వికెట్ నష్టానికి 37 రన్స్ చేసింది.