News August 13, 2025
WFH ఇవ్వాలని కంపెనీలకు పోలీసుల సూచన

హైదరాబాద్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో IT కంపెనీలు, ఇతర సంస్థలకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన చేశారు. సైబరాబాద్ పరిధిలోని కంపెనీలు తమ ఉద్యోగులకు రేపు వర్క్ ఫ్రమ్ సదుపాయం కల్పించాలని ఓ ప్రకటనలో కోరారు. వర్షం, వరద కారణంగా ప్రయాణ సంబంధిత సమస్యలు లేకుండా ఉండటానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మీ కంపెనీలో ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చారా? కామెంట్ చేయండి.
Similar News
News August 14, 2025
రజినీకాంత్ ‘కూలీ’ పబ్లిక్ టాక్

భారీ అంచనాల మధ్య రజినీకాంత్ ‘కూలీ’ మూవీ థియేటర్లలో విడుదలైంది. USలో ప్రీమియర్లు చూసిన సినీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రజినీ మాస్ అండ్ పవర్ఫుల్ డైలాగులతో మూవీ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. నాగార్జున కీలక పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. ఇక ఇప్పటికే వైరల్ అయిన పూజా హెగ్డే-సౌబిన్ షాహిర్ ‘మోనికా’ సాంగ్కు థియేటర్లలో పూనకాలేనని అంటున్నారు. కాసేపట్లో WAY2NEWS రివ్యూ.
News August 14, 2025
నేడే పులివెందుల, ఒంటిమిట్ట ఉపఎన్నిక కౌంటింగ్

AP: తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఉ.8 గంటలకు ప్రారంభం కానుంది. భారీ బందోబస్తు నడుమ కడప శివారులోని ఉర్దూ నేషనల్ వర్సిటీలో లెక్కింపు చేపట్టనున్నారు. మధ్యాహ్నంలోగా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. పులివెందులలో 76శాతం, ఒంటిమిట్టలో 86శాతం పోలింగ్ నమోదైంది. రెండు చోట్లా 11 మంది చొప్పున అభ్యర్థులు బరిలో ఉన్నా టీడీపీ, వైసీపీ మధ్యే హోరాహోరీ పోటీ ఉండనుంది.
News August 14, 2025
రేపు పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు

AP: కేంద్రం ఆదేశాల మేరకు రేపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. పునరుత్పాదక ఇంధన పథకాలపై అవగాహన, పశుసంవర్ధక శాఖ తోడ్పాటుతో కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడం, పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయడంపై తీర్మానాలు చేయాలని కేంద్రం సూచించింది.