India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

2025లో నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను UPSC ప్రకటించింది. 2025 జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11 వరకు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తులు స్వీకరించి మే 25న పరీక్ష నిర్వహించనుంది. ఆగస్టు 22 నుంచి 5 రోజుల పాటు UPSC మెయిన్స్ పరీక్షలు ఉంటాయి. వీటితో పాటు CBI, ఇంజినీరింగ్ సర్వీసెస్, CISF, NDA, IFS, CDS తదితర పరీక్షల షెడ్యూల్నూ ప్రకటించింది. వివరాలను upsc.gov.inలో ఉంచింది.

TG: రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఏకమయ్యాయని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ‘బీజేపీ పాలనలో ఎవరికీ న్యాయం జరగలేదు. దేశంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి. ఆ పార్టీ దేవుడి పేరుతో ఓట్లు అడుగుతోంది. 18 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా భర్తీ చేయడం లేదు. రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు. బీజేపీ ప్రభుత్వం వల్లే రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది’ అని ఆయన ఫైర్ అయ్యారు.

ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్ భార్య కల్పన సొరెన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ మేరకు ఝార్ఖండ్ ముక్తి మోర్చా ప్రకటన విడుదల చేసింది. ఆమె గాండేయ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉపఎన్నికలో పోటీ చేస్తారని పేర్కొంది. మరోవైపు జంషెడ్పూర్ లోక్సభ నుంచి సమీర్ మోహంతి బరిలో ఉంటారని తెలిపింది.

షూటింగ్లో భాగంగా తన అభిమాన హీరో షాహిద్ కపూర్ను కొట్టాలంటే భయమేసిందని స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలిపారు. ‘‘జెర్సీ’లో షాహిద్తో కలిసి నటించా. నేను ఆయనకు వీరాభిమానిని. తొలి రోజు షూట్లో ఆయననే చూస్తూ ఉండిపోయా. షూట్లో భాగంగా షాహిద్ను కొట్టాల్సి ఉంది. కానీ కొట్టలేకపోయా. మీ మాజీ బాయ్ఫ్రెండ్ను గుర్తు చేసుకుని నన్ను కొట్టండి అని షాహిద్ చెప్పారు. ఎలాగోలా ఆ సీన్ కంప్లీట్ చేశాం’ అని ఆమె చెప్పారు.

టీమ్ ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్కు మరోసారి మొండిచేయి ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్లో పాల్గొనే భారత జట్టులో వికెట్ కీపర్గా కెఎల్.రాహుల్ను తీసుకునేందుకు సెలెక్టర్లు మొగ్గు చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఇప్పటికే పలు WCలు మిస్సైన సంజూ.. మరో WC వరకు ఎదురుచూడక తప్పదు. వారం రోజుల్లో జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో సంజూ అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

ఒక్కసారి కూడా IPL ట్రోఫీ గెలవకపోయినా బ్రాండ్, ఫేమ్ విషయంలో RCBని కొట్టే జట్టే లేదంటే అతిశయోక్తి కాదు. 2024లో RCB బ్రాండ్ వాల్యూ 28% పెరిగి $10.7బిలియన్లకు చేరుకుంది. అయితే.. మైదానంలో ఆ జట్టు ప్రదర్శన అంతంతమాత్రమే. ఘోరమైన రికార్డులన్నీ RCBపైనే నమోదవుతాయనే ఓ అపవాదు కూడా ట్రెండ్ అవుతోంది. కాగా.. గెలవాలంటే బలమైన బ్యాటింగ్ ఒక్కటే సరిపోదని, బౌలింగ్ కూడా ఉండాలని విశ్లేషకులు అంటున్నారు.

హీరోయిన్ ఇలియానా భర్త ఎవరో చెప్పకుండానే గతేడాది ఆగస్టులో బిడ్డకు జన్మనివ్వడం చర్చనీయాంశంగా మారింది. US వ్యాపారవేత్త మైఖేల్ డోలన్ను పెళ్లాడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే.. ఎట్టకేలకు ఆమె తన వివాహంపై మొదటిసారి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. భర్తతో వైవాహిక జీవితం అందంగా సాగుతోందని అన్నారు. డోలన్ తనకు ఎంతో సపోర్టివ్గా ఉంటారని, కష్టకాలంలో తనకు తోడుగా నిలిచారని ఇలియానా చెప్పుకొచ్చారు.

ఆసియా రిచెస్ట్ బ్యాంకర్గా గుర్తింపు పొందిన ఉదయ్ కోటక్కు RBI ఆంక్షలతో భారీ నష్టం వాటిల్లింది. కోటక్ మహీంద్ర బ్యాంక్ కొత్త క్రెడిట్ కార్డులు, మొబైల్ బ్యాంకింగ్ అకౌంట్లను జారీ చేయడంపై RBI ఇటీవల నిషేధించింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఉదయ్ ఇప్పటివరకు $1.3 బిలియన్లు (రూ.10వేలకోట్లు) కోల్పోయారు. ఆయన ఇంతలా నష్టపోవడం గత నాలుగేళ్లలో ఇదే అత్యధికం. ప్రస్తుతం ఆయన సంపద $14.4 బిలియన్లు.

ప్రపంచంలోనే అత్యంత పురాతన చెట్టు అమెరికాలో ఉంది. కాలిఫోర్నియాలో ఉన్న ‘మెతుసెలా’ అనే చెట్టు వయసు దాదాపు 4,855 సంవత్సరాలు. సముద్ర మట్టానికి సుమారు 9500 అడుగుల ఎత్తులో బ్రిస్టిల్కోన్ పైన్ ఫారెస్టులో ఇది ఉంది. అడవిలో ఈ చెట్టు కచ్చితమైన స్థానాన్ని అమెరికా ఫారెస్ట్ అధికారులు ఇప్పటివరకు బహిర్గతం చేయలేదు. 1957లో ఎడ్మండ్, టామ్ హర్లాన్ అనే శాస్త్రవేత్తలు ఈ చెట్టు శాంపిల్ను పరీక్షించి వయసును అంచనా వేశారు.

AP: వైసీపీ పాలనలో రాష్ట్రానికి పట్టుమని 10 కంపెనీలు కూడా రాలేదని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ‘రాష్ట్రంలో అభివృద్ధి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోలేదు. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. సాగర్ కాలువలు ఆధునీకరించలేదు. మూడు రాజధానులు అని ఒక్కటీ నిర్మించలేదు. మంత్రి అంబటి కాలువల్లో మట్టి కూడా తీయించలేకపోయారు. ఆయన ఒక విఫల మంత్రి’ అని ఆమె ఫైర్ అయ్యారు.
Sorry, no posts matched your criteria.