News July 3, 2024

విక్టరీ పరేడ్‌లో మాతో భాగమవ్వండి: జై షా

image

బార్బడోస్ నుంచి స్వదేశానికి వస్తోన్న టీమ్ఇండియాకు ఘన స్వాగతం పలికేందుకు BCCI ఏర్పాట్లు చేసింది. రేపు సా.5 గంటలకు ముంబైలోని మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు జరిగే విక్టరీ పరేడ్‌లో తమతో భాగమవ్వాలని సెక్రటరీ షా పిలుపునిచ్చారు. వాంఖడే స్టేడియంలో భారత క్రికెట్ జట్టు, కోచ్‌లు, సహాయక సిబ్బందిని సత్కరించి రూ.125 కోట్ల నగదు బహుమతి అందజేస్తామని BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు.

News July 3, 2024

రేపు ప్రధాని మోదీతో CBN భేటీ

image

ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఉ.10.15 గంటలకు ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలను వివరించనున్నారు. మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలతో భేటీ అవుతారు. వారికి పోలవరం, అమరావతి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదిక ఇవ్వనున్నారు.

News July 3, 2024

రికార్డ్స్ చూసుకోండి.. బుమ్రా బౌలింగ్ ఫెయిల్ అయింది లేదు!

image

యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో అదరగొడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 13 మ్యాచుల్లో 42 వికెట్లు పడగొట్టారు. దీంతో అత్యధిక వికెట్లు పడగొట్టిన ప్లేయర్‌గా నిలిచారు. ఆయన తర్వాత జాష్ హేజిల్‌వుడ్ 16 మ్యాచుల్లో 39, హసరంగా 16 మ్యాచుల్లో 36, షాహీన్ అఫ్రీది 18 మ్యాచుల్లో 32, మార్క్ అడైర్ 15 మ్యాచుల్లో 31 వికెట్లు తీశారు. కాగా T20 WC-2024లో బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచారు.

News July 3, 2024

డీఎస్సీ ప్రిపరేషన్‌కు సమయం

image

AP: టెట్, మెగా డీఎస్సీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమకు ప్రిపేర్ అయ్యేందుకు సమయం కావాలని నిరుద్యోగులు కోరడంతో టెట్‌కు 90 రోజులు, మెగా డీఎస్సీకి 90 రోజులు సమయం ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలో కొత్త తేదీలు ప్రకటించనుంది. మొత్తం ప్రక్రియ 6 నెలల్లోగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించనుంది. అలాగే బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన వారు కూడా మెగా డీఎస్సీ రాసేందుకు అవకాశం ఇచ్చింది.

News July 3, 2024

ఆ రోజు రాత్రంతా ఏడుస్తూనే ఉండిపోయా: గంభీర్

image

తనకు 11 ఏళ్లు ఉన్నప్పుడు 1992WCలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలవ్వడంతో రాత్రంతా నిద్ర పట్టలేదని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చెప్పారు. ఆ రోజు రాత్రంతా ఏడుస్తూ ఉండిపోయానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ సమయంలోనే భారత్ కోసం వన్డే WC సాధించాలని అనుకున్నానని, 2011లో కల నెరవేరిందని పేర్కొన్నారు. 2007 T20, 2011 వన్డే WCలు గెలవడంలో గంభీర్ ముఖ్యపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

News July 3, 2024

నాకు స్థిరమైన ఐడియాలజీ ఉండదు: చంద్రబాబు

image

AP: తనకంటూ ఓ స్థిరమైన సిద్ధాంతం ఉండదని CM చంద్రబాబు తెలిపారు. ‘మనకి ఆకాశమే హద్దు. ఎవరు ఏ ఆలోచన ఇచ్చినా బాగుంటే అమలు చేస్తాం. నా లక్ష్యం ఒక్కటే. నా ప్రతీ పనితో నా రాష్ట్ర ప్రజలకు లాభం జరగాలి. వారి జీవన ప్రమాణాలు పెరగాలి. పేదవాడికి మనం అండగా ఉండాలి. సంపద సృష్టించాలి. అందుకే రాగద్వేషాలకు తావు లేకుండా, కక్ష సాధింపుల్లేకుండా అందరికీ పెన్షన్లు ఇచ్చాం. ఏం చేసినా ప్రజాహితం కోసమే’ అని స్పష్టం చేశారు.

News July 3, 2024

మూడు నెలల్లో 5వేల పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

image

బీఎస్ఈ సెన్సెక్స్ 80వేల మార్క్ తాకడం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. 57 రోజుల్లోనే 5వేల పాయింట్లు వృద్ధి చెంది 75వేల నుంచి 80వేల మార్క్ చేరుకోవడం విశేషం. జూన్ 9న ప్రధానిగా మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సెన్సెక్స్ 3వేల పాయింట్లు పెరిగింది. సెన్సెక్స్ చరిత్రలో అత్యంత వేగంగా 5వేల పాయింట్లు పెరిగిన జాబితాలో ఈ వృద్ధి మూడోస్థానంలో ఉంది. 2021లో 28రోజుల్లోనే 5 పాయింట్లు పెరిగాయి.

News July 3, 2024

రెండు వారాల్లో జాబ్ నోటిఫికేషన్: కాంగ్రెస్

image

TG: ఎంపీ ఎన్నికలతో ప్రజా పాలనకు బ్రేకులు పడ్డాయని మరో రెండు వారాల్లో జాబ్ నోటిఫికేషన్ వస్తుందని తెలంగాణ కాంగ్రెస్ వెల్లడించింది. KTR నిరుద్యోగుల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని సెటైర్లు వేసింది. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించలేని BRS ప్రభుత్వం, యువత దశాబ్ద కాలాన్ని నాశనం చేసిందని దుయ్యబట్టింది. అంతకుముందు కేటీఆర్ AEE(సివిల్ జాబితాను) వెల్లడించాలని ప్రభుత్వాన్ని కోరారు.

News July 3, 2024

ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేకపోయానేమో: CM చంద్రబాబు

image

AP: తన విజన్‌ను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేకపోయానేమోనని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. 2019లో అమరావతి ప్రాంతంలోనూ పెద్దగా ఓట్లు రాకపోవడంపై స్పందించారు. ‘నేనెప్పుడూ పాజిటివ్‌గానే ఆలోచిస్తాను. గతాన్ని తవ్వడం వల్ల ఉపయోగం లేదు. అమరావతి, AP అభివృద్ధి కోసం పని చేసినా ప్రజలకు చెప్పలేకపోయానేమో. అధికారం కోల్పోవడం వల్ల నేనూ ఇబ్బంది పడ్డా. ప్రజలూ ఇక్కట్లపాలయ్యారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

News July 3, 2024

పవిత్రమైన ఆశయంతో అమరావతిని ప్రారంభించాం: CM చంద్రబాబు

image

AP: అమరావతి నిర్మాణాన్ని ఓ పవిత్రమైన ఆశయంతో ప్రారంభించామని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ల్యాండ్ ఇవ్వడానికి జనం ముందుకొచ్చారు. కానీ వారికి డబ్బులెలా ఇవ్వాలి? అప్పుడే ల్యాండ్ పూలింగ్ ఐడియా వచ్చింది. అమరావతి ప్రపంచంలోనే అతి పెద్ద ల్యాండ్ పూలింగ్. ప్రపంచ బ్యాంకు దీన్ని ఓ కేస్ స్టడీగా ప్రజెంట్ చేసింది. భూములు ఇచ్చిన రైతులకు ఏడాది రూ. 10వేలు ఇవ్వాలని నిర్ణయించాం’ అని గుర్తుచేసుకున్నారు.