News December 2, 2025

హనుమద్వ్రతం: పూజా విధానం ఇదే..

image

ఇంటి పూజా మందిరంలో బియ్యప్పిండితో ముగ్గు వేసి, దానిపై హనుమ చిత్రపటం పెట్టాలి. నదీ జలంతో నింపిన కలశాన్ని చిత్రపటం ఎదురుగా ఉంచి, అందులోకి ఆంజనేయుడిని ఆవాహన చేయాలి. తొలుత వినాయక పూజ, అనంతరం హనుమ స్తోత్రాలు, మంత్రాలు చదవాలి. గోధుమలతో చేసిన భక్ష్యాలను నైవేద్యంగా సమర్పించాలి. స్వామివారి వద్ద ఉంచిన 13 పోగుల దారాన్ని ధరించి ఆరోజంతా ఉపవాసం ఉండాలి. ఈ పూజా ఫలం 13 ఏళ్ల పాటు ఉంటుందని పండితులు చెబుతున్నారు.

News December 2, 2025

టీజీ అప్డేట్స్

image

* ఇందిరా మహిళా శక్తి స్కీమ్‌లో మహిళా సంఘాలకు మరో 448 బస్సులు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం. ఇప్పటికే 152 బస్సులు అందజేత
* రేపు లేదా ఎల్లుండి పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాంలో రామగుండం ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించనున్న ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) టీమ్.
* ఈ నెల 5 నుంచి 14 వరకు హైదరాబాద్‌లో యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్. పూర్తి వివరాలకు <>euffindia.com<<>>ను విజిట్ చేయండి

News December 2, 2025

ఈ సారి చలి ఎక్కువే: IMD

image

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.

News December 2, 2025

ఐఐసీటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

image

హైదరాబాద్‌లోని CSIR-<>IICT<<>> 10 టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు DEC 30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిజియోథెరపిస్ట్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, టెక్నీషియన్(జనరల్ నర్సింగ్/ANM), ఫార్మసీ టెక్నీషియన్, టెక్నీషియన్( క్యాటరింగ్&హాస్పిటాలిటీ) పోస్టులు ఉన్నాయి. నెలకు జీతం రూ.39,545 చెల్లిస్తారు. ట్రేడ్ టెస్ట్/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iict.res.in

News December 2, 2025

దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

image

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.

News December 2, 2025

ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: కేంద్రం

image

గత ఐదేళ్లలో దేశంలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని లోక్‌సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్‌తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు. అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.

News December 2, 2025

నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

image

AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. నిన్న మీ ప్రాంతంలో వర్షం పడిందా?

News December 2, 2025

హనుమద్వ్రతం ఎందుకు చేయాలి?

image

హనుమద్వ్రత ఫలితం కార్యసాధనకు తోడ్పడుతుందని, పనులను నిర్విఘ్నంగా పూర్తి చేస్తుందని పండితులు చెబుతున్నారు. ‘స్వామిని మనసారా స్మరిస్తే ధైర్యం చేకూరి కార్యోన్ముఖులు అవుతారు. సకల భయాలూ నశిస్తాయి. గ్రహ పీడలు, పిశాచ బాధలు దరిచేరవు. మానసిక వ్యాధులు తొలగిపోయి, మనసులో ప్రశాంతత, సానుకూలత నెలకొంటాయి. ఇది విజయాన్ని, శాంతిని, రక్షణను ఏకకాలంలో ప్రసాదించే శక్తివంతమైన వ్రతం’ అని అంటున్నారు. జై హనుమాన్!

News December 2, 2025

ఊటనేల దున్నినా, మట్టి పిసికినా, ఫలితం బురదే

image

ఊటనేల ఎప్పుడూ నీరు ఊరుతూ ఉండే, సహజంగానే చిత్తడిగా ఉండే భూమి. ఆ నేలలో ఎంత కష్టపడి నాగలితో దున్నినా లేదా చేతులతో మట్టిని పిసికి గట్టి పరచడానికి ప్రయత్నించినా దాని స్వభావం మారదు. చివరికి మిగిలేది గట్టిపడని, వ్యవసాయానికి పనికిరాని బురద మాత్రమే. కొన్నిసార్లు కొందరి మనుషుల స్వభావాన్ని ఎంత మార్చాలని ప్రయత్నించినా అవి మారవు. దాని వల్ల మన శ్రమే వృథా అవుతుందని ఈ సామెత చెబుతుంది.

News December 2, 2025

రాజీనామా వెనక్కి తీసుకున్న జకియా ఖానం!

image

AP: శాసనమండలి అభ్యర్థిత్వానికి రాజీనామా చేసిన ఆరుగురు MLCలను ఛైర్మన్ మోషేన్ రాజు నిన్న పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంగా జకియా ఖానం తన రాజీనామా వెనక్కి తీసుకున్నారు. పదవీకాలం 7నెలలే మిగిలి ఉందని, ఎన్నిక నిర్వహించడానికి టైం ఉండదని ఛైర్మన్ చెప్పడంతో రాజీనామా ఉపసంహరించుకున్నారు. మిగతా MLCలు కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి, సునీత, జయమంగళ, మర్రి రాజశేఖర్‌లు తమ రాజీనామాలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.