News April 25, 2024

ఉపఎన్నిక బరిలో మాజీ సీఎం భార్య

image

ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్ భార్య కల్పన సొరెన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ మేరకు ఝార్ఖండ్ ముక్తి మోర్చా ప్రకటన విడుదల చేసింది. ఆమె గాండేయ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉపఎన్నికలో పోటీ చేస్తారని పేర్కొంది. మరోవైపు జంషెడ్‌పూర్ లోక్‌సభ నుంచి సమీర్ మోహంతి బరిలో ఉంటారని తెలిపింది.

News April 25, 2024

ఆ హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్

image

షూటింగ్‌లో భాగంగా తన అభిమాన హీరో షాహిద్ కపూర్‌ను కొట్టాలంటే భయమేసిందని స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలిపారు. ‘‘జెర్సీ’లో షాహిద్‌తో కలిసి నటించా. నేను ఆయనకు వీరాభిమానిని. తొలి రోజు షూట్‌లో ఆయననే చూస్తూ ఉండిపోయా. షూట్‌లో భాగంగా షాహిద్‌ను కొట్టాల్సి ఉంది. కానీ కొట్టలేకపోయా. మీ మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను గుర్తు చేసుకుని నన్ను కొట్టండి అని షాహిద్ చెప్పారు. ఎలాగోలా ఆ సీన్ కంప్లీట్ చేశాం’ అని ఆమె చెప్పారు.

News April 25, 2024

ప్చ్.. శాంసన్‌కు మరోసారి మొండిచేయి?

image

టీమ్ ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్‌కు మరోసారి మొండిచేయి ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత జట్టులో వికెట్ కీపర్‌గా కెఎల్.రాహుల్‌ను తీసుకునేందుకు సెలెక్టర్లు మొగ్గు చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఇప్పటికే పలు WCలు మిస్సైన సంజూ.. మరో WC వరకు ఎదురుచూడక తప్పదు. వారం రోజుల్లో జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో సంజూ అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

News April 25, 2024

బ్రాండేమో బలం.. జట్టేమో బలహీనం!

image

ఒక్కసారి కూడా IPL ట్రోఫీ గెలవకపోయినా బ్రాండ్, ఫేమ్ విషయంలో RCBని కొట్టే జట్టే లేదంటే అతిశయోక్తి కాదు. 2024లో RCB బ్రాండ్ వాల్యూ 28% పెరిగి $10.7బిలియన్లకు చేరుకుంది. అయితే.. మైదానంలో ఆ జట్టు ప్రదర్శన అంతంతమాత్రమే. ఘోరమైన రికార్డులన్నీ RCBపైనే నమోదవుతాయనే ఓ అపవాదు కూడా ట్రెండ్ అవుతోంది. కాగా.. గెలవాలంటే బలమైన బ్యాటింగ్ ఒక్కటే సరిపోదని, బౌలింగ్ కూడా ఉండాలని విశ్లేషకులు అంటున్నారు.

News April 25, 2024

ఎట్టకేలకు పెళ్లిపై స్పందించిన ఇలియానా

image

హీరోయిన్ ఇలియానా భర్త ఎవరో చెప్పకుండానే గతేడాది ఆగస్టులో బిడ్డకు జన్మనివ్వడం చర్చనీయాంశంగా మారింది. US వ్యాపారవేత్త మైఖేల్ డోలన్‌ను పెళ్లాడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే.. ఎట్టకేలకు ఆమె తన వివాహంపై మొదటిసారి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. భర్తతో వైవాహిక జీవితం అందంగా సాగుతోందని అన్నారు. డోలన్‌ తనకు ఎంతో సపోర్టివ్‌గా ఉంటారని, కష్టకాలంలో తనకు తోడుగా నిలిచారని ఇలియానా చెప్పుకొచ్చారు.

News April 25, 2024

RBI దెబ్బకు ఉదయ్ కోటక్‌కు రూ.10వేల కోట్ల లాస్

image

ఆసియా రిచెస్ట్ బ్యాంకర్‌గా గుర్తింపు పొందిన ఉదయ్‌ కోటక్‌కు RBI ఆంక్షలతో భారీ నష్టం వాటిల్లింది. కోటక్ మహీంద్ర బ్యాంక్ కొత్త క్రెడిట్ కార్డులు, మొబైల్ బ్యాంకింగ్ అకౌంట్లను జారీ చేయడంపై RBI ఇటీవల నిషేధించింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఉదయ్‌ ఇప్పటివరకు $1.3 బిలియన్లు (రూ.10వేలకోట్లు) కోల్పోయారు. ఆయన ఇంతలా నష్టపోవడం గత నాలుగేళ్లలో ఇదే అత్యధికం. ప్రస్తుతం ఆయన సంపద $14.4 బిలియన్లు.

News April 25, 2024

ఈ చెట్టు వయసు 4,855 ఏళ్లు

image

ప్రపంచంలోనే అత్యంత పురాతన చెట్టు అమెరికాలో ఉంది. కాలిఫోర్నియాలో ఉన్న ‘మెతుసెలా’ అనే చెట్టు వయసు దాదాపు 4,855 సంవత్సరాలు. సముద్ర మట్టానికి సుమారు 9500 అడుగుల ఎత్తులో బ్రిస్టిల్‌కోన్ పైన్ ఫారెస్టులో ఇది ఉంది. అడవిలో ఈ చెట్టు కచ్చితమైన స్థానాన్ని అమెరికా ఫారెస్ట్ అధికారులు ఇప్పటివరకు బహిర్గతం చేయలేదు. 1957లో ఎడ్మండ్, టామ్ హర్లాన్ అనే శాస్త్రవేత్తలు ఈ చెట్టు శాంపిల్‌ను పరీక్షించి వయసును అంచనా వేశారు.

News April 25, 2024

పట్టుమని 10 కంపెనీలు కూడా రాలేదు: షర్మిల

image

AP: వైసీపీ పాలనలో రాష్ట్రానికి పట్టుమని 10 కంపెనీలు కూడా రాలేదని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ‘రాష్ట్రంలో అభివృద్ధి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోలేదు. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. సాగర్ కాలువలు ఆధునీకరించలేదు. మూడు రాజధానులు అని ఒక్కటీ నిర్మించలేదు. మంత్రి అంబటి కాలువల్లో మట్టి కూడా తీయించలేకపోయారు. ఆయన ఒక విఫల మంత్రి’ అని ఆమె ఫైర్ అయ్యారు.

News April 25, 2024

ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల

image

ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి, ఇంటర్ పరీక్షల <>ఫలితాలు<<>> విడుదలయ్యాయి. ఈ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ విడుదల చేశారు. పదో తరగతిలో 18,185 మంది(55.81శాతం), ఇంటర్‌లో 48,377 మంది(65.77శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఏప్రిల్ 29 నుంచి మే 7 వరకు రీ వాల్యూయేషన్/రీకౌంటింగ్‌కు అవకాశం కల్పించారు. సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు.

News April 25, 2024

రిటైర్మెంట్ ప్రకటించిన పాక్ మాజీ కెప్టెన్

image

పాకిస్థాన్ మహిళా జట్టు మాజీ క్రికెటర్ బిస్మా మరూఫ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. 2006లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బిస్మా.. పాకిస్థాన్ తరఫున వన్డేలు, టీ20ల్లో అత్యధిక పరుగులు చేశారు. 136 వన్డేల్లో 3369 రన్స్, 44 వికెట్లు.. 146 టీ20ల్లో 2893 రన్స్, 36 వికెట్లు పడగొట్టారు. బిస్మా 96 మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించారు.