News April 25, 2024

కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత బెయిల్ పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టు నేడు విచారించనుంది. కవితకు బెయిల్ ఇవ్వాలని నిన్న ఆమె తరఫు న్యాయవాది రాణా వాదనలు వినిపించగా.. కస్టడీ పొడిగించాలని ఈడీ తరఫు న్యాయవాది కోరారు. ఇవాళ మధ్యాహ్నం మరోసారి కవిత బెయిల్ పిటిషన్‌పై కోర్టు వాదనలు విననుంది.

News April 25, 2024

4.5 కిలోల బాల భీముడు జననం

image

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం ఉప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పుష్పలత (36) అనే మహిళకు 4.5 కిలోల మగ బిడ్డ జన్మించాడు. ఇది ఆమెకు మూడవ కాన్పు కాగా ఆపరేషన్ లేకుండా జన్మించినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. తల్లీబిడ్డ సురక్షితంగా ఉన్నట్లు పేర్కొన్నారు. సాధారణంగా పుట్టిన బిడ్డ బరువు 2.5 కిలోల నుంచి 3 కిలోల మధ్య ఉంటుంది.

News April 25, 2024

నేడు పాలిసెట్ గ్రాండ్ టెస్ట్

image

AP: పాలిసెట్-2024కు సన్నాహకంగా నేడు పాలిసెట్ గ్రాండ్ టెస్టును నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ‘పాలిసెట్ కోసం ఈ నెల 1 నుంచి ఉచిత శిక్షణ అందించాం. దానికి ముగింపుగా ఈ టెస్టును నిర్వహిస్తాం. ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో 7273మంది, ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 12513మంది విద్యార్థులు శిక్షణ పొందారు. శిక్షణ కేంద్రాల్లోనే ఉచితంగా టెస్టును నిర్వహిస్తాం’ అని పేర్కొన్నారు.

News April 25, 2024

నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

image

AP: శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అనకాపల్లి జిల్లాల్లోని 46 మండలాల్లో ఇవాళ తీవ్ర వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం నుంచి పల్నాడు జిల్లా వరకు 143 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. ఇటు రైల్వే శాఖను భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ప్రయాణికులు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది.. తాగునీరు, వైద్య బృందాలు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది.

News April 25, 2024

పంచాయతీ ఎన్నికలు ‘బ్యాలెట్’తోనే..

image

TG: లోక్‌సభ ఎలక్షన్స్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. వీటిని ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ బాక్స్ పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయించింది. మే 15లోగా బ్యాలెట్ బాక్సులకు సీళ్లు, అడ్రస్ ట్యాగ్‌లను ముద్రించాలని పంచాయతీరాజ్ కమిషనర్‌ను ఆదేశించింది. రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ఫిబ్రవరి 1తో ముగియగా.. ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.

News April 25, 2024

ఏ క్షణమైనా ఫలితాలు విడుదల

image

జేఈఈ మెయిన్-2 ఫలితాలు ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25న ఫలితాలు వెల్లడికావాల్సి ఉండగా.. ఇవాళే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఏప్రిల్ 22న జేఈఈ మెయిన్ 2024 సెషన్-2 ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేయగా.. ఫలితాలు ప్రకటించేందుకు NTA కసరత్తు చేస్తోంది. కాగా దేశ వ్యాప్తంగా 12.57 లక్షల మంది పరీక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

News April 25, 2024

ఆర్బీఐ నుంచి రూ.3వేల కోట్ల రుణం

image

ఏపీ ప్రభుత్వం మంగళవారం ఆర్బీఐ నుంచి రూ.3వేల కోట్ల రుణం తీసుకుంది. ఆర్బీఐ నిర్వహించిన వేలంలో ప్రభుత్వ సెక్యూరిటీలు అమ్మి ఈ అప్పు తీసుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆరు నెలలకు గాను రూ.47 వేల కోట్ల అప్పులకు కేంద్రం అనుమతిచ్చింది. కాగా ఈ నెల 2న ప్రభుత్వం రూ.4వేల కోట్ల రుణం తీసుకుంది.

News April 25, 2024

ఇవాళ్టి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ

image

TG: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఇవాళ్టి నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ ఇవాళ మధ్యాహ్నం కోల్‌కతా నుంచి HYD రానున్నారు. 27వ తేదీ వరకు విచారణ చేపట్టనున్న ఆయన.. ఒకరోజు మేడిగడ్డ బ్యారేజీని కూడా సందర్శించనున్నారు. విచారణ కోసం కావాల్సిన సాంకేతిక, న్యాయపరమైన సిబ్బందిని ఆయన నియమించుకోనున్నారు.

News April 25, 2024

కొనసాగుతున్న ఉత్కంఠ.. ఇవాళైనా వచ్చేనా?

image

TG: కాంగ్రెస్ పెండింగ్‌లో పెట్టిన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ ఎంపీ స్థానాల అభ్యర్థులపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇవాళ జాబితా రానున్నట్లు సమాచారం. ఖమ్మం అభ్యర్థిగా రఘురామిరెడ్డి పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతుండగా మరో అభ్యర్థిని పరిశీలించాలని ఒత్తిడి రావడంతో అధికారిక ప్రకటన ఆగింది. మరోవైపు కరీంనగర్‌కు వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్‌కు మహ్మద్ వలీ ఉల్లా సమీర్ పేర్లను INC పరిశీలించినట్లు తెలుస్తోంది.

News April 25, 2024

25 ఎంపీ సీట్లకు 124 నామినేషన్లు

image

AP: రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లకు గాను నిన్న 124 నామినేషన్లు దాఖలయ్యాయి. దాఖలు చేసినవారిలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు భారీ సంఖ్యలో ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు. కీలక అభ్యర్థుల్లో రాపాక వరప్రసాదరావు(అమలాపురం వైసీపీ), కారుమూరి సునీల్(ఏలూరు వైసీపీ), వల్లభనేని అనుదీప్(మచిలీపట్నం జనసేన), మాగుంట శ్రీనివాసరెడ్డి(ఒంగోలు టీడీపీ), వైఎస్ అవినాశ్(కడప వైసీపీ), విజయసాయి(నెల్లూరు వైసీపీ) తదితరులున్నారు.