News July 17, 2024

బీటెక్ సీట్ల కేటాయింపు.. అలాట్‌మెంట్ ఆర్డర్ లింక్ ఇదే

image

AP: ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. అలాట్‌మెంట్ ఆర్డర్ <>లింక్‌<<>>ను ఉన్నతాధికారులు విడుదల చేశారు. విద్యార్థులు తమ APEAPCET హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి వివరాలు పొందొచ్చు.

News July 17, 2024

4 నెలల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలి: భట్టి

image

TG: సింగరేణికి కేటాయించిన ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌కు సంబంధించి మిగిలిన పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. 4 నెలల్లో గని నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికలు చేయాలని సూచించారు. సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తెలంగాణ వెలుపల తొలిసారి చేపడుతున్న ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రభుత్వ, సింగరేణి ప్రతిష్ఠను పెంచేలా పని చేయాలన్నారు.

News July 17, 2024

ఎర్రమట్టి దిబ్బల తవ్వకం ఆపండి: CMO

image

AP: వైజాగ్‌లో భౌగోళిక వారసత్వ ప్రదేశంగా పేరొందిన ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై పర్యావరణవేత్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటిపై సీఎం కార్యాలయం దృష్టి సారించింది. తవ్వకాల్ని ఆపేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణానికి హాని కలిగించే పనుల విషయంలో అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించింది. పూర్తి వివరాలతో నివేదికను సమర్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.

News July 17, 2024

చాందీపురా వైరస్ ఎవరికి సోకుతుందంటే?

image

<<13643966>>చాందీపురా<<>> వైరస్ గురించి ఓ వైద్యుడు వివరించారు. ‘చందీపురా అనేది మహారాష్ట్రలోని ఒక గ్రామం. 1965లో ఇక్కడ తొలి కేసు నిర్ధారణ అయింది. జ్వరం, తలనొప్పి, విరేచనాలు దీని లక్షణాలు. కాగా తీవ్రమైన సందర్భాల్లో మూర్ఛ, స్పృహ కోల్పోవడం, మరణం సంభవించవచ్చు. ఇసుక ఈగలు, పేలు, దోమల వల్ల సోకుతుంది. ఇది అంటువ్యాధి కాదు. 9 నెలల – 14 ఏళ్ల పిల్లలపై అధిక ప్రభావం ఉంటుంది. దీనిని నిరోధించేందుకు వ్యాక్సిన్ లేదు’ అని తెలిపారు.

News July 17, 2024

‘గబ్బర్‌సింగ్’ రీరిలీజ్ డేట్ ఫిక్స్

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘గబ్బర్‌సింగ్’ మూవీ రీరిలీజ్ కానుంది. పవన్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు. బండ్ల గణేశ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ 2012 మే 11న విడుదలై సక్సెస్ సొంతం చేసుకుంది.

News July 17, 2024

గ్రాడ్యుయేట్లకు ప్రతి నెలా రూ.10వేల భత్యం ప్రకటించిన షిండే ప్రభుత్వం

image

మహారాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం కొత్త పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా 12వ తరగతి పాసైన విద్యార్థులకు ప్రతి నెలా రూ.6000, డిప్లొమా చేసిన వారికి రూ.8వేలు, గ్రాడ్యుయేట్స్‌కు రూ.10వేల భత్యం ఇవ్వనున్నట్లు షిండే ప్రభుత్వం తెలిపింది. విద్యార్థులకు ఉపాధిని మెరుగుపరిచేందుకు నైపుణ్య శిక్షణలో భాగంగా ఏడాది పాటు ఈ భత్యం చెల్లించనున్నారు. కాగా రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి.

News July 17, 2024

ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన జైస్వాల్

image

ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ దూసుకొచ్చారు. 4 స్థానాలు మెరుగుపరుచుకుని 743 పాయింట్లతో ఆరో స్థానానికి చేరుకున్నారు. ట్రావిస్ హెడ్ అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు. టాప్-5లో సూర్య, ఫిల్ సాల్ట్, బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్ ఎనిమిదో ప్లేస్‌కు చేరారు. టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అన్రిచ్ నోర్జే టాప్‌లో ఉన్నారు.

News July 17, 2024

యాక్సిడెంట్‌లో గాయాలు.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన నవీన్ పొలిశెట్టి

image

తనకు అమెరికాలో జరిగిన <<12940311>>యాక్సిడెంట్‌పై<<>> జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టి కీలక విషయాలు వెల్లడించారు. తన చేతికి పలుచోట్ల ఫ్రాక్చర్లు అయ్యాయని, కాలికి గాయమైందని తెలిపారు. ‘ఇది చాలా కష్టంగా ఉంది. పూర్తిగా కోలుకునేందుకు కృషి చేస్తున్నా. మీ మద్దతు, ప్రేమ మాత్రమే నాకు అవసరమైన ఔషధం. దయచేసి నేను చెప్పేవాటినే నమ్మండి. త్వరలోనే బిగ్ స్క్రీన్‌పై అలరిస్తా’ అని పొలిశెట్టి తెలిపారు.

News July 17, 2024

ఒలింపిక్స్‌కు వెళ్లే భారత ప్లేయర్ల సంఖ్య ఎంతంటే?

image

ఈ నెల 26న ప్రారంభమయ్యే పారిస్ ఒలింపిక్స్‌కు భారత్ తరఫున వివిధ క్రీడాంశాల్లో 117 మంది అథ్లెట్లు పోటీ పడనున్నారు. 140 మందితో కూడిన సహాయక సిబ్బంది, అధికారులు పారిస్‌కు వెళ్లనున్నట్లు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 72 మంది సిబ్బందికి ప్రభుత్వ ఖర్చులతో పారిస్‌కు వెళ్లేందుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొంది.

News July 17, 2024

భూ పరిభ్రమణ వేగం నెమ్మదిస్తోంది!

image

పర్యావరణ మార్పుల కారణంగా భూమి కూడా భారీ మార్పులకు లోనవుతోందని స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్ జ్యూరిచ్ పరిశోధకులు తెలిపారు. వారి అధ్యయనం ప్రకారం.. ధ్రువాల వద్ద కరిగిపోతోన్న మంచు భూమధ్య రేఖ దిశగా వెళ్తోంది. తదనుగుణంగా భూమి బరువు కూడా షిఫ్ట్ అవుతోంది. ఫలితంగా పరిభ్రమణ వేగం నెమ్మదించి ‘రోజు’ వ్యవధి పెరుగుతోంది. మనిషి మనుగడపై దీర్ఘకాలంలో ఇది ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు హెచ్చరించారు.