News March 26, 2024

అమెరికా మార్కెట్‌లోకి అమూల్ పాలు

image

అమూల్ పాలు ఇక అమెరికా మార్కెట్లలోనూ లభించనున్నాయి. మరో వారం రోజుల్లో లాంచ్ చేయనున్నట్లు అమూల్ మాతృసంస్థ ఎండీ జయేన్ మెహతా ప్రకటించారు. దీని కోసం 108ఏళ్ల చరిత్ర కలిగిన మిషిగన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పాల సేకరణ, ప్రాసెసింగ్ విధానాన్ని ఆ అసోసియేషన్ చూసుకుంటుందని వెల్లడించారు. త్వరలో పన్నీరు, పెరుగు, మజ్జిగను కూడా ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.

News March 26, 2024

ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాసులురెడ్డి?

image

AP: ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డినే బరిలోకి దింపాలని ఆ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలుత ఈ స్థానానికి శ్రీనివాసులు రెడ్డితో పాటు ఆయన కుమారుడు రాఘవరెడ్డి అభ్యర్థిత్వాన్ని కూడా TDP పరిశీలించింది. అయితే తన తండ్రే పోటీ చేస్తారని రాఘవరెడ్డి నిన్న ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు తీవ్రత పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రాఘవ ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు.

News March 26, 2024

జియో రూ.555 రీఛార్జ్ ఫ్రీ అంటూ ప్రచారం

image

జియో ఫ్రీ రీఛార్జ్ పేరిట సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని సైబర్ నిపుణులు హెచ్చరించారు. ‘జియో ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఉచితంగా రూ.555 రీఛార్జ్ పొందండి’ అని మెసేజ్‌లు పంపుతున్నారని తెలిపారు. ఇలాంటి ఉచిత ఆఫర్లను నమ్మి, వారు పంపిన లింకులను క్లిక్ చేస్తే వ్యక్తిగత, బ్యాంకు ఖాతా వివరాలు చోరీ అవుతాయన్నారు. వాట్సాప్‌లలో వచ్చే ఇలాంటి నకిలీ ఆఫర్లను నమ్మవద్దని సూచించారు.

News March 26, 2024

కేజ్రీవాల్ ఫొటోను డీపీగా పెట్టుకోండి: AAP

image

తమ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుతో ‘ఆప్’ సోషల్ మీడియా ఉద్యమాన్ని ప్రారంభించింది. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ‘మోదీకి అతిపెద్ద భయం కేజ్రీవాల్’ అనే క్యాప్షన్‌తో కూడిన సీఎం ఫొటోను డీపీలుగా పెట్టుకోవాలని సూచించింది. మోదీని ఎదుర్కోగల ఏకైక నేత అరవింద్ కేజ్రీవాల్ అని, ఎన్నికల వేళ ఆధారాలు లేకున్నా అరెస్టు చేశారని మండిపడింది.

News March 26, 2024

సీఏఏతో మోదీ సర్కార్ కుట్ర: కేరళ సీఎం

image

ముస్లింలను రెండో శ్రేణి పౌరులుగా మార్చాలని పౌరసత్వ సవరణ చట్టం(CAA) ద్వారా బీజేపీ కుట్ర పన్నుతోందని కేరళ CM పినరయి విజయన్ మండిపడ్డారు. ‘ముస్లిం పాలకులు, సాంస్కృతిక సారథులు ఎందరో దేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటంలో పాలు పంచుకున్నారు. వాస్తవానికి భారత్ మాతాకీ జై, జైహింద్ అని నినదించింది ముస్లింలని సంఘ్ పరివార్‌కి తెలియదనుకుంటా. CAAకి వ్యతిరేకంగా పోరాడాలనే ఉద్దేశం కాంగ్రెస్‌కు లేదు’ అని ఫైర్ అయ్యారు.

News March 26, 2024

టెన్త్ పరీక్షలు.. విద్యార్థులకు అలర్ట్

image

TS: పదో తరగతి విద్యార్థులకు నేడు, ఎల్లుండి గంటన్నర పాటే పరీక్షలు ఉండనున్నాయి. సైన్స్‌లో భాగంగా నేడు ఫిజిక్స్ (పేపర్-1), గురువారం బయాలజీ (పేపర్-2) నిర్వహించనున్నారు. ఉ.9.30 నుంచి మ.11 వరకే ఎగ్జామ్స్ ఉండనున్నాయి. చివరి 15 నిమిషాల ముందు అంటే ఉ.10.45 గంటలకు ఆబ్జెక్టివ్ (పార్ట్-B) పేపర్ ఇస్తారు. ఫలితాలు మాత్రం ఫిజిక్స్, బయాలజీ కలిపి ప్రకటిస్తారు. ఇక 30న సోషల్ స్టడీస్‌తో ప్రధాన పరీక్షలు ముగియనున్నాయి.

News March 26, 2024

రేపటి నుంచి సీఎం జగన్ బస్సుయాత్ర

image

AP: సీఎం జగన్ రేపు ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. బుధవారం ఉదయం 10.56గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను ఆరంభిస్తారు. ఇచ్ఛాపురం వరకు మొత్తం 21 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. సిద్ధం సభలు జరిగిన 4 ఎంపీ నియోజకవర్గాలు మినహా 21 చోట్ల యాత్ర చేపట్టనున్నారు.

News March 26, 2024

అడుగంటిన జలాలు.. ఎండుతున్న పంటలు!

image

TS: భూగర్భజలాలు అడుగంటిపోవడంతో రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. రెండు మూడు బోర్లు వేయిస్తున్నా ఫలితం ఉండట్లేదని, తడి లేక పంట ఎండిపోతోందని వాపోతున్నారు. అనేక ప్రాంతాల్లో 500 అడుగుల మేర తవ్వినా నీటి జాడ లభించకపోవడం గమనార్హం. దీంతో ఆరుతడులతో ఎలాగో నెట్టుకొస్తున్నామని రైతన్నలు చెబుతున్నారు. ఎండల తీవ్రతతో మున్ముందు పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి.

News March 26, 2024

హోలీ శుభాకాంక్షలు: బైడెన్ దంపతులు

image

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా హోలీ జరుపుకొనేవారందరికీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ‘నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది హోలీ వేడుకలను చేసుకుంటారు. వసంత రుతువు ఆగమనాన్ని వివిధ రంగులతో గుర్తుచేసుకుంటారు. వారందరికీ మా ఇద్దరి తరఫున శుభాకాంక్షలు’ అని ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

News March 26, 2024

IPL: నేడు చెన్నైతో గుజరాత్ ఢీ

image

ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య చెన్నైలో మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం రెండు జట్లూ చెరో మ్యాచ్ గెలిచి సమానంగా ఉన్నాయి. కాగా.. ఇప్పటి వరకు అన్ని మ్యాచుల్లోనూ హోం టీమ్‌లే గెలిచాయి. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా ఆ ట్రెండ్ కొనసాగుతుందా లేక రుతురాజ్ సేనపై గుజరాత్ పైచేయి సాధిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.