India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎంపీ అభ్యర్థులు: విజయనగరం- అప్పలనాయుడు, ఒంగోలు- మాగుంట శ్రీనివాసులురెడ్డి, కడప-భూపేష్ రెడ్డి, అనంతపురం- అంబికా లక్ష్మీనారాయణ.
ఎమ్మెల్యే అభ్యర్థులు: చీపురుపల్లి- కళా వెంకట్రావు, పాడేరు- వెంకట రమేశ్, రాజంపేట- సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు- వీరభద్ర గౌడ్, గుంతకల్లు- గుమ్మనూరు జయరాం, కదిరి- వెంకట ప్రసాద్, భీమిలి- గంటా శ్రీనివాస్, దర్శి- గొట్టిపాటి లక్ష్మి, అనంతపురం- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్.

TG: తాను ఇంకా కాంగ్రెస్లో చేరలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆ పార్టీలో చేరే విషయమై రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడి తన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు దీపాదాస్ మున్షీ, రోహిత్ చౌదరీ ఆయన ఇంటికెళ్లి కలిశారు. శ్రీహరిని పార్టీలోకి ఆహ్వానించినట్లు మున్షీ తెలిపారు.

AP: సీఎం జగన్ మొన్నటి వరకు పరదాల చాటున తిరిగారని, ఇప్పుడు బయటికి వస్తే ప్రజలు పారిపోతున్నారని TDP చీఫ్ చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘ఎన్నికల్లో సానుభూతి కోసం గతంలో కోడి కత్తి డ్రామా ఆడారు. ఇప్పుడు వివేకా హత్య కేసులో చెల్లిని జైలుకు పంపాలని ఆలోచిస్తున్నారు. మద్యం, ఇసుకలో దోచుకున్న సొమ్ములు తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటెయినర్లో తరలిపోతున్నాయి. డబ్బుతో ఓట్లు కొనాలనుకుంటున్నారు’ అని ఆరోపించారు.

జూన్లో పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టును BCCI త్వరలోనే ప్రకటించనుంది. ప్లేయర్ల ఎంపికపై సెలక్టర్లు కసరత్తు చేస్తున్నారు. వరల్డ్ కప్లో బరిలోకి దిగే భారత ప్రాబబుల్-11ను తాజాగా Sportstar ప్రకటించింది. రోహిత్, జైస్వాల్, కోహ్లీ, సూర్య, రింకూ, హార్దిక్, జురెల్, జడేజా, అక్షర్, బుమ్రా, సిరాజ్ ఆ టీమ్లో ఉన్నారు. ఈ జట్టు ట్రోఫీ గెలుస్తుందని భావిస్తున్నారా? కామెంట్ చేయండి..

AP: అనపర్తి ఎమ్మెల్యే టికెట్ కోల్పోయిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ఇంటికి టీడీపీ నేతలు వెళ్లారు. మాజీ మంత్రి చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వద్ద నల్లమిల్లి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. వైసీపీ వాళ్లు మమ్మల్ని భౌతికంగా అంతమొందించాలని చూస్తే.. టీడీపీ అధిష్ఠానం రాజకీయంగా అంతం చేయాలని చూసిందంటూ రామకృష్ణా రెడ్డి తల్లి వాపోయారు. కాగా పొత్తులో భాగంగా అనపర్తి సీటు బీజేపీకి వెళ్లింది.

AP: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 30 ఏళ్ల పాటు జగన్ పాలన చేస్తారని జోస్యం చెప్పారు. సీఎం ఆదేశాలతో ఇకపై ఎలాంటి ఉద్యమాలు ఉండవన్నారు. పిఠాపురంలో పవన్ ఓటమి ఖాయమని చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రజలు జనసేన పార్టీని ప్యాక్ చేస్తారన్నారు. పవన్ కంటే చిరంజీవి చాలా బెటర్ అని అన్నారు.

TG: ఇటీవల 11,062 పోస్టులతో విడుదలైన డీఎస్సీ నోటిఫికేషన్కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పరీక్షకు సన్నద్ధమయ్యే BC అభ్యర్థులకు పుస్తకాల కోసం బీసీ స్టడీ సర్కిల్ రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 10వేల మందికి లబ్ధి చేకూరనుంది. దీనికోసం <

ఇజ్రాయెల్-గాజాల మధ్య యుద్ధం ఆరు నెలలుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ కాల్పుల్లో గాజా స్ట్రిప్లో 32,552 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్లు హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో 62 మంది పాలస్తీనియన్లు చనిపోయారని, 91 మందికి గాయాలయ్యాయని తెలిపింది. గతేడాది అక్టోబర్ 7న హమాస్ దాడికి ప్రతీకారంగా చేసిన ప్రతిదాడిలో అప్పుడు 1200 మంది చనిపోయారు.

ఈ ఆర్థిక ఏడాది డీజిల్ ఎగుమతులతో భారత్కు వచ్చే ఆదాయం అంతకుముందుతో పోలిస్తే 25శాతం క్షీణించినట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో 11 నెలల్లో (APR-FEB) వచ్చిన మొత్తం $20 బిలియన్లకు పరిమితమైంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో అంతకుముందుతో పోలిస్తే డీజిల్ ఎగుమతి 25.8 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 26mmtకి పెరిగినా ఫలితం లేకపోయింది. మరోవైపు పెట్రోల్ ఎగుమతుల ఆదాయం సైతం 13% క్షీణించి $10 బిలియన్లుగా నమోదైంది.

లోక్సభ ఎన్నికల నేపథ్యంలో BRSలో కీలకంగా ఉన్న నాయకులు సైతం ఇతర పార్టీలకు జై కొడుతున్నారు. ఫిరాయింపులు నచ్చకపోయినా వారి పిల్లల కోసమే పార్టీ వీడుతున్నారట. కుమార్తె కావ్య కోసం కడియం శ్రీహరి, కూతురు విజయలక్ష్మి కోసం కేకే, తనయుడు భరత్ కోసం పోతుగంటి రాములు పార్టీని వీడారు. అయితే, కాంగ్రెస్ని వీడకుండా అంటిపెట్టుకున్న జానారెడ్డి విజయం సాధించారు. తన వారసుల్లో ఒకరిని MLA చేయగా.. మరొకరికి MP సీటు లభించింది.
Sorry, no posts matched your criteria.