News May 8, 2025

సందీప్ శర్మ స్థానంలో దక్షిణాఫ్రికా పేసర్

image

గాయంతో దూరమైన సందీప్ శర్మ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ మరో ప్లేయర్‌ను రీప్లేస్ చేసింది. దక్షిణాఫ్రికా పేసర్ బర్జర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది. గత సీజన్‌లోనూ RR తరఫున ఆడిన బర్జర్ 6 మ్యాచుల్లో 7 వికెట్లు తీశారు. కాగా సందీప్ శర్మ వేలి గాయంతో దూరమయ్యారు. మరో ప్లేయర్ నితీశ్ రాణా స్థానంలో SA బ్యాటర్ ప్రిటోరియస్‌ను తీసుకుంది.

News May 8, 2025

అమెరికా జర్నలిస్టు మృతికి సిందూర్‌తో న్యాయం

image

జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ఆపరేషనల్ హెడ్ అబ్దుల్ రౌఫ్ అజార్ హతం అంతర్జాతీయ సమాజ హితానికై చేసిన చర్యగా భారత ఆర్మీ వర్గాలు పేర్కొంటున్నాయి. 1999లో IC 814 హైజాక్ సూత్రధారి రౌఫ్ ఆ తర్వాత భారత్ సహా ప్రపంచంపై పలు దాడులకు తెగబడ్డాడు. Wall Street Journal (USA) జర్నలిస్టు డేనియల్ పర్ల్ కిడ్నాప్, హత్య ఇందులో ఒకటి. నాడు ప్రపంచమే దిగ్భ్రాంతి చెందిన ఈ దారుణానికి సిందూర్‌తో నేడు న్యాయం జరిగిందని ఆర్మీ చెబుతోంది.

News May 8, 2025

అధికారుల పేర్లు రాసి పెట్టుకోండి: కార్యకర్తలకు జగన్ సూచన

image

AP: తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే అధికారులను వదిలే ప్రసక్తే లేదని YCP అధినేత జగన్ మరోసారి తేల్చి చెప్పారు. ‘ఎవరినీ వదిలిపెట్టం, సినిమా చూపిస్తాం. తప్పు చేసిన అధికారుల పేర్లను రాసి పెట్టుకోండి. సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి శిక్షిస్తాం. చంద్రబాబు విలువలు లేని పాలిటిక్స్ చేస్తున్నారు. రాజకీయాలే సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారు’ అని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో జగన్ వ్యాఖ్యానించారు.

News May 8, 2025

భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం: అల్‌ఖైదా

image

భారత్ ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటోందని, తాము కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఉగ్రసంస్థ అల్‌ఖైదా హెచ్చరించింది. ‘ఎన్నో దశాబ్దాలుగా ముస్లింలు, ఇస్లాంపై భారత్ దాడులు చేస్తోంది. ఉపఖండంలోని ముస్లింలందరూ చేతులు కలిపి ఈ ‘జిహాద్’లో పాల్గొనాలి. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మనపై సైనిక, రాజకీయ, సాంస్కృతిక దాడి చేస్తోంది. అల్లా సాయంతో భారత్‌పై పోరాటం చేస్తాం. ప్రతీకారం తీర్చుకుంటాం’ అని పేర్కొంది.

News May 8, 2025

‘ఆపరేషన్ సింధూర్’పై కన్నేసిన నిర్మాణ సంస్థలు!

image

పాకిస్థాన్, POKలోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ పేరు ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది. ఈ పాపులారిటీని ఉపయోగించుకునేందుకు వ్యాపార సంస్థలతో పాటు సినీ నిర్మాణ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ‘ఆపరేషన్ సింధూర్’ టైటిల్ కోసం 10కిపైగా ప్రొడక్షన్ హౌజ్‌లు పోటీ పడుతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. వీటిలో టీ-సిరీస్, జీ స్టూడియోస్ వంటి బడా నిర్మాణ సంస్థలు ఉన్నట్లు పేర్కొన్నాయి.

News May 8, 2025

ఒకే సమయంలో రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ, రోహిత్!

image

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంలో మహేంద్ర సింగ్ ధోనీని ఫాలో అయినట్లు తెలుస్తోంది. ఆయన కూడా సైలెంట్‌గా సాయంత్రం సమయంలో SM ద్వారా వీడ్కోలు పలికారు. అయితే, ధోనీ 2020లో ఏ క్షణాన రిటైర్మెంట్ ప్రకటించారో సరిగ్గా నిన్న అదే సమయానికి(19:29 IST) రోహిత్ కూడా తన టెస్ట్ కెరీర్‌కు ముగింపు పలికారు. ఈ ఇద్దరూ సొంత గడ్డపై వాంఖడే మైదానంలో, విదేశీ గడ్డపై మెల్బోర్న్‌‌లో తమ చివరి టెస్ట్ ఆడారు.

News May 8, 2025

పిల్లలకు ‘సింధూర్’ అని పేరు పెడుతున్నారు!

image

‘ఆపరేషన్ సింధూర్’ను భారతీయులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎంతో మంది భారతీయుల ప్రాణాలను బలిగొన్న నరరూప రాక్షసులైన ఉగ్రవాదులను ఈ మిషన్ ద్వారా ఏరివేయడంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మిషన్‌ ఎప్పటికీ గుర్తుండిపోయేలా కొందరు తమ పిల్లలకు ఈ పేరు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా బిహార్‌లోని కతిహార్ జిల్లాలో కుందన్ కుమార్ అనే వ్యక్తి తన కుమార్తెకు ‘సింధూర్’ అని నామకరణం చేసి దేశభక్తి చాటాడు.

News May 8, 2025

భారత్‌లోని 15 నగరాల్లో దాడులకు పాక్ యత్నం!

image

భారత్‌లోని 15 నగరాల్లోని మిలటరీ స్థావరాలపై పాకిస్థాన్ దాడులు చేసేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు జాతీయ మీడియా పేర్కొంది. చైనాకు చెందిన BVR మిస్సైల్స్‌తో దాడులు చేసేందుకు యత్నించగా, భారత్‌లోని S400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంది. జమ్మూ, శ్రీనగర్, అమృత్‌సర్, పఠాన్ కోట్, బటిండా, లుధియానా, జలంధర్, చండీగఢ్, అవంతిపుర, భుజ్, ఫలోడి పాటు పలు నగరాలపై దాడులకు పాక్ యత్నించింది.

News May 8, 2025

స్పోర్ట్స్ జర్నలిజంపై రోహిత్ శర్మ అసహనం

image

భారత్‌లో క్రికెట్ కామెంట్రీ, స్పోర్ట్స్ జర్నలిజంపై రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేశారు. వ్యూస్, లైక్స్ కోసం వాస్తవానికి మసాలా జోడించి చూపిస్తున్నట్లు తెలిపారు. ఆట నైపుణ్యాలపై చాలా కొద్ది సందర్భాల్లోనే చర్చ జరుగుతోందని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఓ ప్లేయర్ సరిగా ఆడకపోతే అతను ఆటలో ఎక్కడ తప్పు చేస్తున్నాడో చెప్పకుండా పర్సనల్ టార్గెట్ చేయడం సరికాదన్నారు. AUSలో క్రికెట్ కామెంట్రీ బాగుంటుందని చెప్పారు.

News May 8, 2025

కుప్పకూలిన పాక్ స్టాక్ మార్కెట్లు!

image

భారత్ కన్నెర్రతో వణుకుతున్న పాక్‌కు ఆర్థికంగా మరో దెబ్బ పడింది. భారత్ నుంచి వరుస దాడులు జరగొచ్చన్న భయాలు వ్యాప్తి చెందడంతో ఆ దేశ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఏకంగా 7వేల పాయింట్లు డౌన్ కావడంతో కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజీని సర్కారు మూసేసింది. ఆ దేశం కోలుకోవడం ఇప్పట్లో కష్టమేనని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు యుద్ధభయాలున్నా భారత స్టాక్ మార్కెట్ పెద్దగా కుదుపునకు లోనవ్వకపోవడం విశేషం.