News November 24, 2025

సినిమా అప్డేట్స్

image

* రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా DEC 12న జైలర్-2 టీజర్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
* ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి’ సాంగ్‌కు ఇన్‌స్టా, యూట్యూబ్‌లో 500K+ రీక్రియేషన్స్ వచ్చినట్లు మేకర్స్ తెలిపారు.
* గోపీచంద్ మలినేని-బాలకృష్ణ మూవీలో తమన్నా స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు టాక్.
* ప్రశాంత్ నీల్-జూ.ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాలో ఎంట్రీ సీక్వెన్స్‌ కోసం భారీ సెట్స్ వేస్తున్నట్లు సమాచారం.

News November 24, 2025

చెరకు నరికిన తర్వాత ఆలస్యం చేస్తే..

image

చెరకు నరికిన తర్వాత రోజులు, గంటలు గడుస్తున్నకొద్దీ గడలలోని సుక్రోజ్ శాతం తగ్గుతుంది. ఈ గడలను గానుగాడించకుండా ఉంచితే.. నిల్వ కాలం పెరిగేకొద్దీ బరువు తగ్గుతుంది. చెరకు నరికిన తర్వాత 24 గంటలు ఆలస్యమైతే 1.5%, 48 గంటలు ఆలస్యమైతే 3%, 72 గంటలు ఆలస్యమైతే 5% వరకు దిగుబడిలో నష్టం జరుగుతుంది. అదే విధంగా రసనాణ్యతలోనూ 0.4%-0.6% వరకు క్షీణత కనిపిస్తుంది. నరికిన చెరకును నీడలో ఉంచితే ఈ నష్టం కొంత తగ్గుతుంది.

News November 24, 2025

పిల్లల ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా?

image

ఇదివరకు పిల్లల ఫొటోలు, వీడియోలు కుటుంబం వరకే పరిమితమయ్యేవి. కానీ సోషల్మీడియా వచ్చిన తర్వాత పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్నీ పేరెంట్స్ ప్రపంచంతో షేర్‌ చేసుకుంటున్నారు. అయితే ఇది సరికాదంటున్నారు నిపుణులు. పిల్లల ప్రైవసీని కాపాడటం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లల ఫొటోలు, వివరాలు షేర్ చేయడం వల్ల మార్ఫింగ్, ఐడెంటిటీ థెఫ్ట్ వంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు.

News November 24, 2025

అమెరికా వీసా రాలేదని..

image

ట్రంప్ కఠిన వీసా నిబంధనలు తెలుగు డాక్టర్ మరణానికి కారణమయ్యాయి. US వీసా రాలేదని గుంటూరుకు చెందిన డా.రోహిణి HYDలో ఆత్మహత్య చేసుకున్నారు. MBBS చేసిన ఆమె USలో PG చేసేందుకు J1 వీసాకు దరఖాస్తు చేశారు. HYDలోని US కాన్సులేట్‌లో జరిగిన చివరి రౌండ్ ఇంటర్వ్యూలో ‘శాశ్వతంగా USలోనే ఉండిపోవాలనే ఉద్దేశం’ అని కారణాన్ని చూపుతూ రిజెక్ట్ చేశారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన రోహిణి సూసైడ్ చేసుకున్నారు.

News November 24, 2025

DEC తొలి వారంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు!

image

AP: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి DEC తొలి వారంలో నియామక పత్రాలు అందజేసి, శిక్షణకు పంపిస్తామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చినట్లు MLC వేపాడ చిరంజీవి తెలిపారు. ఇదే విషయమై ఆమెకు లేఖ రాయగా సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. 6,100 కానిస్టేబుల్ పోస్టులకు ఈ ఏడాది జూన్‌లో మెయిన్స్ నిర్వహించి AUGలో ఫలితాలు ప్రకటించారు. ఉద్యోగాలకు ఎంపిక చేసినా ట్రైనింగ్ ప్రారంభం కాకపోవడంతో అభ్యర్థులు నిరాశతో ఉన్నారు.

News November 24, 2025

బీమా కంపెనీల విలీనం.. పార్లమెంటులో బిల్లు?

image

బ్యాంకుల తరహాలోనే ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీల విలీన ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. ఓరియంటల్, నేషనల్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌లను ఒకే కంపెనీగా చేయనున్నట్లు సమాచారం. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతారని తెలుస్తోంది. వాటిని ఆర్థికంగా మెరుగుపర్చడమే దీని ఉద్దేశం. 2018-19లో ఈ ప్రతిపాదన వచ్చినప్పటికీ మధ్యలోనే ఆగిపోయింది. అప్పట్లో వీటి బలోపేతానికి కేంద్రం ₹17450Cr కేటాయించింది.

News November 24, 2025

ఎయిమ్స్ కల్యాణి 172 పోస్టులకు నోటిఫికేషన్

image

పశ్చిమ బెంగాల్‌లోని <>ఎయిమ్స్ కల్యాణి <<>>172 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD, DNB, DM, MCH, MSc, M.biotech, M.Stat, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. డిసెంబర్ 26, 27 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://aiimskalyani.edu.in/

News November 24, 2025

తాంబూలం ఇలా ఇస్తేనే ఎక్కువ ఫలితం

image

☞ తమలపాకు చివర్లు, అరటి పండ్లు చివర్లు ఇచ్చేవారి వైపు ఉండకూడదు. లేకపోతే తాంబూలం ఇచ్చిన ఫలితం దక్కదని పండితులు చెబుతారు. ☞ తాంబూలంలో తమలపాకులు బేసి సంఖ్యలో ఉండేలా చూసుకోవాలి. 3, 5 ఆకులు ఇవ్వడం ఉత్తమం. ☞ తాంబూలంలో ఒకటి కన్నా ఎక్కువ పండ్లు పెట్టాలి. ☞ ఒకే రకానికి చెందిన ఒక్క పండు ఎప్పటికీ తాంబూలంలో పెట్టి ఇవ్వకూడదు. ☞ తాంబూలంలో దక్షిణ కూడా కచ్చితంగా ఉండాలి. అందుకే రూపాయి, 2 రూపాయల నాణేలు ఉంచాలి.

News November 24, 2025

ఉక్రెయిన్ కనీస కృతజ్ఞత చూపట్లేదు: ట్రంప్

image

రష్యా-ఉక్రెయిన్ వార్ ఆపేందుకు US ప్రయత్నిస్తున్నప్పటికీ ‘కీవ్’ కనీస కృతజ్ఞత చూపట్లేదని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు రష్యా నుంచి యూరప్ ఆయిల్ కొంటూనే ఉందని మండిపడ్డారు. US, ఉక్రెయిన్‌లో బలమైన నాయకత్వం ఉండి ఉంటే ఈ యుద్ధం జరిగేది కాదంటూ జెలెన్‌స్కీ, బైడెన్‌‌లను SMలో విమర్శించారు. అయితే US చేస్తున్న కృషిపై కృతజ్ఞత ఉందని జెలెన్‌స్కీ తెలిపారు. కాగా ట్రంప్ <<18354785>>‘పీస్ ప్లాన్‌’పై<<>> చర్చలు కొనసాగుతున్నాయి.

News November 24, 2025

మెనోపాజ్‌లో ఎముకలు జాగ్రత్త

image

ప్రతి స్త్రీ జీవితంలో మెనోపాజ్ స్థితి ఒకటి. అయితే ఈ క్రమంలో మహిళల శరీరంలో ఎన్నో మార్పులొస్తాయి. ముఖ్యంగా క్యాల్షియం, డి విటమిన్‌ లోపాలు ఎముకల్ని బలహీనంగా మారుస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి మెనోపాజ్‌ దశలో స్త్రీలు తమ రోజువారీ ఆహారంలో సుమారు 1200 మి.గ్రా క్యాల్షియంను అదనంగా తీసుకోవాలి. అలానే, పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లు కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే డైట్‌ని తీసుకోవాలంటున్నారు.