News November 16, 2025

మరోసారి బిహార్ CMగా నితీశ్‌!

image

జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ మరోసారి బిహార్ CMగా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 19 లేదా 20న ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. PM మోదీ షెడ్యూల్‌ బట్టి తుది తేదీ నిర్ణయించనున్నారు. 89 సీట్లు గెలిచిన బీజేపీకి 15/16, 85 స్థానాల్లో విజయం సాధించిన JDUకు 14, లోక్ జన్‌శక్తి పార్టీకి 3 చొప్పున మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. కాగా నితీశ్ ఇప్పటివరకు 9 సార్లు CMగా ప్రమాణం చేశారు. 20 ఏళ్లు పదవిలో ఉన్నారు.

News November 16, 2025

పొద్దుతిరుగుడు సాగు – విత్తన శుద్ధితో మేలు

image

ఏ పంటకైనా చీడపీడల ముప్పు తగ్గాలంటే విత్తే ముందు విత్తనశుద్ధి తప్పకుండా చేయాలి. పొద్దుతిరుగుడు పంటకు నెక్రోసిస్ వైరస్ తెగులు సమస్యను అధిగమించడానికి కిలో విత్తనానికి 3 గ్రా. థయోమిథాక్సామ్ లేదా 5ml ఇమిడాక్లోప్రిడ్‌తో విత్తనశుద్ధి చేయాలి. అలాగే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు ఉద్ధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 2 గ్రా. ఇప్రోడియాన్ 25%+కార్బండాజిమ్ 25%తో విత్తనశుద్ధి చేసుకుంటే మంచిది.

News November 16, 2025

లంచ్: 10కే 2 వికెట్లు డౌన్

image

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో టీమ్ ఇండియా తడబడుతోంది. లంచ్ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 10 రన్స్ చేసింది. భారత్ విజయానికి మరో 114 రన్స్ అవసరం. క్రీజులో సుందర్, జురేల్ ఉన్నారు. జైస్వాల్ (0), కేఎల్ రాహుల్ (1) నిరాశపరిచారు.

News November 16, 2025

పెరుగుతో అందం పెంచేయండి..

image

చర్మ సమస్యలను తగ్గించడానికి పెరుగు పరిష్కారం చూపుతుంది. * అరటిపండు, తెల్లసొన, శనగపిండి, పెరుగు కలిపి ముఖానికి రాయాలి. దీనివల్ల మోము మృదువుగా మారుతుంది. * పెరుగు, మెంతి పొడి, బాదం నూనె, గులాబీ నీళ్లు కలిపి ముఖానికి పూతలా వేసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. * పెరుగులో రెండు చెంచాల ఓట్స్ పొడి వేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఓట్స్ చర్మానికి క్లెన్సర్‌లా పనిచేసి మృత కణాలు, మురికినీ తొలగిస్తాయి.

News November 16, 2025

అల్లు అర్జున్-బోయపాటి కాంబోలో మూవీ?

image

అల్లు అర్జున్-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. బన్నీ ప్రస్తుతం అట్లీ సినిమాలో నటిస్తున్నారు. ఈ షూటింగ్ అనుకున్నదానికంటే ముందే పూర్తయ్యే ఛాన్స్ ఉండటంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరో ప్రాజెక్టును చేపట్టాలని అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే బోయపాటితో చర్చలు జరిగాయని సమాచారం. వీరిద్దరి కాంబోలో గతంలో సరైనోడు మూవీ వచ్చింది.

News November 16, 2025

ONGCలో 2,623 అప్రెంటిస్‌ పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ONGCలో 2,623 అప్రెంటిస్ ఖాళీలకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ పాసై, 18-24 ఏళ్లు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంటుంది. అభ్యర్థులను విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ongcindia.com/

News November 16, 2025

హనుమాన్ చాలీసా భావం – 11

image

లాయ సంజీవన లఖన జియాయే। శ్రీ రఘువీర హరషి ఉరలాయే॥ సంజీవని తెచ్చి హనుమంతుడు లక్ష్మణుడికి ప్రాణం పోశాడు. ఈ ఘనకార్యాన్ని చూసిన రాముడు ఆనందంతో ఆయనను హృదయానికి హత్తుకున్నాడు. మనం నిస్వార్థంగా, అంకితభావంతో, ధైర్యంగా ఇతరులకు సహాయం చేసినప్పుడు, ఆ శ్రమకు తగిన గౌరవం, ఉన్నతమైన ప్రేమ, అపారమైన ఆనందం లభిస్తాయి. గొప్ప పనులు చేసిన వారిని లోకం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆ దేవుడు కూడా! <<-se>>#HANUMANCHALISA<<>>

News November 16, 2025

నిర్వాహకుడితోనే ‘iBOMMA’ సైట్ క్లోజ్ చేయించారు!

image

ఐబొమ్మ, బప్పంటీవీ సైట్లను వాటి నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే పోలీసులు క్లోజ్ చేయించారు. ‘నా వద్ద కోట్ల మంది డేటా ఉంది. ఈ వెబ్‌సైట్ మీద ఫోకస్ చేయకండి’ అని గతంలో అతడు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఎక్కడ ఉన్నాడో ఎవరూ గుర్తించకుండా జాగ్రత్త పడినప్పటికీ సవాల్‌ను స్వీకరించిన పోలీసులు అతడిని పట్టుకున్నారు. లాగిన్ వివరాలతో సైట్‌ను మూసివేయించారు. తెలంగాణ సైబర్ పోలీసుల సత్తా ఏంటో చూపించారు.

News November 16, 2025

స్త్రీలు మెట్టలు ఎందుకు ధరించాలో తెలుసా?

image

స్త్రీలు కాలి వేళ్లకు మెట్టెలు ధరించడం వెనుక శాస్త్రీయ కారణాలున్నాయి. మెట్టెలు ధరించే వేళ్ల నుంచి గుండె వరకు ఓ నరం గర్భాశయం గుండా వెళ్తుంది. మెట్టెలు ధరించడం వలన ఆ నరం ఉత్తేజితమై గర్భాశయం బలపడుతుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది. నెలసరి చక్రాన్ని నియంత్రించి, గర్భధారణకు మంచి చేస్తుంది. అలాగే వెండి మెట్టెలు భూమి నుంచి శక్తిని గ్రహించి, స్త్రీ దేహంలో సానుకూలతను పెంచుతుంది.

News November 16, 2025

సౌతాఫ్రికా ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

image

కోల్‌కతాలో టీమ్ ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో సౌతాఫ్రికా 153 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బవుమా 55* పరుగులతో రాణించారు. జడేజా 4, కుల్దీప్, సిరాజ్ చెరో 2, బుమ్రా, అక్షర్ ఒక్కో వికెట్ తీశారు. ఈ టెస్టులో భారత్ గెలవాలంటే 124 రన్స్ చేయాలి.