News November 26, 2025

ఏడాదికి లక్ష మంది అగ్నివీర్‌ల నియామకానికి ప్లాన్!

image

రాబోయే 4 ఏళ్లలో ఏడాదికి లక్ష మంది అగ్నివీర్‌లను నియమించుకోవాలని ఆర్మీ ప్లాన్ చేస్తోంది. దీని ద్వారా 1.8 లక్షలుగా ఉన్న సైనిక కొరతను అధిగమించాలని భావిస్తోంది. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా 2022 నుంచి ప్రతి ఏడాది 45వేల నుంచి 50వేల మంది అగ్నివీర్‌లను ఆర్మీ నియమిస్తోంది. కరోనా కారణంగా 2020, 21లో రిక్రూట్‌మెంట్లు నిలిపివేయడం, అప్పుడే ఏడాదికి 60వేల నుంచి 65వేల మంది రిటైర్ కావడంతో సైనికుల కొరత ఏర్పడింది.

News November 26, 2025

3,058 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

రైల్వేలో 3,058 అండర్ గ్రాడ్యుయేట్ నాన్ టెక్నికల్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంటర్ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. ఫీజు చెల్లించడానికి NOV 29 వరకు ఛాన్స్ ఉంది. వయసు18- 30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. SC,ST, PwBD, మహిళలకు రూ.250. www.rrbcdg.gov.in/ *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News November 26, 2025

110 పోస్టులు… అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

SEBIలో 110 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి మాస్టర్ డిగ్రీ / PG డిప్లొమా, LLB, BE, బీటెక్, CA, CFA, MCA, MSC(CS), MA( హిందీ/ ఇంగ్లిష్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. ఫేజ్ 1 రాత పరీక్ష JAN 10న, ఫేజ్ 2 రాత పరీక్ష FEB 21న నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ తేదీని తర్వాత ప్రకటిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC,ST, PwBDలకు రూ.100. వెబ్‌సైట్: sebi.gov.in

News November 26, 2025

ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం!

image

ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ, హక్కులు, అవకాశాలు, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు లభించడానికి కారణం రాజ్యాంగం. 200ఏళ్లు బ్రిటిష్ పాలనలో మగ్గిన ప్రజలకు మహోన్నత శక్తినిచ్చింది ఈ రాజ్యాంగమే. అంబేడ్కర్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ రాజ్యాంగాన్ని రచించింది. దీనికి 1949 NOV 26న ఆమోదం లభించింది. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా 2015లో NOV 26న రాజ్యాంగ దినోత్సవంగా కేంద్రం ప్రకటించింది. అప్పటి నుంచి ఏటా నిర్వహిస్తున్నారు.

News November 26, 2025

ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం!

image

ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ, హక్కులు, అవకాశాలు, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు లభించడానికి కారణం రాజ్యాంగం. 200ఏళ్లు బ్రిటిష్ పాలనలో మగ్గిన ప్రజలకు మహోన్నత శక్తినిచ్చింది ఈ రాజ్యాంగమే. అంబేడ్కర్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ రాజ్యాంగాన్ని రచించింది. దీనికి 1949 NOV 26న ఆమోదం లభించింది. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా 2015లో NOV 26న రాజ్యాంగ దినోత్సవంగా కేంద్రం ప్రకటించింది. అప్పటి నుంచి ఏటా నిర్వహిస్తున్నారు.

News November 26, 2025

కోచ్ చెప్తారు.. స్కోర్ చేయాల్సింది ప్లేయర్లే: సురేశ్ రైనా

image

ప్లేయర్లు సరిగ్గా ఆడకుంటే కోచ్‌ను నిందించడం కరెక్ట్ కాదని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అన్నారు. ‘ప్లేయర్లు ఎదుర్కొంటున్న సమస్యలను కోచ్‌కు చెప్పాలి. వాళ్లు బాగా ఆడితే కోచ్‌కు ప్రశంసలు దక్కుతాయి. టీమ్ బాగా ఆడకుంటే కోచ్‌ను తొలగించాల్సిన అవసరం లేదు. ప్లేయర్లకు సలహాలు, మద్దతు ఇవ్వడం కోచ్ పని. స్కోర్ చేయాల్సింది ప్లేయర్లే. కోచ్ గంభీర్ తన పని కరెక్ట్‌గా చేస్తున్నారు’ అని రైనా చెప్పారు.

News November 26, 2025

కోచ్ చెప్తారు.. స్కోర్ చేయాల్సింది ప్లేయర్లే: సురేశ్ రైనా

image

ప్లేయర్లు సరిగ్గా ఆడకుంటే కోచ్‌ను నిందించడం కరెక్ట్ కాదని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అన్నారు. ‘ప్లేయర్లు ఎదుర్కొంటున్న సమస్యలను కోచ్‌కు చెప్పాలి. వాళ్లు బాగా ఆడితే కోచ్‌కు ప్రశంసలు దక్కుతాయి. టీమ్ బాగా ఆడకుంటే కోచ్‌ను తొలగించాల్సిన అవసరం లేదు. ప్లేయర్లకు సలహాలు, మద్దతు ఇవ్వడం కోచ్ పని. స్కోర్ చేయాల్సింది ప్లేయర్లే. కోచ్ గంభీర్ తన పని కరెక్ట్‌గా చేస్తున్నారు’ అని రైనా చెప్పారు.

News November 26, 2025

కుకుంబర్ మొజాయిక్ వైరస్‌తో మిరప పంటకు ముప్పు

image

కుకుంబర్ మొజాయిక్ వైరస్ సోకిన మిరప మొక్కలు గిడసబారి కనిపిస్తాయి. ఎదుగుదల లోపిస్తుంది. ఆకుల్లో పత్రహరితం కోల్పోవడంతో పాటు ఆకులు ఆకారం మారిపోయి, కొనలు సాగి కనిపిస్తాయి. ఈ వైరస్ బారినపడిన మొక్కల్లో పూత, కాపు ఉండదు. ఈ వైరస్ నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా థయోమిథాక్సామ్ 0.2 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3ml లేదా అసిటామిప్రిడ్ 0.2 గ్రాముల్లో ఒక దానిని కలిపి పిచికారీ చేయాలి.

News November 26, 2025

అత్తింటి వేధింపులతో అల్లుడి ఆత్మహత్య

image

TG: అత్తింటి వేధింపులతో కోడలు ఆత్మహత్య చేసుకోవడం చూస్తుంటాం. కానీ మెదక్(D) వెల్దుర్తిలో అల్లుడు సూసైడ్ చేసుకున్నాడు. HYD జగద్గిరిగుట్టకు చెందిన హరిప్రసాద్‌(32)కు 2022లో పూజతో వివాహమైంది. అప్పటి నుంచి వేరు కాపురం పెట్టాలని అత్తమామలు వేధిస్తున్నారు. ఈనెల 2న పెద్దల పంచాయితీలోనూ దూషించారు. తీవ్ర మనస్తాపానికి గురైన అతడు ఈనెల 18న పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. భార్య, అత్తమామలపై కేసు నమోదైంది.

News November 26, 2025

పీరియడ్స్‌లో బ్లాక్‌ బ్లెడ్‌ వస్తోందా?

image

పీరియడ్స్‌లో కొందరిలో డార్క్ / బ్లాక్ బ్లడ్ డిశ్ఛార్జ్ కనబడుతుంది. అయితే దీనికి కారణం ఆహారం, జీవనశైలిలో చోటు చేసుకున్న మార్పులే అని నిపుణులు చెబుతున్నారు. అలాగే గర్భాశయం నుంచి వచ్చే పాత రక్తం కావొచ్చు. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్, గర్భాశయ క్యాన్సర్, టాంపోన్స్‌, కాపర్‌ టీ వల్ల కూడా ఇలా కనిపిస్తుంది. ఏదేమైనా పీరియడ్ బ్లడ్లో ఏదైనా అసాధారణంగా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.