India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అలా అని ఎటువంటి నిబంధనా లేదు. 1956లో అప్పటి PM నెహ్రూ ఈ పదవిని ప్రతిపక్షాలకిచ్చే సంప్రదాయం ప్రారంభించారు. ఎమర్జెన్సీ కాలం, కొన్ని పర్యాయాలు మినహా ఆ పదవిని ప్రతిపక్షాలే పొందాయి. ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని ప్రస్తుతం INDIA కూటమి అడుగుతోంది. ఈసారి తమకు ప్రతిపక్ష హోదా(56 MPసీట్లు) ఉందంటోంది. గత 17వ లోక్సభలో CONGకు ప్రతిపక్ష హోదా లేదు. దీంతో డిప్యూటీ స్పీకర్ స్థానాన్ని కేంద్రం ఖాళీగా ఉంచేసింది.

విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘మహారాజ’ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. జూన్ 14న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ మూవీ ఇప్పటివరకు రూ.85.3 కోట్లు రాబట్టింది. దీంతో త్వరలోనే రూ.100 కోట్ల మార్క్ అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెనర్ వార్నర్ పరోక్షంగా వారసుడిని ప్రకటించారు. రిటైర్మెంట్ అనంతరం యంగ్ బ్యాటింగ్ సెన్సేషన్ జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్తో ఉన్న ఫొటోను ఇన్స్టాలో షేర్ చేస్తూ ‘ఇక నుంచి అంతా నీదే ఛాంపియన్’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఓపెనర్గా వార్నర్ స్థానాన్ని జేక్ భర్తీ చేసే అవకాశం ఉంది. IPLలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అతడు కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడారు.

హీరో ప్రభాస్ ‘KALKI 2898AD’ రేపు రిలీజ్ కానుంది. ఆన్లైన్లో టికెట్లు పెట్టిన క్షణాల్లోనే అమ్ముడయ్యాయి. ఆంధ్ర, తెలంగాణలోనే కాదు ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. ముంబైలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మైసన్ INOXలోని జియో వరల్డ్ ప్లాజా ఒక్కో టికెట్ రూ.2,300కి విక్రయిస్తోంది. మరికొన్ని థియేటర్లలో ఫ్యాన్స్ రూ.1,760, రూ.1,560 వెచ్చించి మరీ టికెట్లు కొంటున్నారు.

టికెట్ కొని క్రికెట్ చూడాల్సి వస్తే, అది రోహిత్ కోసమేనని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. టీమ్ ఇండియా కెప్టెన్ పైసా వసూల్ పర్ఫార్మర్ అని, ఆ టికెట్ డబ్బులకు ఆయన న్యాయం చేస్తారని చెప్పారు. ఆస్ట్రేలియాపై రియల్ రోహిత్ శర్మను చూశానని, ప్రపంచకప్పుల్లో ఇలాంటి ఎంటర్టైనింగ్ బ్యాటింగ్ తానెప్పుడూ చూడలేదన్నారు వీరేంద్రుడు.

లోక్సభ స్పీకర్గా ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా ఎన్నిక లాంఛన ప్రాయంగా మారింది. స్పీకర్గా ఎన్నికయ్యేందుకు కావాల్సిన సభ్యుల మద్దతు(293) ఆయనకు ఉంది. అటు స్పీకర్ అయ్యేందుకు ఇండియా కూటమి అభ్యర్థి సురేశ్కు ఉన్న మద్దతు చాలదు. ఇదిలా ఉంటే సభ్యులకు సభలో ఇంకా సీట్లు కేటాయించకపోవడంతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ సాధ్యం కాదు. సో సభ్యులకు స్లిప్స్ ఇచ్చి, మాన్యువల్గా ఓటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది.

TG: రైతు భరోసా పథకానికి అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. ఐటీ చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు రైతుభరోసా అందకుండా చేసేందుకు ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేస్తోంది. బీడు భూములు, రోడ్లు, రియల్ వెంచర్లకూ ఈ పథకం వర్తించకూడదని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన సర్వే 10 రోజుల్లోగా పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15లోగా ఇవ్వాలని కృషి చేస్తోంది.

TG: వర్జీనియా పొగాకు రికార్డు ధర పలికింది. జంగారెడ్డిగూడెం కేంద్రంలో కిలో పొగాకు రూ.352 రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఈ కేంద్రానికి మొత్తం 1025 పొగాకు బేళ్లు రాగా 731 బేళ్ల విక్రయాలు జరిగాయి. గత ఏప్రిల్ 27న కిలో వర్జీనియా పొగాకు ధర అత్యధికంగా రూ.341 పలికింది.

పెంపుడు కుక్క కరవడంతో తండ్రీకుమారుడు మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా భీమిలిలో జరిగింది. నరసింగరావు (59), ఆయన కుమారుడు భార్గవ్ (27)ను వారం క్రితం వారి పెంపుడు కుక్క కరిచింది. భార్గవ్ను ముక్కు మీద, నరసింగరావును కాలిపై కరిచింది. ఈ ఘటన జరిగిన 2 రోజులకు కుక్క చనిపోవడంతో వారు అప్రమత్తమై యాంటీ రేబిస్ ఇంజక్షన్ తీసుకున్నారు. అయితే అప్పటికే మెదడు, కాలేయం, ఇతర భాగాలకు రేబిస్ సోకడంతో చికిత్స పొందుతూ మరణించారు.

T20WC చరిత్రలో బంగ్లాదేశ్ ఓ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఇప్పటివరకు అన్ని వరల్డ్ కప్లు ఆడి ఒక్కసారి కూడా సెమీఫైనల్కు చేరని జట్టుగా బంగ్లా మిగిలిపోయింది. ఇప్పటి వరకు తొమ్మిది T20WCలలో టాప్10లో ఉన్న ఇతర 9 జట్లు సెమీస్ చేరాయి. IND, ENG, AUS, సౌతాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్, వెస్టిండీస్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ ఏదో ఒక WCలో సెమీస్ చేరాయి. కానీ బంగ్లాదేశ్ సెమీస్లో అడుగు పెట్టలేదు.
Sorry, no posts matched your criteria.