India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎత్తైన బిల్డింగులు ఉండే హాంకాంగ్లో పేదరికం ఊపిరి ఆడనీయడం లేదు. ఆకాశాన్నంటే అద్దెలు చెల్లించలేక సుమారు 2 లక్షల మంది ప్రజలు కేవలం 16 చ.అ ‘కఫిన్ హోమ్స్’లో బతుకులీడుస్తున్నారు. వీటికి నెలకు ₹20-40 వేల అద్దె. కనీసం కాళ్లు చాచుకోవడానికి, నిలబడడానికి కూడా వీలులేని ఈ ఇరుకు గదుల్లోనే వంట, టాయిలెట్ అన్నీ. ఒకే అంతస్తును రెండుగా మార్చి, ప్లైవుడ్తో విభజించి ఇలాంటి రూమ్లను తయారు చేస్తున్నారు.

రామ్ చరణ్, బుచ్చిబాబు క్రేజీ కాంబోలో వస్తున్న‘పెద్ది’ నాన్-థియేట్రికల్ బిజినెస్లో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ ఏకంగా ₹130 కోట్లకు కైవసం చేసుకున్నట్లు సమాచారం. ఆడియో హక్కులు మరో ₹18 కోట్లు పలికినట్లు టాక్. ఏప్రిల్ 30న విడుదల కానున్న ఈ చిత్రం శాటిలైట్ హక్కులతో కలిపి రిలీజ్కు ముందే ₹150 కోట్లకు పైగా వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

వాతావరణ పరిస్థితులు, పురుగులు, పండు ఈగ, ఇతర కీటకాల వల్ల మామిడి పంటకు నష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకే నిమ్మ లేదా కోడి గుడ్డు సైజుకు మామిడి కాయ వచ్చాక ‘ఫ్రూట్ కవర్స్’ కట్టాలి. దీని వల్ల చెట్టుపై రసాయనాలు పిచికారీ చేసినా అవి పండుపై పడవు. అలాగే కవర్ కట్టిన కాయపై ఎలాంటి మచ్చలు, చీడపీడల లక్షణాలు కనిపించవు. ఇతర కాయల కంటే ఎక్కువ బరువు పెరిగి మంచి ధర పలుకుతాయి. ఈ కవర్స్ వాటర్ ప్రూఫ్. నీరు పడినా ఏమీ కావు.

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<

AP: ఒకప్పుడు వృథాగా పారబోసిన వాము పొట్టు ఇప్పుడు రైతులకు సిరులు కురిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా కర్నూలు మార్కెట్ యార్డులో క్వింటా వాము పొట్టు రూ.15,468 ధర పలికింది. ఉత్తరాదిన దీనికి భారీ డిమాండ్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఔషధ తయారీ సంస్థలు వివిధ అవసరాల కోసం ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తున్నట్లు పేర్కొంటున్నారు. వాముకు ఉండే ఘాటైన సువాసన, ఔషధ గుణాలు పొట్టులో కూడా ఉంటాయని అంటున్నారు.

260 ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయనుంది. పోస్టును బట్టి డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీతోపాటు శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అవివాహితులు మాత్రమే అర్హులు. జీతం ₹1.25-1.5 లక్షలు. ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు వెబ్సైట్: https://www.joinindiannavy.gov.in/

T20 WC సూపర్-8కు ముందు శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. బౌలర్ మతీశ పతిరణ టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. ఈ నెల 16న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో తొడ కండరాలు పట్టేయడంతో మైదానాన్ని వీడారు. అతడు కోలుకోవడానికి 4-5 వారాలు పట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. దీంతో దిల్షాన్ మధుశంకను జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు IPLలోనూ పతిరణ ఆడటం డౌటేనని తెలుస్తోంది. అతడిని KKR ₹18 కోట్లకు <<18581979>>కొనుగోలు<<>> చేసింది.

సాధారణంగా మన చర్మం విడుదల చేసే నూనెలు, చెమట, బ్యాక్టీరియాతో పాటు మృతకణాలూ దిండు పైకి చేరతాయి. దిండు కవర్లను తరచూ మార్చకపోతే మొటిమల ముప్పు ఉంటుంది. అలాగే మేకప్ తొలగించకపోవడం, బోర్లా పడుకోవడం, గదిలో ఉష్ణోగ్రత, హ్యుమిడిటీ ఎక్కువగా ఉండటం వల్ల కూడా చర్మం ఎక్కువ సీబమ్ను ఉత్పత్తి చేసి మొటిమలకు కారణమవుతాయి. కాబట్టి బెడ్రూంను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

AP: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ నెల 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. వీటి ప్రభావంతో ఈ నెల 21 నుంచి 3 రోజులపాటు రాయలసీమలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 22వ తేదీ నుంచి 2 రోజులపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పడతాయని చెప్పింది. రానున్న 24 గంటల్లో కోస్తాలోని పలు జిల్లాల్లో పొగ మంచు కురుస్తుందని, ఎండ స్వల్పంగా పెరుగుతుందని పేర్కొంది.

నాలుగేళ్లుగా ఉక్రెయిన్తో చేస్తున్న యుద్ధం కారణంగా రష్యాలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దోసకాయలు కిలో 300 రూబల్స్(₹355) చొప్పున అమ్ముతున్నారని, కొన్నిచోట్ల 2, 3 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు నెటిజన్లు వాపోతున్నారు. ప్రస్తుతం మాంసంతో సమానంగా ధర ఉంటోందని చెబుతున్నారు. దోసకాయలే ఇప్పుడు తమకు బంగారంలా మారాయని సెటైర్లు వేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.