India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మోసపోయిన కస్టమర్లకు FY24లో ప్రభుత్వ బ్యాంకులిచ్చిన పరిహారం రూ.140 కోట్లని FM నిర్మల తెలిపారు. FY23లో ఈ విలువ రూ.42 కోట్లన్నారు. FY24లో UBI రూ.74.96 Cr, BOI రూ.20.38 Cr, IB రూ.16 Cr చెల్లించాయన్నారు. 2017 నాటి RBI రూల్స్ ప్రకారం బ్యాంకు నిర్లక్ష్యం, లోపం, వ్యవస్థ వల్ల జరిగే అనధీకృత లావాదేవీలకు కస్టమర్ జవాబుదారీ అవ్వరని చెప్పారు. ఒకవేళ నిర్లక్ష్యం కస్టమర్దే అయితే నష్టం భరించక తప్పదని వెల్లడించారు.

TG: కేంద్రమంత్రి, BJP రాష్ట్ర చీఫ్ కిషన్రెడ్డి అధ్యక్షతన HYDలో పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. ఇందులో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం అమలు సహా పార్టీలో అంతర్గత విభేదాలు, సమన్వయ లోపం వంటివి చర్చించారు. వీటితో పాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యాల గురించి విశ్లేషించారు.

తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30-40కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది.

AP: డబ్బుతో ఓట్లు కొనాలని CM చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని YCP MLC అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ‘స్థానిక సంస్థల్లో YCPకి 600కుపైగా సభ్యుల బలం ఉంది. కూటమికి 200 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ఓట్లు కొనాలని కుట్ర పన్నుతున్నారు. కానీ ఓట్లు కొనకుండా YCP విలువలతో కూడిన రాజకీయం చేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి చంద్రబాబు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

ఆర్మీ కోసం IIT ఇండోర్ స్పెషల్ షూ రూపొందించింది. TENG టెక్నాలజీ వల్ల నడుస్తుంటే విద్యుత్ ఉత్పత్తి జరిగి సోల్లోని ఒక డివైజులో స్టోర్ అవుతుంది. దీన్ని వాడుకోవచ్చు. GPSతో రియల్ టైమ్ లొకేషన్ గుర్తించొచ్చు. ఇవి భద్రతతో పాటు జవాన్ల మధ్య సమన్వయం పెంచుతాయి. ఇప్పటికే 10 జతలను DRDOకు పంపించారు. ఈ షూ వేసుకోవడం వల్ల అల్జీమర్స్ బాధితులు, విద్యార్థుల లొకేషన్ తెలుసుకోవచ్చు. ఆటగాళ్ల ప్రదర్శన మెరుగుపర్చుకోవచ్చు.

బంగ్లాదేశ్లో నిరసనకారులు ప్రవర్తిస్తోన్న తీరుపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఓ జూలోకి ప్రవేశించి అక్కడున్న జంతువులను కొందరు చిత్రహింసలకు గురిచేశారు. జింకను పట్టుకొనేందుకు ప్రయత్నించగా అది తప్పించుకున్న వీడియో వైరలవుతోంది. ఢాకాలోని షేక్ హసీనా తండ్రి షేక్ ముజ్బిర్ రెహ్మాన్ విగ్రహంపైకి ఎక్కి ఓ వ్యక్తి మూత్రం పోసి నిరసన తెలిపాడు. దీనిని అక్కడున్నవారంతా సపోర్ట్ చేస్తూ నినాదాలు చేయడం గమనార్హం.

TG: రాష్ట్రంలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. ఏ ఇంట్లో చూసినా ఎవరో ఒకరు జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ కనిపిస్తున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ ఇలా జ్వరమేదైనా ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. పేషెంట్లతో హాస్పిటల్స్ కిటకిటలాడుతున్నాయి. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ చేపట్టిన ఫీవర్ సర్వేలోనూ జ్వరాల బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నట్లు వెల్లడైంది.

యాపిల్స్పై ఉండే స్టిక్కర్లు వాటి నాణ్యతను, పెరిగిన విధానాన్ని తెలియజేస్తాయి. 4తో ప్రారంభమయ్యే 4 డిజిట్ స్టిక్కర్(ex:4026) ఉన్న పండ్లు ఎరువులు, రసాయనాలతో పండించినవి. 8తో ప్రారంభమైన 5 డిజిట్ నంబర్(ex:84131) ఉన్న ఫ్రూట్స్ సహజంగా కాకుండా జన్యుమార్పిడితో పెంచినవి. ఒకవేళ స్టిక్కర్పై 9తో ప్రారంభమయ్యే 5 డిజిట్ కోడ్(ex:93505) ఉంటే ఆ పండ్లు సహజంగా పండించినవి అని అర్థం.

ఒలింపిక్స్లో భారత్కు రెండు కాంస్య పతకాలు అందించిన షూటర్ మనూ భాకర్ను ‘పరుగుల రాణి’ పీటీ ఉష అభినందించారు. మనుతో పాటు ఆమె కోచ్ను కలిసి బెస్ట్ విషెస్ చెప్పినట్లు తెలిపారు. ‘మను, ఆమె కోచ్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో మను భారత పతాకధారిగా ఉండనున్న సందర్భంగా శుభాకాంక్షలు చెప్పాను. దేశానికి ఆమె మరెన్నో పతకాలు సాధిస్తారు’ అని ట్వీట్ చేశారు.

నేటి సాయంత్రం 6.30గంటలకు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీలు కేసీ వేణుగోపాల్, జైరామ్ రమేశ్, ఇతర సీనియర్ నేతలు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కలుస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమీ లేయర్ తొలగింపుపై సుప్రీం కోర్టు తీర్పుపై పార్టీ స్టాండ్, వ్యూహం గురించి వీరు చర్చిస్తారు. సుప్రీం తీర్పుపై భిన్న స్పందనలు రావడం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.