News April 25, 2024

మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

image

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రేపటి నుంచి మే 2వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం తెలిపారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు.

News April 25, 2024

తెలంగాణలో పీఎం మోదీ షెడ్యూల్ ఖరారు

image

TG: రాష్ట్రంలో పీఎం మోదీ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 30న ఆందోల్‌లో జరిగే సభలో ఆయన పాల్గొంటారు. ఆరోజు సాయంత్రం ఐటీ ఉద్యోగులతో సమావేశమవుతారు. ఇక వచ్చే నెల 3,4 తేదీల్లోనూ రాష్ట్రంలో పర్యటిస్తారు. 3న వరంగల్‌ పార్లమెంటు పరిధిలో ఒక సభ, భువనగిరి, నల్గొండ స్థానాలకు కలుపుతూ మరో సభలో ప్రధాని ప్రసంగిస్తారు. ఆ తర్వాతి రోజు నారాయణపేట, వికారాబాద్‌లో జరిగే సభల్లో ప్రధాని పాల్గొంటారని పీఎంవో వర్గాలు తెలిపాయి.

News April 25, 2024

పుర్రెలతో తమిళనాడు రైతుల నిరసన

image

ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద తమిళనాడు రైతులు నిన్న ఎముకలు, పుర్రెలతో బైఠాయించి వినూత్నంగా నిరసన చేపట్టారు. ఇవి ఆత్మహత్య చేసుకున్న రైతులవని నిరసనకారులు చెబుతున్నారు. ‘వ్యవసాయంలో ఆదాయం రెట్టింపు, నదుల అనుసంధానం చేస్తామని 2019లో ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కానీ అవి నెరవేరలేదు. ఒకవేళ కేంద్రం మా డిమాండ్స్ తీర్చకుంటే వారణాసిలో మోదీపై పోటీ చేస్తాం. మేము ఏ రాజకీయ పార్టీకి చెందిన వారము కాదు’ అని తెలిపారు.

News April 25, 2024

ఇంటర్ ఫలితాలు విడుదల.. వివరాలు

image

TG: ఫస్ట్ ఇయర్‌లో 2.87 లక్షల మంది, సెకండ్ ఇయర్‌లో 3.22 లక్షల మంది పాసయ్యారు. ఫస్ట్ ఇయర్‌లో 60.01%, సెకండ్ ఇయర్‌లో 64.18% మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్‌లో బాలికలు 68.35%, బాలురు 51.05% మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్‌లో బాలికలు 72.53%, బాలురు 56.01% మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్‌లో రంగారెడ్డి జిల్లా 71.07శాతంతో టాప్ ప్లేస్‌లో, సెకండియర్‌లో ములుగు 82.95శాతంతో తొలి స్థానంలో నిలిచింది.

News April 25, 2024

రూ.25 వేల నాణేలతో నామినేషన్

image

TG: ఎన్నికల వేళ ఓటర్ల దృష్టిని ఆకర్షించేందుకు అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్‌లో ఓ స్వతంత్ర అభ్యర్థి వినూత్నంగా నామినేషన్ దాఖలు చేశారు. పేరాల మానసా రెడ్డి అనే మహిళా అభ్యర్థి తన నామినేషన్ వేసేందుకు డిపాజిట్ కింద చెల్లించాల్సిన రూ.25 వేలను చిల్లర రూపంలో చెల్లించారు. రూపాయి నుంచి పది రూపాయల వరకు నాణేలను గంపలో తీసుకొచ్చి నామినేషన్ వేశారు.

News April 25, 2024

BREAKING: ఇంటర్ ఫలితాలు విడుదల

image

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లో ఇంటర్ బోర్డు అధికారులు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఒకేసారి రిలీజ్ చేశారు. కాసేపట్లోనే ఈ ఫలితాలు సర్వర్లలో అప్‌డేట్ కానున్నాయి. మరికొద్ది క్షణాలలో అందరికంటే ముందుగా వే2న్యూస్ యాప్‌లో రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే ఉండే స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే క్షణాల్లో ఫలితం వస్తుంది. అంతే సులువుగా దీన్ని షేర్ చేయొచ్చు. Be Ready

News April 25, 2024

నామినేషన్ల దాఖలుకు రేపే లాస్ట్

image

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు త్వరపడాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణలో లోక్‌సభ, ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు రేపటితో ముగియనుంది. ఇవాళ, రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. కాగా ఈ నాలుగో దశలో తెలుగు రాష్ట్రాలతో పాటు బిహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, UP, బెంగాల్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

News April 25, 2024

వేసవిలో 100 ప్రత్యేక రైళ్లు

image

వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు తెలిపారు. ఈ నెల 28 నుంచి జులై 30 వరకు 100 స్పెషల్ ట్రైన్‌లను నడుపుతున్నట్లు చెప్పారు. విశాఖపట్నం- చెన్నై, తాంబరం-బరౌనీ, ఎరోడ్- ధన్‌బాద్, సత్రగాచి- బెంగళూరు, తాంబరం- ధన్‌బాద్, ముజఫాపూర్- సికింద్రాబాద్, మహబూబ్‌నగర్-గోరఖ్‌పూర్ తదితర స్టేషన్ల మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయని వెల్లడించారు.

News April 25, 2024

ఈ పేటకు ఎవరు మేస్త్రీ?

image

పల్నాడు(D) చిలకలూరిపేట రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతం. ఇక్కడ 5సార్లు టీడీపీ, 3సార్లు కాంగ్రెస్, స్వతంత్రులు రెండుసార్లు, వైసీపీ ఒకసారి గెలిచాయి. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి గెలిచిన విడదల రజనీ మంత్రి అయ్యారు. ఈసారి గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడిని వైసీపీ ఇక్కడ పోటీకి దింపింది. గతంలో మూడు సార్లు గెలిచిన టీడీపీ సీనియర్ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు మరోసారి సమరానికి సై అంటున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 25, 2024

కాసేపట్లో ఇంటర్ ఫలితాలు.. Way2Newsలో వేగంగా..

image

తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఉ.11 గంటలకు విడుదల కానున్నాయి. tsbie అధికారిక సైట్‌తో పాటు Way2News యాప్‌లోనూ ఫలితాలు పొందవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఇచ్చి క్లిక్‌ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఒకే క్లిక్‌తో వాట్సాప్ సహా ఏ ప్లాట్‌ఫాంకైనా రిజల్ట్ కార్డ్ షేర్ చేసుకోవచ్చు. #ResultsFirstOnWay2News