India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
NTR, కొరటాల శివ కాంబోలో వచ్చిన ‘దేవర’కు కొనసాగింపుగా తీసే పార్ట్-2 అటకెక్కినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్తో డ్రాగన్, త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ మూవీ తీసేందుకు NTR కమిట్ అయ్యారని, దీంతో దేవర-2 పట్టాలెక్కడం కష్టమేనని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే మూవీ రద్దు విషయమై హీరో, దర్శక నిర్మాతల మధ్య చర్చలు జరిగాయట. మరోవైపు నాగచైతన్యతో కొరటాల కొత్త స్క్రిప్ట్తో మూవీ తెరకెక్కిస్తారని సమాచారం.
భారత ఎన్నికల సంఘం రేపు న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ‘ఓట్ చోరీ’ అంటూ పలుమార్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేయడంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక, మహారాష్ట్రలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని, ఈ కారణంగానే పలు చోట్ల కాంగ్రెస్ నేతలు ఓడారని ఆయన ఆరోపించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిస్తోన్న ‘OG’ సినిమాలో నటిస్తోన్న ప్రియాంకా మోహన్ లుక్ను మేకర్స్ రివీల్ చేశారు. ఆమె కన్మని పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. అతి త్వరలోనే సెకండ్ సింగిల్ ప్రోమోను విడుదల చేస్తామని తెలిపారు. కాగా ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్ అదరగొట్టిన విషయం తెలిసిందే.
TG: మేడ్చల్లో మరో సరోగసీ దందా వెలుగులోకి రాగా నిందితులైన తల్లీకొడుకులు లక్ష్మి, నరేందర్ <<17420803>>అరెస్ట్<<>> అయిన విషయం తెలిసిందే. దర్యాప్తులో ‘6 ఫెర్టిలిటీ కేంద్రాలతో లక్ష్మికి 20 ఏళ్లుగా సంబంధాలున్నాయి. పదిసార్లకు పైగా ఎగ్ డొనేట్ చేశారు. 2సార్లు సరోగెంట్గా ఉంది. రాజమండ్రి, రంపచోడవరం గిరిజన మహిళలను టార్గెట్ చేసి వారితో ఎగ్ డొనేట్ చేయించి రూ.30వేలు ఇచ్చారు’ అని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
LICలో 350 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (AAO జనరలిస్ట్), 410 AAO స్పెషలిస్ట్, 81 అసిస్టెంట్ ఇంజినీర్స్ (సివిల్, ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-30Yrs ఉండాలి. పోస్టులను బట్టి డిగ్రీ, BE, బీటెక్, లా డిగ్రీ చదివిన వారు అర్హులు. బేసిక్ పే నెలకు ₹88,635 చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
ఏపీలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తామని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ACA) అధ్యక్షుడిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడేళ్ల కాలపరిమితితో ఏసీఏ నూతన కార్యవర్గం ఏర్పాటు చేశారు. రాబోయే మూడేళ్లలో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దుతామని తెలిపారు.
ఆసియా కప్లో పాక్తో మ్యాచును భారత్ బాయ్కాట్ చేయాలని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నారు. ‘క్రికెట్ కంటే దేశం కోసం సైనికులు చేసే త్యాగం గొప్పది. ఒక్క మ్యాచ్ ఆడకపోతే పోయేదేం లేదు. ఇది చాలా చిన్న విషయం. అన్నింటికంటే దేశమే ముఖ్యం. ఒకవేళ ఈ మ్యాచ్ ఆడితే సైనికుల త్యాగాలను ఎగతాళి చేసినట్లవుతుంది’ అని అభిప్రాయపడ్డారు. ఆసియా కప్ SEP 5న UAE వేదికగా ప్రారంభం కానుంది. IND, PAK 14న తలపడనున్నాయి.
AP: రాష్ట్రంలో మహిళా సాధికారత ఎలా ఉందో ప్రపంచానికి చాటాలని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. ఉచిత బస్సు టికెట్తో సెల్ఫీ దిగి #FREEbusTicketSelfie అనే ట్యాగ్తో SMలో పోస్ట్ చేయాలని కోరారు. ‘సోదరీమణులారా.. ఈ ప్రయాణాన్ని కలిసి సెలబ్రేట్ చేసుకోండి’ అని పేర్కొన్నారు. ఇది స్వాతంత్ర్యం, సమానత్వంతో కల్పించిన అవకాశమన్నారు. ‘స్త్రీశక్తి’తో మహిళలకు సాధికారత కల్పించడం పట్ల గర్వంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) హోం లోన్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇప్పటివరకు గృహ రుణ రేట్లు 7.50% నుంచి 8.45%గా ఉండగా, తాజా నిర్ణయంతో 7.50% నుంచి 8.70 శాతానికి పెంచింది. ఆగస్టు 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చిందని ఎస్బీఐ తెలిపింది. ఇప్పటికే లోన్ తీసుకున్న వారికి ఈ పెంచిన రేట్లు వర్తించవని, కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయని తెలుస్తోంది.
‘వార్-2’ సినిమాకు వస్తున్న రెస్పాన్స్పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ‘మేము చాలా ప్యాషన్తో తీసిన సినిమాకు ప్రజల నుంచి వస్తోన్న మద్దతు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది’ అని ఆయన రాసుకొచ్చారు. కాగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ‘వార్-2’ రెండు రోజుల్లో రూ.150కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని సినీవర్గాలు తెలిపాయి.
Sorry, no posts matched your criteria.