India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాకిస్థాన్ మిస్సైల్ దాడులకు ప్రతీకారంగా భారత్ ఈ ఉదయం పాక్పై విరుచుకుపడింది. ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, వ్యవస్థలే లక్ష్యంగా అటాక్ చేసింది. ఈ క్రమంలో లాహోర్లోని HQ-9 గగనతల రక్షణ వ్యవస్థలు భారీగా ధ్వంసమయ్యాయి. వాటిని పాకిస్థాన్ చైనా నుంచి కొనుగోలు చేసింది. సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్న పాక్కు సరైన సమాధానమిచ్చేందుకు భారత్ ఈ ఆపరేషన్ నిర్వహించింది.
AP: ముంబై నటి జెత్వానీ కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఐపీఎస్లు విశాల్ గున్నీ, కాంతిరాణా, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణలపై తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలని పోలీస్ శాఖను ఆదేశించింది. నిందితుల క్వాష్ పిటిషన్లపై విచారణను జూన్ 30కి వాయిదా వేసింది. కాగా ఇదే కేసులో సీనియర్ ఐపీఎస్ PSR ఆంజనేయులు అరెస్టయిన విషయం తెలిసిందే.
భారత్-పాక్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో UGC అన్ని పరీక్షలను రద్దు చేసినట్లు ఓ ప్రకటన వైరలవుతోంది. విద్యార్థులను వెంటనే ఇళ్లకు పంపించాలని అందులో ఉంది. దీంతో దేశవ్యాప్తంగా UGC పరిధిలోని కాలేజీల యాజమాన్యాలు గందరగోళానికి లోనయ్యాయి. ఈక్రమంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్పందించింది. ఇది తప్పుడు సమాచారమని, ఇలాంటి ప్రకటన తాము చేయలేదని స్పష్టం చేసింది. విద్యార్థులు ఇలాంటివి నమ్మొద్దని సూచించింది.
రైళ్లలో అధిక ధరలకు ఫుడ్ అమ్ముతున్నారని కంప్లైంట్ చేసిన వ్యక్తిపై క్యాటరింగ్ సిబ్బంది <<16344275>>దాడి<<>> చేసిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఇండియన్ రైల్వే స్పందించింది. ‘ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాం. క్యాటరర్పై రూ.5లక్షలు జరిమానా విధించాం. కథువా రైల్వే పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. నిశితంగా ఈ కేసును పరిశీలిస్తాం. దర్యాప్తు ఆధారంగా వీరిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ట్వీట్ చేసింది.
AP: రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. దీనిపై తీర్మానం చేసిన మంత్రివర్గం దానిని త్వరలోనే కేంద్రానికి పంపనుంది. అలాగే ఏపీ పునర్విభజన చట్టంలో పలు సవరణలను ప్రతిపాదించనుంది. ఆ చట్టంలోనే రాజధానిగా అమరావతి పేరును మెన్షన్ చేయాలని సూచించనుంది. కాగా ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టిన కేంద్రానికి క్యాబినెట్ అభినందనలు తెలిపింది.
AP: లిక్కర్ స్కామ్పై CBIతో దర్యాప్తు చేయించాలని వైసీపీ నేత కేశినేని నాని CM చంద్రబాబును కోరారు. ‘రూ.3,600 కోట్ల లిక్కర్ స్కామ్లో మీ పార్టీ MP కేశినేని చిన్ని వైఖరి సరిగ్గా లేదు. ఆ కేసులో<<16344826>> ఆయన సీబీఐ దర్యాప్తు చేయాలని<<>> కోరడం, మీ ప్రభుత్వమే చేయిస్తున్న సిట్ దర్యాప్తుపై అపనమ్మకాన్ని సూచిస్తోంది. సిట్ సమగ్రత ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలి’ అని డిమాండ్ చేశారు.
ఉత్తరాఖండ్లో ఈ ఉదయం <<16344592>>హెలికాప్టర్<<>> క్రాషై ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మరణించిన వారిలో ఏపీకి చెందిన వేదవతి కుమారి, విజయారెడ్డి ఉన్నట్లు గుర్తించారు. వేదవతి కుమారి అనంతపురం ఎంపీ లక్ష్మీనారాయణ సోదరి. వేదవతి భర్త భాస్కర్కు ప్రమాదంలో గాయాలయ్యాయి. ఆయన్ను రిషికేశ్ ఎయిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
AP: PM మోదీని ఓ బలమైన సంకల్పమని కొనియాడుతూ Dy.CM పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఆయన కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కామాఖ్య నుంచి ద్వారకా వరకు తన ఇల్లుగా భావిస్తారని పేర్కొన్నారు. తనకు ఇల్లు లేకపోయినా ఆవాస్ యోజన ద్వారా కోట్లాది కుటుంబాలకు మోదీ సొంత ఇళ్లను అందించారని తెలిపారు. తన ఆశ్రమ జీవితంలో మోదీని ‘అనికేత్’ అని పిలిచేవారని, దానికి అర్థం ‘ఇల్లు లేని వ్యక్తి’ అని పేర్కొన్నారు.
బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ ఫస్ట్ లుక్ను మే 1-4 మధ్య జరగనున్న వరల్డ్ ఆడియో విజువల్, ఎంటర్టైన్మెంట్ సమ్మిట్(WAVES)లో రిలీజ్ చేయనున్నారు. సాయి పల్లవి, రణ్బీర్ కపూర్ సీతారాములుగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ మూవీపై ఫ్యాన్స్లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్ర పార్ట్-1ను వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇవాళ శ్రీలంక, దక్షిణాఫ్రికా, భారత్ మహిళా జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. లంక వేదికగా జరిగే ఈ టోర్నీలో అతిథ్య జట్టుతో నేడు టీమ్ ఇండియా తలపడనుంది. ఉ.10 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. WPLలో సత్తా చాటి జట్టుకు ఎంపికైన కష్వీ ఎంట్రీ ఇచ్చే అవకాశముంది. కాగా మ్యాచులు ఫ్యాన్ కోడ్లో ప్రసారం కానున్నాయి.
Sorry, no posts matched your criteria.